Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?
రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో తుళ్లూరు, మందడం, నిడమర్రు, దొండపాడు, ఐనవోలు, అనంతవరం, పెనుమాక, నవులూరు వద్ద 5,024 టిడ్కో ఇళ్లను నిర్మించారు.
రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో తుళ్లూరు, మందడం, నిడమర్రు, దొండపాడు, ఐనవోలు, అనంతవరం, పెనుమాక, నవులూరు వద్ద 5,024 టిడ్కో ఇళ్లను నిర్మించారు. ప్రస్తుత పాలకులు వాటిలో మౌలిక వసతులు కల్పించకుండా ఇన్నాళ్లు వదిలేశారు. ఇటీవల వసతుల కల్పన మొదలుపెట్టారు. ఆ పనులు పూర్తికాకుండానే.. మే 26న సీఎం జగన్ ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. మంచినీరు, రోడ్లు, విద్యుత్తు, డ్రెయినేజీ వ్యవస్థ పనులు పూర్తి కాకుండానే.. గృహప్రవేశాలు చేయాలని అధికారులు లబ్ధిదారులను త్వరపెట్టారు. రెండు రోజుల కిందటా లబ్ధిదారులు వచ్చి ఇళ్లు చూసుకొని.. పనులేవీ కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వెంటనే పూర్తి చేస్తాం మీరు వచ్చేయండి’ అని అధికారులు చెప్పడంతో వారిని నమ్మి లబ్ధిదారులు కొందరు పెనుమాకలోని ఇళ్లలోకి గురువారం సామగ్రితో దిగారు. పనులు పూర్తికాకపోవడంతో పాలు పొంగించి వెళ్లిపోయారు. అసలు.. సీఎం పూర్తయిన ఇళ్లు ప్రారంభించారా.. లేక పనులు ప్రారంభించారా అని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?