రోమ్‌లో కీలక పదవికి తెలుగు ఐఏఎస్‌ అధికారి బాలాజీ

ఇటలీలోని రోమ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో వ్యవసాయ విభాగం మంత్రి పోస్టులో అస్సాం - మేఘాలయ కేడర్‌కు చెందిన 2001 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి జుజ్జవరపు బాలాజీ నియమితులయ్యారు.

Updated : 31 May 2023 06:03 IST

ఈనాడు, దిల్లీ: ఇటలీలోని రోమ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో వ్యవసాయ విభాగం మంత్రి పోస్టులో అస్సాం - మేఘాలయ కేడర్‌కు చెందిన 2001 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి జుజ్జవరపు బాలాజీ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌. ఈ సంయుక్త కార్యదర్శి స్థాయి పోస్ట్‌లో మూడేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ బాలాజీ ఆ పోస్టులో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని