విద్యుత్ రంగంలో రూ.33 లక్షల కోట్ల పెట్టుబడి కావాలి
దేశంలో విద్యుత్తు డిమాండ్ 2026-27 నాటికి 277.2 గిగావాట్లకు, 2031-32 నాటికి 366.4 గిగావాట్స్కు చేరుతుందని జాతీయ విద్యుత్తు ప్రణాళిక కమిటీ పేర్కొంది.
2031-32 నాటికి 366.4 గిగావాట్స్ కరెంట్కు డిమాండ్
ఆంధ్రప్రదేశ్కు 24,387 మెగావాట్లు కావాలి
తెలంగాణకు 27,059 మెగావాట్లు అవసరం
పదేళ్ల అంచనాలపై జాతీయ విద్యుత్తు ప్రణాళిక కమిటీ నివేదిక
ఈనాడు, దిల్లీ : దేశంలో విద్యుత్తు డిమాండ్ 2026-27 నాటికి 277.2 గిగావాట్లకు, 2031-32 నాటికి 366.4 గిగావాట్స్కు చేరుతుందని జాతీయ విద్యుత్తు ప్రణాళిక కమిటీ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,98,986 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉందని, భవిష్యత్తు డిమాండ్ను అందుకోవాలంటే 2022-27 మధ్యకాలంలో 2,11,819 మెగావాట్లు, 2027-32 మధ్యకాలంలో 2,91,802 మెగావాట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ సామర్థ్యాన్ని విస్తరించాలంటే 2022-27 మధ్యకాలంలో రూ.14,54,188 కోట్లు, 2027-32 మధ్యకాలంలో రూ.19,06,406 కోట్లు కలిపి పదేళ్లలో రూ.33,60,594 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఈ కమిటీ అంచనా వేసింది. ఇందులో డెవలపర్స్ ఈక్విటీ కింద రూ.8,40,149 కోట్లు, రుణం కింద రూ.25,20,446 కోట్లు సమీకరించాల్సి వస్తుందని వెల్లడించింది. 2021-22లో 2,03,115 మెగావాట్ల మేర ఉన్న రాష్ట్రాల విద్యుత్తు డిమాండ్ 2026-27 నాటికి 2,77,201 మెగవాట్లకు, 2031-32 నాటికి 3,66,393 మెగావాట్లకు చేరుతుందని తెలిపింది. పదేళ్లలో విద్యుత్తు డిమాండ్ 80% మేర పెరగనున్నట్లు వెల్లడించింది.
మెగావాట్ ఖర్చు రూ.8.56 కోట్ల నుంచి రూ.10.83 కోట్లకు
2022-23లో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి మెగావాట్కు రూ.8.56 కోట్లు ఖర్చవుతుండగా, 2031-32 నాటికి ఈ ధర రూ.10.83 కోట్లకు (26%పెరుగుదల) చేరనున్నట్లు అంచనా వేసింది. మిగతా వనరుల ద్వారా చేసే విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు కూడా పెరగనున్నట్లు వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 13,510 మెగావాట్లు
2031-32 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ డిమాండ్ 94%మేర, తెలంగాణ డిమాండ్ 91%మేర పెరగనున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఏపీలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్పవర్ స్టేషన్ స్టేజ్-2 కింద 800 మె.వా, నార్ల తాతారావు టీపీఎస్ స్టేజ్-4లో 800 మెగావాట్లు, పోలవరం ప్రాజెక్టు కింద 960 మెగావాట్ల జలవిద్యుత్తు, పిన్నాపురం, సోమశిల, అవుకు, ఎర్రవరం, పైడిపాలెం ఈస్ట్, పైడిపాలెం నార్త్, శింగనమల, అప్పర్సీలేరు, గండికోట, చిత్రావతి, కురుకుట్టి, కర్రివలస వద్ద నిర్మించిన పంప్డ్స్టోరేజ్ ప్లాంట్ల నుంచి 10,950 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది.
తెలంగాణలో నూతనంగా 6,400 మెగావాట్లు
2022-32 మధ్యకాలంలో తెలంగాణలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో (5×800) 4వేల మెగావాట్లు, ఎన్టీపీసీ యూనిట్లు 1, 2 నుంచి 1,600 మెగావాట్లు, సింగరేణి యూనిట్ 3 నుంచి 800 మెగావాట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నట్లు ఈ కమిటీ అంచనా వేసింది. 2022-32 మధ్యకాలంలో తెలంగాణలోని రామగుండం బీటీపీఎస్-యూ2 (62.5మె.వా) రిటైర్ కానున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్