‘సేఫ్’ కాదు.. అక్రమాలకు అడ్డా!
నరసరావుపేటలోని ‘సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ’ ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల తయారీలో అడుగడుగునా అక్రమాలకు పాల్పడింది.
అధిక మొత్తంలో ట్రెమడాల్ మాత్రల తయారీ
ఎగుమతి ఆర్డర్ లేని ‘ఐరిస్ సంస్థ’కు సరఫరా
ఈనాడు-అమరావతి: నరసరావుపేటలోని ‘సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ’ ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల తయారీలో అడుగడుగునా అక్రమాలకు పాల్పడింది. ఆర్డర్ కంటే ఎక్కువ మొత్తంలో మాత్రలను తయారు చేసింది. జనరిక్ పేరుతో అడిగితే.. ఏకంగా బ్రాండెడ్ పేర్లతో వాటిని సిద్ధం చేసింది. బెంగళూరులోని ఫస్ట్ హెల్త్ సొల్యూషన్ సంస్థ ద్వారా 2021 నవంబరు నుంచి 2022 డిసెంబరు అయిదో తేదీ మధ్య మూడు విడతలుగా 1,62,500 ప్యాక్లు (పది షీట్లు-వంద మాత్రలు) తయారీకి ఆర్డర్ రాగా.. 1,77,061 మాత్రలు ఉత్పత్తి చేసింది. అంటే 14,561 ప్యాకెట్లను అధికంగా తయారు చేసింది. జనరిక్ పేరుతో కావాలని బెంగళూరు సంస్థ కోరగా.. సుమారు లక్ష ప్యాకెట్లను బ్రాండెడ్ పేరుతో సిద్ధం చేసింది.
బెంగళూరుకు చెందిన ఐరీస్ హెల్త్ గ్లోబల్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 54,750 ప్యాకెట్ల ట్రెమడాల్ 225 ఎంజీ మాత్రలు తయారు చేసింది. ఐరీస్ సంస్థ ఎగుమతి కోసం అనుమతులు పొందనప్పటికీ.. మాత్రల తయారీ చేపట్టడం గమనార్హం. ట్రెమడాల్ మాత్రలను కేంద్ర ప్రభుత్వం 2018లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం(ఎన్డీపీఎస్) పరిధిలోకి తెచ్చింది. వీటి తయారీ, నిల్వ, ఎగుమతులపై ఆంక్షలు విధించింది. విదేశాలకు వాటిని ఎగుమతి చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్(సీబీఎన్) నుంచి అనుమతి తప్పనిసరి. ఇవేమీ లేకుండానే. సేఫ్ సంస్థ బెంగళూరులోని ఐరిస్ సంస్థ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు మాత్రలను తయారు చేయడం గమనార్హం.
మూడు పరిమాణాల్లో..
నొప్పుల నివారణకు వాడే ట్రెమడాల్ను అధిక మోతాదులో తీసుకుంటే దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఐసిస్ వంటి సంస్థల్లో పనిచేసే ఉగ్రవాదులు తీవ్రమైన నొప్పుల నుంచి ఉపశమనానికి, తక్షణ శక్తికి, ఎక్కువ సమయం మేల్కొని ఉండేందుకు వీటిని వాడుతుంటారు. అటువంటి మాత్రలను నిర్దేశించిన పరిణామంలో కంటే.. సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ అధిక సంఖ్యలో.. అదీ కూడా జనరిక్లో కాకుండా బ్రాండెడ్ పేర్ల(పాల్మెక్స్, న్యూ రాయల్)తో తయారు చేయడం వెనుక.. పెద్ద కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయి. సేఫ్ సంస్థ ఆవరణలో 225 ఎంజీ, 250 ఎంజీ మాత్రలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మరో ప్రైవేట్ సంస్థ ఆవరణలో 100 ఎంజీ ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల తయారీ జరిగింది. తనిఖీల సందర్భంగా 68 రకాల మందులు/పత్రాలను ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ సీజ్ చేసింది. ఇందులో 51 ట్రెమడాల్ మాత్రలకు సంబంధించినవే కావడం గమనార్హం.
స్ట్రిప్ల రూపంలో ఉన్న మాత్రలను అట్టెపెట్టెల్లో ఉంచారు. షీట్పై బ్యాచ్ నంబరు, వాడకం గడువు, ఇతరత్రా ఉన్నా.. తయారీకి వినియోగించిన మిశ్రమాల వివరాలు మాత్రం లేవు. సేఫ్ సంస్థ ఎటువంటి అనుమతులు లేకుండానే మూడు కేజీల ఆక్సికొడోన్ (oxycodone Hcl Bp)ను కొనుగోలు చేసింది. ఆరు కేజీల మేర విక్రయించింది. వీటికి సంబంధించిన కొనుగోలు బిల్లులు కూడా ఆ సంస్థ వద్ద లభించలేదు. ఆయా ఉల్లంఘనలపై యాజమాన్యాన్ని వివరణ కోరినప్పుడు.. తెలియదు.. పొరపాటు జరిగిందన్న సమాచారం వచ్చింది. దీంతో ‘సేఫ్’లో ఉత్పత్తి ప్రక్రియను నెల పాటు ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ సస్పెండ్ చేసింది. ప్రధానంగా ఈ మందుల తయారీకి ముడి సరకు చెన్నై నుంచి వచ్చింది. బెంగళూరు నుంచి ఆర్డర్లు వచ్చాయి. వీటికి సంబంధించి ప్రత్యేక అధికారిక బృందాలు చెన్నై, బెంగళూరు సంస్థల నుంచి వివరాలు సేకరించాయి. ప్రధాన వ్యక్తులు కేంద్ర నిఘా సంస్థల కస్టడీలో ఉన్నారు.
రాష్ట్రాల వారీగా ‘కోటా’
కేంద్రం ‘సైకో సబ్స్టాన్స్’ (మాదక ద్రవ్యాల) జాబితాలో ఉన్న మందుల తయారీపై కఠిన ఆంక్షలు విధించింది. ఆయా రాష్ట్రాల్లోని మందుల తయారీ సంస్థలకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చినప్పటికీ.. తయారీకి వీల్లేదని వెల్లడించింది. ఈ మేరకు ఏడాది ప్రాతిపదికన రాష్ట్రాల వారీగా తయారీ కోటాలు విధించింది. 2023 సంవత్సరానికి రాష్ట్రంలో అల్ప్రాజోలమ్ మందును 200 కిలోలు, క్లార్డియాజెపోక్సైడ్-3,000, క్లొబాజమ్-1,500, డయాజెపమ్ మందును 700 కిలోలకుమించి తయారు కాకుండా చూడాలని ఔషధ నియంత్రణ శాఖను కేంద్రం ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి