పోలవరం పూర్తికి 2025 వరకు గడువివ్వండి
పోలవరం ప్రాజెక్టుకు తొలిదశ కింద నిధులు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ప్రతిపాదనపై గురువారం నాటి దిల్లీ సమావేశంలోనూ స్పష్టత రాలేదు.
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
ఏడాది ముందే పూర్తిచేయాలన్న కేంద్రం
ప్రాజెక్టు నిర్మాణంలో గడువులు మీరొద్దన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
తొలిదశ నిధులపై రాని స్పష్టత
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు తొలిదశ కింద నిధులు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ప్రతిపాదనపై గురువారం నాటి దిల్లీ సమావేశంలోనూ స్పష్టత రాలేదు. మే నెల ప్రారంభంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.17,144 కోట్లతో తొలిదశ అంచనా వ్యయంగా పంపిన ప్రతిపాదనలపై ఇంకా అడుగు ముందుకుపడలేదు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో దిల్లీలో గురువారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినా పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం ఆ ప్రతిపాదనలు పరిశీలించి వాటిని కేంద్ర జల్శక్తి శాఖకు పంపాలని మంత్రి ఆదేశించారు. తర్వాత ఆ శాఖ పరిశీలించి ఆర్థికశాఖకు పంపాలి. నిధులు వచ్చేస్తున్నాయని రాష్ట్ర పెద్దలు చెబుతూ ఉన్నా, గురువారం నాటి సమావేశంలో తొలిదశ నిధులకు ఆమోదముద్ర వేయవచ్చని ప్రభుత్వం తరఫున ప్రచారం సాగినా అలాంటి అంశం ఏదీ సమావేశంలో చోటు చేసుకోలేదు. పోలవరంపై ఇప్పటికే రాష్ట్రం ఖర్చుచేసిన రూ.1800.39 కోట్లు రీయింబర్సు చేయాలని ఏపీ అధికారులు కోరగా, చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి షెకావత్ హామీ ఇచ్చారు.
రూ.550 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు కేంద్ర జల్శక్తి అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సమావేశం ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపైనే జరిగింది. ఏ పని ఎప్పటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారో ఆ ప్రణాళికలో ఒక్కరోజు కూడా గడువు మీరొద్దని కేంద్రమంత్రి ఏపీ అధికారులను హెచ్చరించారు. కేంద్ర మంత్రి అధ్యక్షతన, కేంద్ర జల్శక్తి కార్యదర్శి పంకజ్కుమార్, కేంద్రమంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్ల ఆధ్వర్యంలో గురువారం దిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు (జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో), ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీరు సుధాకర్బాబు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో శివానంద్కుమార్, సభ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ఒక్క రోజూ గడువు మీరొద్దు
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ఆలస్యం అయ్యాయని, ఇక ఒక్కరోజు కూడా గడువు మీరకుండా చూడాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రణాళికలో పేర్కొన్నట్లుగా పనులు పూర్తిచేయాల్సిందేనని అన్నారు. 2025 జూన్ నాటికి ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తికి గడువును ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించగా దానిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలవరం గడువుల్లో జూన్ అని చెబుతున్నా.. సంవత్సరాలు మారిపోతున్నాయని, 2021 నుంచి ఎప్పుడూ ఇదే కనిపిస్తోందని వెదిరె శ్రీరామ్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో కేంద్రమంత్రి షెకావత్ 2025 జూన్ వరకు గడువు పెంపు సరికాదని, 2024 జూన్ నాటికే పూర్తిచేయాలని ఆదేశించారు.
వర్షాకాలంలోపు పూర్తిచేయాలి
వర్షాలు ప్రారంభం అయ్యి, వరదలు వచ్చే లోపు ప్రధాన డ్యాంలో కోతపడ్డ ప్రాంతంలో పనులు పూర్తిచేయాలని కేంద్ర మంత్రి షెకావత్ ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్న సీపేజీలను నిరోధించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని, వరదల లోపు ఆ పని పూర్తిచేసుకుని ప్రధాన డ్యాం నిర్మాణంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈలోపు డయాఫ్రం వాల్ డిజైన్లకు ఆమోదం పొంది, పనులు ప్రారంభించాలన్నారు. వీటిలో ఏది ఆలస్యమైనా మళ్లీ ఒక సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పాలిగన్ మ్యాప్లు చూశారా?
పోలవరం ప్రాజెక్టు తొలిదశ అంచనాల్లో భూసేకరణ, పునరావాసానికి అదనంగా రూ.5,127 కోట్లు ప్రతిపాదించిన అంశం చర్చకు వచ్చింది. లైడార్ సర్వే ప్రకారం 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలబెడితే మరో 36 గ్రామాలు, 48 ఆవాసాలు ఆ పరిధిలోకే వస్తాయని తేలిందని ఏపీ అధికారులు తెలిపారు. దీనివల్ల తొలిదశలోనే మరో 16,642 కుటుంబాలను తరలించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులూ అలాగే చెప్పడంతో వెదిరె శ్రీరామ్ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. లైడార్ సర్వే ఫలితాలను సమగ్రంగా అధ్యయనం చేశారా? అని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో, పాలిగన్ మ్యాప్లు పరిశీలించారా అని కూడా ప్రశ్నించారు. దానికీ వారినుంచి సమాధానం రాలేదు. పాలిగన్ మ్యాప్లు ఇంపోజ్ చేసి.. ఏ మేరకు ముంపు ఏర్పడుతుందో గమనించకుండానే ఇన్ని గ్రామాలు తొలిదశలోకి వస్తాయని ఎలా నివేదిస్తారని పోలవరం అథారిటీని వెదిరె శ్రీరామ్ ప్రశ్నించినట్లు తెలిసింది. లైడార్ సర్వేకు 8-9 నెలల సమయం ఎందుకని ఏపీ అధికారులను నిలదీశారు. రెండు మూడు వారాల్లోనే ఈ సర్వే పూర్తి చేయవచ్చన్నారు.
రూ.17,144 కోట్లు అడిగాం
- నారాయణరెడ్డి
ఈనాడు, దిల్లీ: ‘‘పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి కేంద్రాన్ని రూ.17,144 కోట్లు అడిగాం. అది పరిశీలనలో ఉంది. దాన్ని త్వరగా ప్రాసెస్ చేయాలని అధికారులకు కేంద్రమంత్రి చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి దీనిపై ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు అడుగులు వేగంగా పడుతున్నాయి. తాజా సమావేశంలో పునరావాసం, సవరించిన అంచనాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపుపైనా చర్చ జరిగింది’’ అని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. కేంద్రమంత్రితో సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంకా సమావేశాలు ఉంటాయా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇది నిరంతర ప్రక్రియ అని, చర్చలు ఇక్కడితో ముగియవని అన్నారు. కేంద్రం అడిగిన అన్ని అంశాలపై తాము వివరణ ఇస్తున్నామని, ఇందుకోసం దిల్లీలో, పోలవరం ప్రాజెక్టు అథారిటీ దగ్గర ప్రత్యేకంగా బృందాలు ఉన్నాయన్నారు. సవరించిన అంచనాల గురించి అడగ్గా... ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై చర్చ జరగలేదని, 41.15 మీటర్ల తొలిదశ నిర్మాణం వరకూ రూ.17,144 కోట్ల తాత్కాలిక మొత్తం విడుదలపైనే మాట్లాడినట్లు చెప్పారు.
రెండో సవరించిన అంచనాల్లో మిగతా విషయాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.72 మీటర్ల వరకూ నిర్మాణం పూర్తవుతుందన్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు తొలిదశలో నీరు నిల్వచేసే 41.15 మీటర్ల వరకూ పూర్తవుతాయన్నారు. ఎప్పటిలోపు ప్రాజెక్టు పూర్తవుతుందన్న ప్రశ్నకు బదులిస్తూ తాజా పరిస్థితుల ప్రకారం ప్రాజెక్టు పూర్తిచేయడానికి 2025 జూన్ వరకు సమయం పడుతుందని తాము కేంద్రానికి చెప్పినట్లు వెల్లడించారు. అయితే వీలుంటే ఈ గడువును సంవత్సరం ముందుకు జరిపేందుకు ప్రయత్నించాలని కేంద్రం సూచించినట్లు పేర్కొన్నారు. అది వీలవుతుందా.. లేదా అన్నదానిపై తాము అధ్యయనం చేస్తామన్నారు. తొలిదశ ఎప్పట్లోగా పూర్తవుతుందన్న గడువులపై కసరత్తు చేసి కేంద్రానికి సమర్పిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ