Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్లో కుంగిన గైడ్బండ్
పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే ఎగువన ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్బండ్ కుంగిపోయింది. దాదాపు 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున దీని నిర్మాణం చేపట్టారు.
దాదాపు నిర్మాణం కొలిక్కి వచ్చిన వేళ ఘటన
స్పిల్వే ఎడమ వైపు సుడిగుండాల నిరోధానికి ఏర్పాటు
సమీక్షించిన కేంద్ర జలసంఘం ఛైర్మన్
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే ఎగువన ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్బండ్ కుంగిపోయింది. దాదాపు 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున దీని నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు పనుల గుత్తేదారయిన మేఘా ఇంజినీరింగు కంపెనీయే ఈ పనులూ చేస్తోంది. ఏడాది కిందట చేపట్టిన నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చిన సమయంలో గైడ్బండ్ మధ్యలో పగులులా ఏర్పడి అప్రోచ్ ఛానల్ వైపునకు కుంగిపోయింది. గైడ్బండ్లో భాగంగా నిర్మించిన కట్ట, అందులోని రాళ్లు దిగువకు జారిపోయాయి. దీంతో ఇందులోని రిటైనింగ్ వాల్ కుంగింది. ఇందులో కటాఫ్ సరిగా లేకపోవడం వల్లే గైడ్బండ్ కుంగిపోయి ఉంటుందని కొందరు ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ విషయం తెలియజేశారు. గైడ్బండ్ ఎందుకు కుంగింది, కారణాలేమిటి, ఎలా సరిదిద్దాలనే అంశాలపై పోలవరం అథారిటీ అధికారులు, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో కొన్ని పగుళ్లు వచ్చాయని, ఆదివారం నాటికి పూర్తిగా కుంగిపోయిందని చెబుతున్నారు.
కేంద్ర జలసంఘం ఛైర్మన్ సమీక్ష
గైడ్బండ్ కుంగినట్లు తెలియగానే సోమవారం కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఖుష్విందర్ వోహ్రా.. ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీరు సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, ఇతర నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఆకృతుల సంస్థ నిపుణులు పోలవరాన్ని సందర్శించి, గైడ్బండ్ కుంగడానికి కారణాలు గుర్తించి, విశ్లేషించాలని ఆయన సూచించారు. తక్షణ చర్యలు ఏం తీసుకోవాలో తేల్చాలన్నారు. ఇంజినీర్లు పరిశీలించి ఈ సమస్య పరిష్కారానికి మార్గం కనుగొని తక్షణమే కేంద్ర జలసంఘానికి నివేదించాలని ఆదేశించారు. ఈ అంశంపై చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు ఇంజినీరు కేంద్ర జలసంఘం పెద్దలను కలిసేందుకు మంగళవారం వెళుతున్నారు.
ఏమిటీ గైడ్బండ్?
పోలవరం ప్రాజెక్టులో తొలుత ఈ గైడ్బండ్ నిర్మాణ ప్రతిపాదన లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి సహజ ప్రవాహాన్ని మార్చారు. అప్రోచ్ ఛానల్ తవ్వి, ఆ మార్గంలో స్పిల్వే మీదుగా నదిని మళ్లించారు. ఆ గణాంకాల ఆధారంగా పుణెలోని కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రంలో పోలవరం ప్రాజెక్టు నమూనా రూపొందించి అక్కడి ప్రవాహం, తదితర అంశాలపై నమూనా అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో పోలవరం స్పిల్వే ఎడమ వైపున గోదావరి ప్రవాహ వేగం వడి ఎక్కువగా ఉంటోందని తేలింది. దీనివల్ల పోలవరం ఎడమ వైపున స్పిల్వే సమీపంలో పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడతాయని గుర్తించారు. ఇది స్పిల్వేకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని భావించారు. ఈ 3డీ నమూనా అధ్యయనాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టు డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలసంఘం నిపుణులు చర్చించారు. సమస్యను పరిష్కరించేందుకు స్పిల్వేకు ఎగువన గైడ్బండ్ నిర్మించాలని ప్రతిపాదించారు. స్పిల్వే వద్ద ఈ గైడ్బండ్ నిర్మాణం లేకపోవడం, అప్రోచ్ ఛానల్ ముఖద్వారం వద్ద వెడల్పు పెంచకపోతే గోదావరి ప్రవాహం ఎడమ వైపున సెకనుకు 13.6 మీటర్ల వేగంతో, స్పిల్వే మధ్యలో సెకనుకు 9.2 మీటర్ల వేగంతో, కుడి వైపు 2.5 మీటర్ల వేగంతో ఉంటుందని లెక్కించారు. గైడ్బండ్ నిర్మాణంతో పాటు అప్రోచ్ ఛానల్ ముఖద్వారం వెడల్పు చేయడం, ఇతరత్రా కొన్ని చర్యలు తీసుకుంటే నదీ ప్రవాహ వేగం ఎడమ వైపున సెకనుకు 4 మీటర్లకు, మధ్యలో 5.5 మీటర్లకు తగ్గుతుందని, కుడి వైపున సెకనుకు 4 మీటర్లకు పెరుగుతుందని లెక్కించారు. అంటే గోదావరి ప్రవాహ వేగం స్పిల్వే పొడవునా దాదాపు ఒకేలా ఉండేలా ఈ గైడ్బండ్ నిర్మాణంతో సరిదిద్దవచ్చని తేల్చి, దీని నిర్మాణం చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు. -
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. -
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు. -
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది. -
డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
సివిల్స్లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
వేకువనే పోలీసు పంజా
పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
జగన్ హయాంలో పెరిగిన శిరోముండనం ఘటనలు
జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. -
ఏపీఈఏపీ సెట్కు 3,54,235 దరఖాస్తులు
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
వెబ్సైట్లో పాలిసెట్ హాల్టికెట్లు
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు హాల్టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
కొయ్.. రాజా.. కొయ్!
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. -
క్షేత్రస్థాయికి ఎన్నికల నిఘా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?