‘అక్రమం’ అన్న కలెక్టర్తోనే గ్రీన్సిగ్నల్!
ఒక జిల్లా కలెక్టర్ అన్ని కోణాల్లో పరిశీలించి, అనేక లోపాలున్నాయని నిర్ధారించి, భూకేటాయింపు రద్దు చేయాలని సిఫార్సు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోగా... చివరకు ఆ కలెక్టర్తోనే ఆ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వులు ఇప్పించారంటే ఆ ప్రాజెక్టులో అధికార పార్టీ పెద్దల ప్రయోజనాలు ఏ స్థాయిలో ముడిపడి ఉన్నాయో అర్థమవుతోంది.
విశాఖలో హయగ్రీవ ప్రాజెక్టుకు ఆగమేఘాలపై జీవీఎంసీ తుది అనుమతులు
భూ కేటాయింపు రద్దు చేయాలని ఏడాది క్రితం కలెక్టర్ సిఫార్సు
‘తాడేపల్లి’ ఒత్తిడితో అదే కలెక్టర్ తాజాగా పచ్చజెండా!
ప్రస్తుత జీపీఏ హోల్డర్.. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు
ఈనాడు-విశాఖపట్నం, అమరావతి
ఒక జిల్లా కలెక్టర్ అన్ని కోణాల్లో పరిశీలించి, అనేక లోపాలున్నాయని నిర్ధారించి, భూకేటాయింపు రద్దు చేయాలని సిఫార్సు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోగా... చివరకు ఆ కలెక్టర్తోనే ఆ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వులు ఇప్పించారంటే ఆ ప్రాజెక్టులో అధికార పార్టీ పెద్దల ప్రయోజనాలు ఏ స్థాయిలో ముడిపడి ఉన్నాయో అర్థమవుతోంది. 2008లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా... చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు ఎకరం రూ.45 లక్షలు చొప్పున... నిర్దిష్ట ప్రయోజనం కోసం, కొన్ని షరతులతో విశాఖలోని ఎండాడలో కేటాయించిన ఆ 12.51 ఎకరాల భూమి విలువ... ఇప్పుడు కనీసం రూ.250 కోట్లు...! ఇప్పుడా భూమి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకొనే వైకాపా నేత, ఆడిటర్, విశాఖ స్మార్ట్సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ భూమికి ఇప్పుడు ఆయనే జీపీఏ హోల్డర్. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీకి దానిలో భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. విశాఖలో వైకాపా నాయకుల భూదందాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం.
మొదటి నుంచీ ఉల్లంఘనే..!
వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాన్ని ఉచితంగా నిర్మించడంతో పాటు, వృద్ధులు సౌకర్యంగా నివసించేందుకు వీలుగా కాటేజీలు నిర్మిస్తామంటూ 2006లో ఆ స్థలం కోసం హయగ్రీవ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు ఎకరం రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించవచ్చని జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. వృద్ధులు, అనాథలకు కాటేజీలు కడతామనే కారణం చూపించి... ఎకరం రూ.45 లక్షలు చొప్పున వై.ఎస్. ప్రభుత్వంలో హయగ్రీవ సంస్థ భూములు పొందింది. ఆ 12.51 ఎకరాల్లో 10 శాతం భూమిలో ఆ సంస్థ ఉచితంగా వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించి నిర్వహించాలన్నది షరతు. 60 శాతం భూమిలో వృద్ధులు సౌకర్యవంతంగా నివసించేందుకు వీలుగా కాటేజీలు నిర్మించి 60 ఏళ్లపైబడినవారికి విక్రయించాలి. 30 శాతం భూమిని మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ఈ ప్రకారం హయగ్రీవ సంస్థకు కేటాయించిన 60,548.40 చదరపు గజాల్లో (12.51ఎకరాలు)... 6,054.80 చదరపు గజాల్లో వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాలు నిర్మించాలి. 18,164.50 చదరపు గజాలు మౌలిక వసతుల కల్పనకు పోతుంది. ఇంకా కాటేజీల నిర్మాణానికి 36,329.10 చదరపు గజాలు ఉంటుంది. హయగ్రీవ సంస్థ అక్కడ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించకపోగా... వృద్ధులకు కాటేజీలు నిర్మించాల్సిన 36,329.10 చదరపు గజాల్లో 32,857 చదరపు గజాల్ని అప్పటికే అమ్మేసిందని, అది ఫక్తు స్థిరాస్తి వ్యాపారం తప్ప, మరొకటి కాదని ఏడాది క్రితం ప్రభుత్వానికి రాసిన లేఖలో కలెక్టర్ పేర్కొన్నారు.
వాళ్లూ వాళ్లూ పంచేసుకున్నారు
హయగ్రీవ సంస్థ 2008లోనే భూకేటాయింపులు పొందినప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. ప్రభుత్వం నుంచి చర్యలేమైనా చేపడదామనుకునేసరికి ఆ సంస్థ యాజమాన్యం కోర్టుకి వెళ్లింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల ద్వారా ప్రాజెక్టును కొనసాగించేందుకు హయగ్రీవ సంస్థకు అవకాశాలు వచ్చినా... ఎలాంటి పనులూ చేపట్టలేదు. హయగ్రీవ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్న చిలుకూరి జగదీశ్వరుడు... ఆ తర్వాతి కాలంలో గద్దె బ్రహ్మాజీకి 75 శాతం వాటా ఇస్తూ భాగస్వామిగా చేర్చుకున్నారు. అనంతరం ఆ భూమికి సంబంధించి జీవీకి.. జీపీఏ చేశారు. తన నుంచి ఆ భూమిని జీవీ, విశాఖ ఎంపీ ఎంవీవీ చేజిక్కించుకున్నారని, బ్రహ్మాజీని కూడా వారే మేనేజింగ్ పార్ట్నర్గా చేర్చి... తనకు తెలియకుండా కొన్ని స్థలాలు అమ్మేశారని 2021 డిసెంబరులో జగదీశ్వరుడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించింది.
* వీఎంఆర్డీఏ, జీవీఎంసీల నుంచి అనుమతులు లేకుండానే ఆ ప్రాజెక్టులో మిగిలిన భూమిని 30 మందికి వెయ్యి గజాల చొప్పున అమ్మేశారు. ఇందులో అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ వైకాపా ఎమ్మెల్యేకు రెండు ప్లాట్లు, ఓ రాజ్యసభ సభ్యుడికి ఒక ప్లాటు కేటాయించినట్లు సమాచారం.
కలెక్టర్ లేఖను ఆధారంగా చేసుకుని... జీవీఎంసీ మే నెల 3న ఆగమేఘాల మీద హయగీవ్ర సంస్థ ప్రాజెక్టుకి తుది అనుమతులన్నీ ఇచ్చేసింది. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ గద్దె బ్రహ్మాజీ... గత నెల 3వ తేదీ ఉదయం జీవీఎంసీ కమిషనర్ పేరుతో గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయడం. టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ (టీపీఏ) నుంచి... ఏసీపీ, డీసీపీ, సీసీపీ వరకు అన్ని అంచెల్నీ దాటుకుంటూ ఫైల్ కదలడం, కమిషనర్ సాయికాంత్ వర్మ కూడా అదే రోజు సంతకం పెట్టేయడం మెరుపు వేగంతో జరిగిపోయాయి. ఈ స్థలాన్ని జీపీఏ చేసుకున్న వ్యక్తి.. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు కావడమే దీనంతటికీ ప్రధాన కారణం. హయగ్రీవ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది కాబట్టి... భూకేటాయింపులు రద్దు చేయాలంటూ విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో పెండింగ్లో ఉండగానే... ఆ ప్రాజెక్టుకి జీవీఎంసీ అనుమతులిచ్చింది. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఆ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ‘తాడేపల్లి’ నుంచి గట్టి ఒత్తిళ్లు రావడమే కారణమని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!