రాష్ట్రంపై ఉరుముతున్న వరుణుడు

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు రావచ్చని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated : 31 May 2023 05:04 IST

అత్యధికంగా మాచర్ల మండలం కొప్పునూరులో 95 మి.మీ వర్షం

ఈనాడు, అమరావతి: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు రావచ్చని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరులో 95 మి.మీ. ప్రకాశం జిల్లా కొండెపి మండలం కె.ఉప్పలపాడులో 91 మి.మీ వర్షపాతం నమోదైంది. కృష్ణా, అంబేడ్కర్‌ కోనసీమ, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

బుధవారం అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, పశ్చిమగోదావరి, పల్నాడు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం మన్యం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని