దేహమే దేవాలయం!

మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన సుభాష్‌ చంద్రసోని, అతని కుటుంబ సభ్యులు శ్రీవారి భక్తులు. స్వామివారిపై ఉన్న విశ్వాసంతో వారు ధరించే ప్రతి ఆభరణంలోనూ శ్రీవారి రూపం ఉండేలా చూసుకుంటారు.

Published : 03 Jun 2023 05:13 IST

తిరుమల, న్యూస్‌టుడే: మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన సుభాష్‌ చంద్రసోని, అతని కుటుంబ సభ్యులు శ్రీవారి భక్తులు. స్వామివారిపై ఉన్న విశ్వాసంతో వారు ధరించే ప్రతి ఆభరణంలోనూ శ్రీవారి రూపం ఉండేలా చూసుకుంటారు. శుక్రవారం నలుగురు కుటుంబ సభ్యులు తిరుమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మెడలో వేసుకున్న ప్రతి బంగారు గొలుసులోనూ శ్రీవారి ప్రతిమే ఉంది. ఆ  ఆభరణాలు ధరించి తిరుమలలో తిరుగుతుంటే మిగతా భక్తులంతా వారిని ఆసక్తిగా చూశారు.

సర్వదర్శనానికి 20 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూ లైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఇంకా కొందరు నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని