ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సినీనటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర, కుమార్తె తేజస్విని, తెదేపా కార్యదర్శి నర్సిరెడ్డి హాజరయ్యారు.
పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి, కుమార్తె
వినుకొండ, న్యూస్టుడే: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సినీనటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర, కుమార్తె తేజస్విని, తెదేపా కార్యదర్శి నర్సిరెడ్డి హాజరయ్యారు. వారికి ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో ముద్రించిన టీషర్ట్ను అందిస్తూ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం వినుకొండకు చెందిన డీఎల్డీఏ ఛైర్మన్ లగడపాటి వెంకట్రావు సతీమణి వెంకాయమ్మ స్మారకార్థం వారి కుమారుడు సుబ్బారావు 5300 డాలర్లను ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు జి.మల్లికార్జునరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా