పల్లె పేదలకు ఒక్క ఇల్లూ కట్టలేదు
రాజధాని అమరావతిలో స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శరవేగంగా అడుగులు వేస్తున్న వైకాపా ప్రభుత్వం.. 2020లో ఇళ్ల స్థలాలు కేటాయించిన సుమారు 2 లక్షల గ్రామీణ పేదలకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు.
జగన్ సర్కారులో నాలుగేళ్లయినా అతీగతీ లేదు
కడుతున్న 18.64 లక్షల గృహాలూ కేంద్రం ఇచ్చినవే
2 లక్షల మంది గ్రామీణ పేదల ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్ - అమరావతి
ఇళ్లు కట్టించేందుకు తాము చర్యలు చేపడుతుంటే.. దేవతల యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఇటీవల కొత్త పల్లవి అందుకున్నారు జగన్. రెండున్నరేళ్లయినా 2 లక్షల మంది గ్రామీణ పేదలకు ఎవరు అడ్డుపడితే ఇళ్లు మంజూరు చేయలేదు?
రాజధాని అమరావతిలో స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శరవేగంగా అడుగులు వేస్తున్న వైకాపా ప్రభుత్వం.. 2020లో ఇళ్ల స్థలాలు కేటాయించిన సుమారు 2 లక్షల గ్రామీణ పేదలకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వీరికి ఈ స్థలాలు కేటాయించారు. మరో ఏడాది కాలంలో వైకాపా ప్రభుత్వ పదవీ కాలమే ముగుస్తున్నా... ఈ స్థలాల్లో ఇళ్లు నిర్మించే ప్రయత్నమే జరగక పోవడం గమనార్హం. పేదల తలరాతలను మార్చేందుకే స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి జగన్....ఆ తలరాత మార్చే వారిలో గ్రామీణ పేదలు లేరా? ఉంటే మరి రెండున్నరేళ్లుగా ఎందుకు ఇళ్లు మంజూరు చేయలేదనే విమర్శలు గ్రామీణ లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. ఆయనకు 2 లక్షల మంది గ్రామీణ పేదల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కనిపించలేదా అని మండిపడుతున్నారు.
సొంతంగా జగన్ సర్కారు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు..
వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామీణ పేదలకు సొంతంగా ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. వినడానికి అతిశయోక్తిగా ఉన్నా ఇదే వాస్తవం. ప్రస్తుతం చేపట్టిన 18.64 లక్షల గృహాలూ కేంద్ర ప్రభుత్వమిస్తున్న ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చేవే. ఇన్ని గృహాలను కేంద్రం మంజూరు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 2 లక్షల మందికి ఇళ్లు ఇవ్వలేదా? దీని కోసం నాలుగేళ్ల సమయం పడుతుందా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కడుతున్న 18.64 లక్షల ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) పథకం కింద నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో 16.84 లక్షలు గృహాలు ఉంటే, మరో 1.80 లక్షలు గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద కేంద్రం మంజూరు చేసినవే. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు మినహా ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం నామమాత్రమే. ఒక్కో ఇంటికి ఇస్తున్న రూ.1.80 లక్షల్లో పట్టణాల్లో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమిచ్చేది రూ.30 వేలే. పట్టణాభివృద్ధి సంస్థల్లో మొత్తం రూ.1.80 లక్షలూ కేంద్ర నిధులే. అదే గత తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లతోపాటు సొంతంగా ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలు, ఇతర వర్గాలకు రూ.1.50 లక్షల చొప్పున అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఆర్థిక సాయం అందించింది.
నాలుగేళ్లయినా అయోమయంలోనే గ్రామీణ పేదలు..
నగరాలు, పట్టణాల్లో కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయంతో పేదల ఇళ్ల నిర్మాణాన్ని నెట్టుకొస్తున్న ప్రభుత్వం... గ్రామాల్లోని పేదలను మాత్రం పట్టించుకోవడం లేదు. 2020లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో రెండో దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో వీటిని చేర్చారు. 8 నెలల క్రితమే రెండో దశ కింద సుమారు 3 లక్షల నిర్మాణాలను ప్రారంభించారు. విశాఖపట్నం పరిధిలో చేపట్టే 1.14 లక్షల గృహాలతోపాటు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ్) పథకం ఎంపిక చేసిన 1.80 లక్షల గృహాలు ఇందులో ఉన్నాయి. అప్పుడు కూడా గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా అమరావతిలో చేపట్టిన 50 వేల మందికి పట్టాల పంపిణీకి సంబంధించి కేంద్రం ఇంకా ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. కానీ అక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడి చేస్తోంది. షియర్వాల్ సాంకేతికతతో కట్టేస్తామని చెబుతోంది. అయితే..గ్రామీణ పేదల ఇళ్ల మంజూరుపై నిర్లిప్తంగా ఉంది. కనీసం ఎప్పుడు వీటిని ప్రారంభిస్తారనే సమాచారం కూడా లబ్ధిదారులకు లేదు. దీంతో వారు అయోమయంలో ఉన్నారు.
ఆర్థిక భారమనే జాప్యమా?
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 2 లక్షల మంది గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు పథకాలూ వర్తించవు. గ్రామీణ పేదలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ్) పథకాన్ని అమలు చేస్తున్నా....ఆ పథక లబ్ధిదారులను గతంలోనే ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఆ పథకానికి 1.80 లక్షల మంది అర్హులున్నట్లు గుర్తించి వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 2020లో ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలో కేంద్ర పథకాలు వర్తించని గ్రామీణ ఇళ్లు సుమారు 4 లక్షల వరకు ఉంటాయని అంచనా వేశారు. వీటి నిర్మాణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. దీంతో కొత్త ఎత్తుగడ వేసిన ప్రభుత్వం...పట్టణాభివృద్ధి సంస్థల విస్తీర్ణాన్ని పెంచింది. కొన్ని కొత్త పట్టణాభివృద్ధి సంస్థలనూ ప్రకటించింది. దీంతో కొందరు గ్రామీణ లబ్ధిదారులు వాటి పరిధిలోకి వెళ్లారు. అయినా ఇంకా 2 లక్షల మంది మిగిలి ఉన్నారు. వీరంతా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై గృహనిర్మాణశాఖ అధికారుల్ని వివరణ కోరగా..గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి