ఆక్వారైతు ‘బరువయ్యాడా’?
ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ. 1.50 చొప్పున ఇస్తాం. మూడేళ్లలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. నాలుగో ఏడాది నుంచి చేపలు, రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం.
రాయితీ విద్యుత్తుకు అర్హుల సంఖ్య కుదింపు
ఏడాదికి రూ.284 కోట్ల ఆదా కోసం 15,237 మందికి ప్రభుత్వం మొండిచేయి
నష్టాలతో అల్లాడుతున్న రైతుపై విద్యుత్తు ఛార్జీల భారం
ఈనాడు, అమరావతి
ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ. 1.50 చొప్పున ఇస్తాం. మూడేళ్లలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. నాలుగో ఏడాది నుంచి చేపలు, రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం.
2018 మే 18న ప్రతిపక్ష నేతగా పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో జగన్మోహన్రెడ్డి
ఆక్వా రైతులందరికీ రాయితీ విద్యుత్తు హామీని జగన్ అధికారంలోకి వచ్చాక 2021-22 వరకు అమలు చేసినా.. గతేడాది ఏప్రిల్ నుంచి మడమ తిప్పేశారు. తొలుత జోన్ పరిధిలో అయిదెకరాల్లోపు చెరువులకే రాయితీ విద్యుత్తు ఇస్తామని మెలిక పెట్టారు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తర్వాత పదెకరాల వరకు చెరువులకు అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఈ-ఫిష్ సర్వే పేరుతో అర్హుల సంఖ్యను 61,682 మంది నుంచి 46,445 మందికి కుదించారు. రాయితీపై విద్యుత్తు మొత్తాన్ని కూడా రూ.957 కోట్ల నుంచి రూ.673 కోట్లకు తగ్గించారు. సాగు పడిపోయిన నేపథ్యంలో రాయితీ అంత కూడా ఉండదనేది రైతుల అభిప్రాయం. సర్వే సమయంలో ఏడాది పాటు రాయితీ విద్యుత్తు నిలిపేసి, రూ.లక్షల్లో బిల్లులు వడ్డించారు.
ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకెళ్లి బీరాలు పలికిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ధరలు పడిపోయి, పెట్టుబడులు పెరిగి.. గతేడాది రైతులు నిలువెల్లా మునిగినా సర్కారు చేయూత అందించలేదు. పైగా వారికి యూనిట్ రూ. 1.50 చొప్పున ఇస్తామన్న రాయితీ విద్యుత్తుకు కూడా కోత పెట్టారు. ఆర్థిక భారం పేరుతో ఆక్వా జోన్లను.. అయిదెకరాలు, పదెకరాల వరకే వర్తింపజేస్తామని ఆటలాడారు. మూలుగుతున్న రైతులపైనే ఏడాదిపాటు విద్యుత్తు భారం వేశారు. ఈ-ఫిష్ సర్వే పేరుతో అర్హుల సంఖ్యను తగ్గించారు. విద్యుత్తు రాయితీకి అర్హులైన రైతుల సంఖ్యకు కత్తెర వేసి, రాయితీ మొత్తాన్ని కుదించి, ప్రభుత్వంపై భారం తగ్గించుకున్నారు.
రూ.7 నుంచి రూ.2కి తగ్గించిన గత ప్రభుత్వం
రాష్ట్రంలో 2016కు ముందు స్లాట్లకు అనుగుణంగా విద్యుత్తు టారిఫ్ యూనిట్కు రూ. 4.63 నుంచి రూ.7 వరకు ఉండేది. ఆక్వా రంగానికి ప్రోత్సాహంలో భాగంగా అప్పటి ప్రభుత్వం 2016 నుంచి 2018 మే వరకు యూనిట్కు రూ. 3.86 చొప్పున ధర వసూలు చేసింది. 2019లో రొయ్యల ధరలు పతనమవడంతో.. రైతుల విజ్ఞప్తి మేరకు యూనిట్ విద్యుత్తును రూ.2కే ఇచ్చి, వారికి ఆర్థికంగా భరోసా కల్పించింది.
మరో అర్ధరూపాయి తగ్గిస్తామని.. మధ్యలోనే వెనక్కి తగ్గి
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూ. 1.50 చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2019 జూన్ నుంచి యూనిట్కు రూ. 1.50 చొప్పున సరఫరా చేశారు. మూడేళ్లలో రూ. 2,378 కోట్లు రాయితీగా ఇచ్చారు. అయితే 2022-23లో అందరికీ ఇవ్వలేమని మడమ తిప్పేశారు. ఆక్వా జోన్ పరిధిలో అయిదెకరాల్లోపు చెరువులకే వర్తింపజేస్తామంటూ ఉత్తర్వులిచ్చారు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆక్వా జోన్లో పదెకరాల వరకు విస్తరించారు. అర్హుల గుర్తింపు పేరుతో.. రాయితీ విద్యుత్తు నిలిపేశారు. దీంతో అధిక శాతం రైతులకు కరెంటు బిల్లులు రూ.లక్షల్లో వచ్చాయి. సాగులో నష్టాలతో సతమతమవుతున్న రైతు ఈ దెబ్బతో మరింత కుదేలయ్యాడు.
ఈ-ఫిష్ సర్వే పేరుతో ఏడాదికి రూ.284 కోట్ల ఆదా
ఆక్వా జోన్ పరిధిలో రైతుల్ని గుర్తించేందుకు ప్రభుత్వం ఈ-ఫిష్ సర్వే ప్రారంభించింది. 2021-22 వరకు 61,682 మంది రైతులకు యూనిట్ విద్యుత్తు రూ. 1.50 చొప్పున అందుతుండగా.. సర్వే తర్వాత అర్హుల సంఖ్యను 46,445కి కుదించేసింది. వారు సాగు చేస్తున్న 3.27 లక్షల ఎకరాలకు ఏడాదికి రూ. 672.61 కోట్లు రాయితీ చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. రైతులకు ఇచ్చే సొమ్ములో ఏడాదికి రూ. 284 కోట్లను ఆదా చేసుకునేందుకు.. గతంలో రాయితీ విద్యుత్తు అందుకుంటున్న వారిలో 24% మందికి మొండిచేయి చూపింది. వీరిలో 7 శాతం మంది చిన్న రైతులే ఉన్నా.. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా అర్హత సాధించలేకపోయారు.
సంక్షోభంలో ఆక్వా రంగం
గతేడాది నుంచి ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ధరలు పడిపోయి రైతులు భారీగా నష్టపోయారు. సాగుకు అవసరమైన దాణా, ఇతర ఉత్పత్తుల్ని అరువుపై ఇవ్వలేమని వ్యాపారులు తేల్చి చెబుతున్నారు. దీంతో చాలా చోట్ల చెరువుల్ని ఎండబెట్టారు. కొందరు రైతులు 50% చేపలు, 50% రొయ్యలు సాగు చేస్తున్నారు. కొంతకాలం వేచి చూద్దామనే ఆలోచనలో మరికొందరు ఉన్నారు. ఈ ప్రభావం క్రమంగా హేచరీలపైనా పడుతోంది. ఇప్పటికే కొన్ని మూతపడుతున్నాయి. దాణా ఉత్పత్తి పరిశ్రమలకూ ఈ సెగ తగులుతోంది. మొత్తంగా ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు వినియోగం కూడా తక్కువే. ప్రభుత్వం చెబుతున్నట్లు ఏడాదికి రూ. 673 కోట్లు కూడా రాయితీకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. ఇవన్నీ తెలిసినా.. ప్రభుత్వం నుంచి ఆక్వా రంగానికి చేయూత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి