నియామకాలు లేవు.. అన్నీ రద్దులే!
వైకాపా ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోగా ఖాళీ పోస్టులను రద్దుచేస్తోంది. పాఠశాల విద్యకు కొత్తగా పోస్టు మంజూరుచేయాలంటే ఖాళీ పోస్టులను విలీనం చేయాలన్న నిబంధన విధిస్తోంది.
నాలుగేళ్లలో 6,592 ఎస్జీటీ, 1,160 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టుల రద్దు
ఒక్క పోస్టు రద్దు కాదన్న మంత్రి బొత్స నోరు మెదపడం లేదు
ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం
ఇప్పుడు పోస్టులే లేకుండా చేస్తున్నారు
* అధికారంలోకి రాగానే అర్హతలు, సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తాం
ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లకు పాదయాత్రలో జగన్ హామీ
* ఒక్క పోస్టు రద్దు కాదు.. ఎక్కడా ఒక్క పాఠశాల మూతపడదు
మంత్రి బొత్స సత్యనారాయణ
వాస్తవం: కొత్తగా నియామకాలు చేపట్టకపోగా ఉన్న పోస్టులనే ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇప్పటివరకు రద్దయిన ఎస్జీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల పోస్టులే ఇందుకు నిదర్శనం.
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోగా ఖాళీ పోస్టులను రద్దుచేస్తోంది. పాఠశాల విద్యకు కొత్తగా పోస్టు మంజూరుచేయాలంటే ఖాళీ పోస్టులను విలీనం చేయాలన్న నిబంధన విధిస్తోంది. విద్య కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్కు కొత్త పోస్టులు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పేరుతో మిగులుగా తేల్చి.. రద్దుచేస్తున్నారు. ఒక్క పోస్టూ రద్దుకాదని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ వందల పోస్టులను రద్దుచేసినా నోరు మెదపడం లేదు. ఖాళీ పోస్టులను రద్దుచేస్తేనే కొత్తవాటిని ఇస్తామని ప్రభుత్వం మెలికపెట్టడంతో విద్యాశాఖ వేల పోస్టులను విలీనం చేస్తోంది. దీంతో భవిష్యత్తులో డీఎస్సీ నియామకాలు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల క్రమబద్ధీకరణ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు 7,752 పోస్టులను రద్దుచేసింది. బోధనేతర పోస్టుల కోసం సైతం బోధన పోస్టులను తీసేసింది. భవిష్యత్తులో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా కొత్త ఉపాధ్యాయ నియామకాలు లేకుండా ఖాళీలను విలీనం చేసేస్తోంది.
ఇలా పోతున్నాయి..
మండలానికి ఇద్దరు విద్యాధికారుల చొప్పున నియమించేందుకు 692 పోస్టులను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ పోస్టులను ఇచ్చేందుకు ఇప్పటికే ఖాళీగా ఉన్నవాటిని విలీనం చేయాలని మెలికపెట్టింది. దీంతో పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,145 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు రద్దయ్యాయి. నూతన విద్యావిధానంలో ఈ టీచింగ్కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, రాష్ట్రప్రభుత్వం ఆ పోస్టులు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒప్పంద, పార్ట్టైమ్ కింద 5,742 మంది ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తమ పోస్టులను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందేమోనని వారు ఎదురుచూస్తుండగా.. ప్రభుత్వం ఏకంగా పోస్టులు లేకుండా చేస్తోంది.
* రాష్ట్ర విభజన సమయంలో పాఠశాల విద్యాశాఖలోని అదనపు డైరెక్టర్ల పోస్టులు తెలంగాణకు వెళ్లిపోయాయి. వీటిని కొత్తగా సృష్టించేందుకంటూ గతంలో 15 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులను రద్దుచేసింది. దాంతో ఉన్నతాధికారులు పదోన్నతులు పొందారు.
* ఆదర్శ పాఠశాలల్లో 3,260 ఉపాధ్యాయ పోస్టులకు సర్వీసు నిబంధనల కోసమంటూ 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దుచేసింది. కర్నూలు మినహా ఉమ్మడి 12 జిల్లాల్లో 397 చొప్పున పోస్టులను విలీనం చేసేశారు.
* ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా మార్చి, వాటిలో ఇంటర్ ప్రారంభించారు. వీటిలో బోధించేందుకు 1,752 మంది స్కూల్ అసిస్టెంట్లు అవసరం. ప్రభుత్వం కొత్తగా వీటిని మంజూరుచేయాల్సి ఉండగా.. ఇప్పటికే ఉన్న 1,752 ఎస్జీటీ పోస్టులను విలీనం చేసేసింది. భవిష్యత్తులో ఎస్జీటీ పోస్టులే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
* కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం 76 ఎస్జీటీ పోస్టులను రద్దుచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
సంక్షిప్త వార్తలు
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.