ఆర్అండ్బీ బదిలీల్లో పని చేయని అమాత్యుని పేషీ ఒత్తిళ్లు
రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్ల బదిలీలో అమాత్యుని పేషీ చేసిన తీవ్ర ఒత్తిళ్లు పనిచేయలేదు. చివరకు నిబంధనల ప్రకారమే బదిలీలు చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు.
సిఫార్సులను పక్కన పెట్టిన కార్యదర్శి
ఈనాడు - అమరావతి: రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్ల బదిలీలో అమాత్యుని పేషీ చేసిన తీవ్ర ఒత్తిళ్లు పనిచేయలేదు. చివరకు నిబంధనల ప్రకారమే బదిలీలు చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. మార్గదర్శకాలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో ఇంజినీర్ల బదిలీలకు అమాత్యుని పేషీ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తెచ్చినట్లు, ఇందుకు వసూళ్ల పర్వం ముందే సాగిందని ఆ శాఖలో చర్చ జరిగింది. అయితే సిఫార్సులు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఆ శాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న భీష్మించుకుని కూర్చున్నారు. ఈ వ్యవహారం సీఎంవో వద్దకు వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో అమాత్యుని పేషీ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టమైంది.
ఎన్హెచ్ ఎస్ఈ పోస్టుకి విశ్వప్రయత్నాలు
* రాయలసీమ జిల్లాల జాతీయ రహదారుల విభాగం ఎస్ఈ (అనంతపురం) పోస్టు కోసం కొందరు పెద్దఎత్తున ప్రయత్నాలు చేశారు. ఇప్పుడున్న ఎస్ఈ మురళీమోహన్ స్థానంలో అక్కడికి వెళ్లేందుకు వైయస్ఆర్ జిల్లా ఎస్ఈతోపాటు, మరికొందరు లాబీయింగ్ చేసి విఫలమయ్యారు.
* అనంతపురం రెగ్యులర్ ఎస్ఈ.. వైయస్ఆర్ జిల్లాకు వెళ్లేందుకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. అది కూడా సాధ్యం కాలేదు.
* మొత్తంగా పది మంది ఎస్ఈలను బదిలీ చేశారు. దాదాపు అన్నీ నిబంధనల ప్రకారం, వారి అభ్యర్థనల మేరకే జరిగాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
* ఏఈ, డీఈలకు సంబంధించి దాదాపు 20 మంది వరకు, ప్రస్తుత స్థానంలో రెండేళ్లు దాటకపోయినా బదిలీ కోసం అమాత్యుని పేషీ ద్వారా ప్రయత్నించారు. ఇవన్నీ పక్కనపెట్టారు. దీంతో బదిలీల కోసం డబ్బులు ఇచ్చిన కొందరు ఇంజినీర్లు వాటిని వెనక్కి రాబట్టుకోవడం ఎలాగో అర్థంకాక తలలుపట్టుకుంటున్నారు.
కీలక ఉద్యోగి బదిలీ
అమాత్యుని పేషీలో కీలకంగా ఉంటూ, వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తాజాగా కావలికి బదిలీ చేశారు. సీఎంవో అధికారులు గట్టిగా చెప్పడంతో ఆన్డ్యూటీ (ఓడీ)పై ఉన్న ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఆయన అక్కడికి వెళ్తారా, మళ్లీ పేషీకే వస్తారా అనే చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!