అంకెల రంకెలు!
పోలవరం ప్రాజెక్టులో తొలిదశ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2022 జనవరిలో రూ.10,911 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంచనాలు సమర్పించినా అవి కొలిక్కి రాలేదు.
పోలవరం తొలిదశ అంచనాలు భారీగా పెంపు
ఏడాదిన్నర కిందట రూ.10,911 కోట్లు
ఇప్పుడు రూ.16,952 కోట్లు
ప్రాజెక్టు పురోగతిపై నేడు దిల్లీలో సమీక్ష
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టులో తొలిదశ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2022 జనవరిలో రూ.10,911 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంచనాలు సమర్పించినా అవి కొలిక్కి రాలేదు. మళ్లీ తొలిదశ అంచనాలు లెక్కకట్టి సమర్పించాలని కేంద్ర జల్శక్తి శాఖ కోరిన మేరకు మే ప్రారంభంలో కేంద్రానికి నివేదిక పంపారు. తాజాగా తొలిదశ అంచనాలే రూ.16,952 కోట్లకు చేరిపోయాయి. ఏడాదిన్నరలో కొన్ని అదనపు పనులు, అదనపు భూసేకరణ, పునరావాసంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఒకవైపు పోలవరానికి నిధులపరంగా జగన్ సర్కార్ సాధించింది ఏమీ లేకపోగా, మరోవైపు ఎప్పటికప్పుడు కొత్త అంచనాలు అంటూ సాగుతున్న ప్రహసనంలో అంకెలు మారిపోతూ వస్తున్నాయి. కేంద్రజల్ శక్తిశాఖ మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో గురువారం దిల్లీలో పోలవరం పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. తొలిదశ అంచనాలపైనా కేంద్రమంత్రి చర్చించనున్నారని సమాచారం. నిధుల విషయంలో నాలుగేళ్లుగా జగన్ సర్కార్లో సాగుతున్న ప్రహసనం కొలిక్కి వచ్చేనా? లేక మళ్లీ పెండింగులో పడేనా అన్నది తేలనుంది.
తొలిదశపైనే పెద్ద సందిగ్ధం
పోలవరం ప్రాజెక్టులో తొలిదశ నిధులు ఇవ్వడంపైనే పెద్దఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారుల్లోనే ఈ తొలిదశ ప్రహసనంపై సందేహాలు ఉన్నాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 2017-18 ధరలతో సుమారు రూ.55 వేల కోట్లతో సవరించిన అంచనాలను రెండో డీపీఆర్గా సమర్పించారు. అప్పట్లోనే కేంద్రం అనేక సందేహాలు లేవనెత్తితే నెలల తరబడి అధికారులు దిల్లీలో మోహరించి వాటిని నివృత్తి చేశారు. ఆ అంచనాల్ని పరిశీలించి కేంద్ర జల్శక్తి ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) 2019 ఫిబ్రవరిలో వాటికి ఆమోదం తెలిపింది. టీఏసీ ఆమోదం పొందితే దాదాపు డీపీఆర్ 2 కొలిక్కి వచ్చినట్లుగా భావించాలి. అలాంటిది జగన్ సర్కార్ ఏర్పడ్డాక టీఏసీ ఆమోదం పొందిన అంచనాలపై రివైజ్డు కాస్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. వారు అధ్యయనం చేసి రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపారు. ఆ ప్రతిపాదనను కేంద్రజల్ శక్తి శాఖ ఆమోదించి ఆర్థికశాఖకు పంపాక, కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందితే డీపీఆర్ 2 కింద నిధులు ఇచ్చే ఆస్కారం ఉంది. జగన్ సర్కార్ ఆ డీపీఆర్పై పోరాడి నిధులు సాధించుకోలేక పోయింది. డీపీఆర్ను ఆమోదించి తొలిదశగా కొన్ని నిధులు ఇవ్వవచ్చు. ఆ తర్వాత రెండోదశ కింద అదే డీపీఆర్ 2 నుంచి నిధులిచ్చే వీలుంది. అలాంటిది మళ్లీ 41.15 మీటర్ల ఎత్తు వరకు నీరు నిల్వ చేస్తే ఎంత ఖర్చవుతుందో ఆ మొత్తం తొలిదశగా అంచనాల్ని తయారు చేసి పంపాలని కేంద్రజల్ శక్తి శాఖ కోరడం, జగన్ సర్కార్ ఆ కోణంలో ముందుకు సాగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేక ఏళ్ల పాటు పోలవరం డీపీఆర్ 2పై కసరత్తు చేసి రెండు కీలక కమిటీలు ఆమోదం తెలిపాక అది పక్కన పెట్టి మళ్లీ రెండేళ్లుగా తొలిదశ నిధులంటూ ప్రహసనం సాగడం సందేహాలకు తావిస్తోంది. పోలవరంలో 45.72 మీటర్ల స్థాయి వరకు పునరావాసం, భూసేకరణకు కేంద్రం నిధులు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకోసం పోరాడకుండా తొలిదశ నిధుల అంచనాలు సమర్పించడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు సృష్టించే ఆస్కారం ఉందనే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజానికి పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేశాకే కేంద్రం నిధులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అనేక ఏళ్ల పాటు డీపీఆర్ 2 కసరత్తు పూర్తిచేసి కేంద్రం తొలిదశ అంచనాలు కోరడం, రాష్ట్రం సమర్పించడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. దిల్లీలో ఇటీవల పోలవరంపై ఉన్నతస్థాయిలో జరిగిన సమావేశంలో ఒక పోలవరం అధికారి ఈ అంశంపైనా ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులే ఈ సందేహాలు వ్యక్తం చేస్తున్నా జగన్ సర్కార్ పోలవరం నిధుల విషయంలో రాజకీయంగా గట్టిగా వ్యవహరించలేకపోతోందనే అనుమానాలు సర్వత్రా ఉన్నాయి.
పాక్షిక డయాఫ్రం వాల్కు రూ.300 కోట్ల పైనే
ప్రాజెక్టులో గతంలో ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రూ.467.72 కోట్లతో పూర్తిచేశారు. కొన్నిచోట్ల 300 అడుగుల లోతు నుంచి నిర్మించారు. అలాంటిది ప్రస్తుతం పాక్షికంగానే నిర్మాణం చేపడుతున్నారు. లోతూ అంతగా అవసరం లేదు. ప్రస్తుత డయాఫ్రం వాల్ను అక్కడక్కడా కొంతమేర సరిదిద్దాల్సి ఉంది. ఈ పాక్షిక పనికి రూ.331 కోట్లు అంచనాగా లెక్కించారు. నాడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించిన మొత్తంలో 70 శాతం నిధుల్ని మళ్లీ ఖర్చు చేసి పాక్షికంగా నిర్మించేలా అంచనాలు రూపొందించారు.
తొలిదశలో పెంపు ఇలా...
* ప్రధాన డ్యాం సివిల్ పనులు, కాలువల పనుల్లో మిగిలి ఉన్న వాటికి రూ.6,593.02 కోట్లు.
* ప్రధాన డ్యాంలో కోత, పాక్షిక డయాఫ్రం వాల్ పనులకు రూ.2,020 కోట్లు.
* ఇతర పనులు, నిర్వహణ ఖర్చులకు రూ.945 కోట్లు కావాలని, భూసేకరణ, పునరావాసం కోసం తొలిదశలో రూ.7,394 కోట్లు.
ఎత్తిపోసే అవసరమే లేకున్నా...
నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టుల్లో ఎంతో అనుభవం ఉన్న మేఘ ఇంజినీరింగు సంస్థ పోలవరం డ్యాం ప్రాజెక్టు పనులు చేపట్టింది. నిజానికి తొలి అంచనాల్లో పోలవరంలో నీటిని ఎత్తిపోసే అవసరమే లేదు. అలాంటిది ప్రస్తుతం ఇక్కడ రూ.వందల కోట్లు వెచ్చించి నీటిని ఎత్తిపోసే పరిస్థితులు ఏర్పడటం చర్చనీయాంశమవుతోంది. ఎగువ కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడం ఒక సమస్యగా మారి పోలవరంలో ఇబ్బందులు సృష్టించింది. మరోవైపు ఎగువ కాఫర్ డ్యాంను నిర్మించి, దిగువ కాఫర్ డ్యాంను సకాలంలో పూర్తి చేయకపోవడంతో మరో సమస్య తలెత్తింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ అంశాన్ని తప్పుపట్టింది. దిగువ కాఫర్ డ్యాంను వరదల లోపు పూర్తి చేయకపోవడం వల్ల నీరు మళ్లీ వెనక నుంచి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తింది. దీంతో ఇక్కడ నీటి ఎత్తిపోతకు అవసరమైన పంపులు, ఇతర పరికరాలకు రూ.149 కోట్లు, వాటిని ఉపయోగిస్తూ నీటిని ఎత్తిపోసినందుకు రూ.127.91 కోట్లు ఖర్చయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM