అద్దెకూ దిక్కు లేని ఆర్బీకేలు
‘విత్తనం నుంచి పంట విక్రయ కేంద్రం వరకు.. అంతా రైతు భరోసా కేంద్రాలే చూసుకుంటాయి.. రైతుల్ని చేయి పట్టి నడిపిస్తాయి’ అని ముఖ్యమంత్రి జగన్ తరచూ చెబుతుంటారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఏవీ దొరకని దుస్థితి
వచ్చిన కాసిన్ని.. వైకాపా వారికే సమర్పణ
అద్దె యంత్ర కేంద్రాలూ అధికార పార్టీ వారికే
వేల సంఖ్యలో సిబ్బంది కొరత
ఈనాడు, అమరావతి - ఈనాడు యంత్రాంగం
‘విత్తనం నుంచి పంట విక్రయ కేంద్రం వరకు.. అంతా రైతు భరోసా కేంద్రాలే చూసుకుంటాయి.. రైతుల్ని చేయి పట్టి నడిపిస్తాయి’ అని ముఖ్యమంత్రి జగన్ తరచూ చెబుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయంటూ భుజాలు చరుచుకుంటున్నారు. అయితే ఆర్బీకేలు ఏర్పాటు చేసి రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ అధిక శాతం సేవలు మృగ్యమే. సౌకర్యాల కల్పనపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు రెండేళ్లుగా అద్దె కూడా చెల్లించకపోవడంతో వాటి యజమానులు తాళాలేస్తున్నా.. కాసింతైనా చలనం లేదు. మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి 6,854 పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీకి ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తోంది. వేల పోస్టులు ఖాళీగా ఉంటే సేవలు ఎలా అందుతాయనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి కొరవడింది. ఈ-క్రాప్, ఈకేవైసీ నమోదుతోపాటు ఇతర సేవలు సరిగా అందడం లేదు. ఆర్బీకేల ఏర్పాటు ద్వారా 22 రకాల సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. అందులో మూడింట ఒక వంతు కూడా సక్రమంగా అందించలేకపోతున్నామనే విషయాన్ని విస్మరిస్తోంది.
రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులేవీ అక్కడ లభించవు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణనే ప్రభుత్వం గాలికొదిలేసింది. ఆర్బీకేల్లో సిబ్బందికి యాప్ల్లో వివరాల నమోదు, ఇతర పనులను అప్పగిస్తోంది. దీంతో రైతులకు వ్యవసాయ సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేకపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలపై ‘ఈనాడు’ రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించగా.. ఎక్కడా సరిగా సేవలు అందుతున్న దాఖలాలే లేవు. అన్నింటికీ ఆర్బీకే అని ఘనంగా చెప్పడమే కానీ.. అక్కడ ఏమీ దొరకవు, ఈ-క్రాప్ ఒక్కటే నమోదు చేస్తారని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బదిలీ హడావుడి మొదలు కావడంతో.. అధిక శాతం సిబ్బంది కార్యాలయాలు వదిలి, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని వివరిస్తున్నారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న ఆర్బీకేల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రెండేళ్ల నుంచి రూ.30 కోట్లకు పైగా అద్దె బకాయిలు పేరుకుపోవడంతో భవన యజమానులు ఆర్బీకేలకు తాళాలు వేస్తున్నారు. ఆర్బీకేలు అద్భుతమంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. పట్టుమని రూ.30 కోట్ల బకాయిలు కూడా చెల్లించలేకపోవడం గమనార్హం. ఎరువుల నిల్వకు తీసుకున్న గోదాములకూ అద్దెలు చెల్లించడం లేదు. దీంతో వాటి యజమానులు అద్దెకు సరిపడా ఎరువుల బస్తాలు తీసుకెళ్లిపోతున్నారని పలువురు వ్యవసాయ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది లేకుండా సేవలు ఎలా?
రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో వ్యవసాయ సహాయకుడు రెండు, మూడు ఆర్బీకేల్లో ఇన్ఛార్జి బాధ్యతలు చూడాల్సి వస్తోంది. పశుసంవర్థకశాఖ సహాయకులు సరిపడా లేక కొన్నిచోట్ల గోపాలమిత్రల సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయినా పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. ఉద్యానశాఖ సహాయక పోస్టులనూ భర్తీ చేయడం లేదు. దీంతో నామమాత్ర సేవలకే పరిమితమవుతున్నాయి.
ఎరువులు, విత్తనాలు.. సీఎం మాటల్లోనే
ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఇతర ఉత్పత్తులన్నీ ఉంటాయని సీఎం చెప్పడమే తప్ప అవేవీ అందుబాటులో ఉండవు.
* ప్రతి గ్రామంలో ఎరువులు అందుబాటులో ఉంటే రైతులకు శ్రమ తగ్గుతుంది. అయితే అధిక శాతం కేంద్రాల్లో సరిపడా నిల్వలే ఉండటం లేదు. రాష్ట్రంలో గతేడాది 3.77 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే ఆర్బీకేల ద్వారా విక్రయించారు. ఆర్బీకేలకు సరఫరా పేరుతో సహకార పరపతి సంఘాలకు కేటాయింపులో ప్రభుత్వం కోత పెడుతోంది. దీంతో రైతులకు సొసైటీల్లోనూ ఎరువులు దొరకని పరిస్థితి.
* రైతు భరోసా కేంద్రాల పేరు చెబితేనే వ్యాపారులు ఉలిక్కిపడుతున్నారు. వాటికి పురుగుమందులు సరఫరా చేస్తే ఎన్నేళ్లకు డబ్బులిస్తారో తెలియదని భయపడుతున్నారు. దీంతో వాటిలో పురుగుమందులు కూడా దొరకడం లేదు. రైతులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. గతేడాది మిరపలో నల్లతామర నివారణకు వాడే కొత్తతరం మందులు మొదట్లో రూ.1,500కు అమ్మారు. తర్వాత ఆ ధర రెట్టింపయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్బీకేల్లో ఇలాంటివి అసలే దొరకవు.
* గ్రామాల వారీగా పంటల సాగు, అవసరమయ్యే విత్తన రకాలను గుర్తించి ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడంపై శ్రద్ధ లేదు. డిమాండును బట్టి వ్యాపారులు సీజన్లో మిరప విత్తనాల ధరలను కిలో రూ.1.50 లక్షల వరకు కూడా పెంచేస్తున్నారు. ఇలాంటి రకాలేవీ ఆర్బీకేల ద్వారా ఇవ్వడం లేదు. ఇచ్చిన కాసిన్ని కూడా అధికార పార్టీకి చెందిన వారికే అందుతున్నాయి. దీంతో రైతులు నల్లబజారులో అధిక ధరలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి.
* ఆర్బీకేల్లో కనీసం స్టేషనరీ కూడా అందుబాటులో లేదు. అంతెందుకు? పశుసంవర్థక సహాయకులకు రెండేళ్లుగా మందుల సరఫరాయే లేదు. గతంలో సరఫరా చేసిన మందులు గడువు తీరిపోయాయి. కొత్తగా ఇవ్వాలనే ఆలోచనా చేయలేదు. పశుపోషకులు వచ్చి అడిగినా తమ దగ్గర మందుల్లేవని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఇటీవల నిధులు విడుదల చేసినా.. మందులు ఎప్పటికి వస్తాయో తెలియడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ అయితేనే.. అద్దె యంత్ర కేంద్రాలు
రాయితీపై అద్దె యంత్ర కేంద్రాలను అధికార పార్టీకి చెందిన రైతు సంఘాలకే కట్టబెట్టారు. నలుగురు సభ్యుల పేర్లతో సంఘాన్ని ఏర్పాటు చేసి రాయితీపై పరికరాలు తీసుకున్నా.. వాటిని వైకాపా నేతలే సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో 6,500 ఆర్బీకేల పరిధిలో అద్దె యంత్ర కేంద్రాలకు వ్యవసాయ ఉపకరణాలను అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 90% కేంద్రాల్లో అవి రైతులకు ఉపయోగపడటం లేదు.
* రాష్ట్రంలోని 9,277 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకు మిత్ర, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు పోతోంది. క్షేత్రస్థాయిలో రెండు శాతం కేంద్రాల్లోనూ అలాంటి సేవలు అందవు. బ్యాంకులతో సమన్వయలోపాన్ని చక్కదిద్దే పరిస్థితి లేదు.
* మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకోవడంతోపాటు ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పత్తులను బుక్ చేసుకునేందుకు కియోస్క్లు ఏర్పాటు చేశారు. వాటికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. సహాయకుల మొబైల్ ఫోన్ల నుంచే కనెక్ట్ చేసుకోవాలి. దీంతో రోజులో 10 నిమిషాలు ఆన్ చేసి తర్వాత ఆపేయండని కొందరు అధికారులే సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైన అంశాలు
* తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ముందు డబ్బు చెల్లిస్తేనే పురుగుమందులు ఇస్తున్నారు. అవీ మార్కెట్ ధర కంటే ఎక్కువే ఉన్నాయి. విత్తనాలు, ఎరువులను వైకాపా నేతలు చెప్పిన వారికే ఇస్తున్నారు. ప్రశ్నిస్తే ఇతర రైతులకూ కొంత ఇచ్చాం కదా అంటున్నారు. అద్దె యంత్ర పరికరాలనూ అధికార పార్టీ వారికే ఇచ్చారు.
* గుంటూరు జిల్లా ఆర్బీకేల్లో రైతులకు అవసరమైన పురుగుమందులు లేవు. రాయితీ యంత్ర పరికరాలను వైకాపా నేతలకు చెందిన సంఘాలకే కట్టబెట్టారు. రైతులు సూక్ష్మపోషకాలు కోరుతున్నా ఇవ్వడం లేదు.
* పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఆర్బీకేలోనూ బ్యాంకింగ్ సేవలందడం లేదు. రైతు భరోసా కేంద్ర సిబ్బందే.. ధాన్యం కొనుగోలులో మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ 40 కిలోల బస్తాకు 2 కిలోలు అదనంగా ఇవ్వాలని చెబుతున్నారు.
* నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో పురుగుమందులు కావాలని ఆర్డర్ పెడితే.. నెల తర్వాత వస్తున్నాయి. ప్రముఖ కంపెనీల క్రిమిసంహారకాలు లభించడం లేదని వలేటివారిపాలెం మండల రైతులు చెప్పారు.
* కృష్ణా జిల్లా పామర్రులో అరకొరగానే భూసార పరీక్షలు చేస్తున్నారు. ధాన్యం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* శ్రీకాకుళం జిల్లాలో ఆర్బీకేల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పాతపట్నంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల్లో ఆర్బీకేలను నిర్వహిస్తున్నారు. ఎరువులు, విత్తనాలనూ వైకాపా నేతల సిఫార్సులతోనే ఇస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుతో దోచుకుంటున్నారని, ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు రైతులు వాపోయారు.
* కర్నూలు జిల్లాలో కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు కూడా అందడం లేదు. పత్తికొండ రైతు భరోసా కేంద్రంలో కియోస్క్ యంత్రం కొన్నాళ్లుగా పనిచేయడం లేదు. ఆదోని మండలం ఇస్వీలో ఆర్బీకేకి అద్దె కట్టకపోవడంతో ఖాళీ చేయించారు. దీంతో సచివాలయంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు.
* కడప జిల్లాలో ఎరువులు, కూరగాయల విత్తనాలు లేవు. రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడు ఆర్బీకేను 5 నెలల కిందట మూసివేశారు. రెండు రోజుల కిందటే తెరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ