Amul Milk: అమూల్ మాకొద్దు
అమూల్ డెయిరీ తమకొద్దని కర్ణాటక కన్నెర్ర చేసింది. తమ రాష్ట్రంలో పాలు సేకరించొద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అభ్యంతరం చెప్పారు.
మొన్న కర్ణాటక.. తాజాగా తమిళనాడు అభ్యంతరం
ఏపీలో పెద్దపీట వేస్తున్న సీఎం జగన్
పాల సేకరణ నుంచి అన్నీ తానై చక్కబెడుతున్న సర్కారు
బంగారుపళ్లెంలో పెట్టి ఆస్తులు అప్పగిస్తున్న వైనం
ఈనాడు - అమరావతి
అమూల్ డెయిరీ తమకొద్దని కర్ణాటక కన్నెర్ర చేసింది. తమ రాష్ట్రంలో పాలు సేకరించొద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అభ్యంతరం చెప్పారు. సహకార స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలు వద్దంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. సీఎం జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్కే గర్వకారణంగా నిలిచిన విజయ డెయిరీని చంపేసి.. అమూల్ను తెచ్చారు. దక్షిణాదిన తొలిగా అమూల్కు స్వాగతం పలికింది ఆయనే. కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు అమూల్ రాకతో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నాయి. సీఎం జగన్ మాత్రం.. అమూల్తోనే ప్రయాణమంటూ గుజరాత్కు చెందిన జీసీఎంఎంఎఫ్ (గుజరాత్ సహకార పాల పంపిణీ సమాఖ్య)కు ఎర్రతివాచీ పరిచి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్) ఆధ్వర్యంలోని సహకార డెయిరీలను మూసేసి.. వాటికి చెందిన వేల కోట్ల ఆస్తుల్ని బంగారు పళ్లెంలో పెట్టి అమూల్కు అప్పగిస్తున్నారు.
అక్కడి ముఖ్యమంత్రులకు తెలియకనా? జగన్ అంత ముందుచూపు లేకనా?
రాష్ట్రంలో అమూల్ వచ్చాక పాల సేకరణ ధర పెరిగిందని, రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే.. కర్ణాటకలో గతంలో ఉన్న భాజపా ప్రభుత్వంలోని నేతలే అమూల్కు ఎందుకు అభ్యంతరం చెప్పారనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయమూ.. ప్రభుత్వ పెద్దలకు తెలుసా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
* 1974లో ఏర్పాటైన కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (కేఎంఎఫ్) 22వేల గ్రామాల్లో 24 లక్షల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తూ.. రోజుకు రూ.17 కోట్లకు పైగా చెల్లిస్తోంది. సుమారు 65కు పైగా పాలు, పాల ఉత్పత్తులను నందిని బ్రాండ్పై మార్కెటింగ్ చేస్తోంది. బెంగళూరులో అమూల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామనే నిర్ణయంతో అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పార్టీలకు అతీతంగా అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
* తమిళనాడులో 1981 నుంచి అవిన్ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా పాలసేకరణ, ఉత్పత్తుల విక్రయం జరుగుతోంది. రాష్ట్రంలో 9,673 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా 4.5 లక్షల మంది సభ్యుల నుంచి 35 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు.
* అన్ని రాష్ట్రాల్లో రైతులకు దాణా, గడ్డి, మినరల్ మిక్చర్తో పాటు పశువుల ఆరోగ్య పరిరక్షణ, పునరుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వమే అమూల్ ప్రతినిధిలా
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వమే అమూల్ ప్రతినిధిలా వ్యవహరిస్తోంది. గ్రామాల్లో సంఘాలను ఏర్పాటుచేసి వారి ద్వారా పాలను సేకరించి అమూల్కు సరఫరా చేస్తోంది. అవసరమైన ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు (ఏఎంసీయూ), బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను (బీఎంసీయూ) కూడా తానే ఏర్పాటు చేస్తోంది. భవనాల నిర్మాణం, యంత్రాలకు సుమారు రూ.3వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. ఇవి కాకుండా ఏపీడీడీసీఎఫ్ ఆధ్వర్యంలోని యూనిట్లను అప్పనంగా తక్కువ ధరకే కట్టబెడుతోంది. చిత్తూరు డెయిరీతో పాటు మదనపల్లె ప్లాంటును ఇప్పటికే అప్పగించింది. పట్టణాల్లో అమూల్ ఔట్లెట్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తోంది. ఇవన్నీ పైసా పెట్టుబడి లేకుండా కల్పించే ప్రయోజనాలే. పశుసంవర్థక అధికారులతోపాటు ఏపీడీడీసీఎఫ్ కూడా అమూల్ కోసమే పనిచేస్తున్నాయి. జిల్లాల్లో సంయుక్త కలెక్టర్ల నుంచి గ్రామాల్లో పశుసంవర్థక సహాయకుల వరకు నిత్యం అమూల్ సేవలోనే తరిస్తున్నారు. అమూల్తో రైతుల ఆదాయం పెరిగిందంటూ.. సహకార డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామని తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీకి జగన్ నీళ్లొదిలేశారు.
అధిక ధరలే అయితే.. పాలు పోయాలంటూ ఒత్తిడి ఎందుకు?
రాష్ట్రంలో గుజరాత్ పాల ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణకు జగన్ పచ్చజెండా ఊపి.. 30 నెలలు అవుతోంది. అయినా ఇప్పటివరకు రోజువారీ పాలసేకరణ 2 లక్షల లీటర్లు కూడా చేరలేదు. ధరలు ఎక్కువగా ఉంటే రైతులు పాల పోయరా? ఎవరైనా ఆపగలరా? అనే విచక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. వాస్తవానికి ఇతర డెయిరీలు ఇచ్చే ధరలతో పోలిస్తే రైతులకు అమూల్ చెల్లించేది తక్కువే. ఎస్ఎన్ఎఫ్ పేరుతో రైతులకు ఇచ్చే ధరలో కోత పెడుతోంది. అమూల్ కంటే కృష్ణా మిల్క్ యూనియన్, సంగం డెయిరీ, విశాఖ డెయిరీలు లీటరుకు రూ.7-15 వరకు అధికంగా చెల్లిస్తున్నాయి. ఏటా బోనస్లు ఇస్తున్నాయి. వీర్యాన్ని పంపిణీ చేయడంతోపాటు దాణా, వైద్యసేవలు అందిస్తున్నాయి. అయినా ప్రభుత్వం అమూల్కు పెద్దపీట వేస్తూ పాడి రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.