Polavaram Project: పోలవరానికి అదనంగా రూ.12,911 కోట్లు
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులిచ్చింది.
కేంద్ర ఆర్థిక శాఖ పచ్చజెండా
మంత్రిమండలి ముందుకు నోట్.. త్వరలో ఆమోదం
41.15 మీటర్ల ఎత్తుకు నీరు నిలిపేందుకే
తొలి దశ అని ఉత్తర్వుల్లో ప్రస్తావించని ఆర్థికశాఖ
లైడార్ సర్వేతో 41.15 మీటర్ల పరిధిలో పెరిగిన నిర్వాసితులు
వారి పునరావాసానికి నిధులివ్వని కేంద్రం
ఈనాడు, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులిచ్చింది. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రిమండలి ముందు తీర్మానం ప్రతిపాదించి.. ఆమోదం పొందాలని సూచించింది. కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం డైరెక్టర్ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం 45.72 మీటర్ల ఎత్తున నీరు నిలబెట్టేలా నిర్మించాలి. 41.15 మీటర్ల ఎత్తుకు నీరు నిలబెట్టేందుకు ఎంత ఖర్చవుతుందో.. ఆ మేరకు ఇంకెన్ని నిధులు అవసరమో అవి మంజూరు చేస్తున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. తొలి దశ కింద ఈ నిధులు ఇస్తున్నట్లు కానీ, మలి దశ రూపంలో మళ్లీ నిధులిచ్చే ప్రతిపాదన ఉన్నట్లు కానీ వాటిలో ఎక్కడా ప్రస్తావించలేదు.
పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు నిర్మించడానికి రూ.10,911.15 కోట్లకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించినా కేంద్ర జల్శక్తి శాఖ మరికొన్ని వివరాలు కోరింది. దీంతో ఈ ఏడాది మే నెల ప్రారంభంలో తాజా లెక్కలు రూపొందించారు. డయాఫ్రం వాల్ మరమ్మతులు, ప్రధాన డ్యాంలో పడ్డ అగాధాలు పూడ్చేందుకు అవసరమయ్యే నిధుల అంచనా కూడా కలిపి రూ.16,952.07 కోట్లు అవసరమని తేల్చి పోలవరం అథారిటీకి, కేంద్ర జల్శక్తి శాఖకు సమర్పించారు. ఈ లోపునే పాత అంచనాల మేరకు రూ.10,911.15 కోట్లను పరిగణనలోకి తీసుకున్నారు. దాంతో పాటు పోలవరంలో డయాఫ్రం వాల్ మరమ్మతులు, పాక్షిక డయాఫ్రం వాల్ నిర్మాణానికి, ప్రధాన డ్యాం ప్రాంతంలో ఏర్పడ్డ పెద్ద పెద్ద అగాధాల పూడ్చివేతకు అంచనా వేసిన రూ.2,000 కోట్లు కూడా కలిపి రూ.12,911.15 కోట్లకు కేంద్ర ఆర్థికశాఖ వ్యయ నియంత్రణ విభాగం ఆమోదించడం విశేషం.
విభాగాలవారీ పరిమితి ఎత్తివేత
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు రెండుసార్లు పెట్టుబడి వ్యయం ఆమోదించారు. 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లకు తొలిసారి ఆమోదించారు.
* తర్వాత 2013-14 ధరల ప్రకారం రూ.20,398.81 కోట్లకు సాగునీటి వ్యయంగా కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించగా మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.
* ప్రస్తుతం ఆ అంచనా ధరలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే కేంద్రం నిధులు ఇస్తోంది. ఇందులో ప్రధాన డ్యాం, కుడి కాలువ, ఎడమ కాలువ, భూసేకరణ, పునరావాసం కింద ఏయే విభాగానికి ఎంత నిధులు ఆమోదం పొందాయో ఆ ప్రకారమే ఇస్తోంది.
* ఒక విభాగం కింద ఆమోదం పొందిన పరిమితి మేరకు నిధులివ్వడం పూర్తయితే.. ఆ విభాగం కింద అదనపు బిల్లులు సమర్పించినా డీపీఆర్లో ఆమోదం లేదంటూ పక్కన పెడుతున్నారు.
* తాజాగా ఆమోదించిన విధానం ప్రకారం అదనంగా ఇవ్వబోయే రూ.12,911.15 కోట్లకు ఇలాంటి పరిమితి విధించబోమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ఈ అదనపు నిధులు ఏ విభాగం పరిధిలోనైనా ఖర్చు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.
* రూ. 47,725.24 కోట్ల మొత్తానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపి, మంత్రిమండలి ముందుంచి ఆమోదిస్తే నిధులు ఇచ్చేందుకు వీలయ్యేది. అన్ని దశలు దాటిన ఆ డీపీఆర్ను ఆర్థికశాఖ ఆమోదించలేదు. ప్రస్తుతం 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు అవసరమయ్యే నిధులు అంటూ రూ.12,911.15 కోట్లకు ఆమోదించింది. 45.72 మీటర్ల స్థాయికి ప్రాజెక్టు నిర్మించి తొలుత 41.15 మీటర్లకు నీరు నిలబెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇవి తొలిదశ నిధులే అంటోంది. అయితే కేంద్రం తన తాజా ఆదేశాల్లో ఎక్కడా తొలిదశ అని ప్రస్తావించలేదు.
తొలిదశలో పునరావాసానికి ఇంకా నిధులు కావాలి
పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిలబెట్టాలంటే భూసేకరణ, పునరావాసానికి ఇప్పుడు లెక్కించిన మొత్తం కాకుండా అదనంగా రూ.5,127 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తొలి దశలో 41.15 మీటర్ల స్థాయికి నీరు నిలబెడితే మరో 36 గ్రామాలు, 16,642 కుటుంబాలు తొలిదశ నిర్వాసితుల జాబితాలోకే వస్తాయని తాజా లైడార్ సర్వేలో తేలినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ నిధులూ కావాలని తాజా అంచనాల్లో కోరింది. ఇప్పుడు కేంద్రం 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అంటూ మంజూరు చేసిన నిధుల్లో ఆ అదనపు మొత్తం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు. -
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. -
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు. -
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది. -
డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
సివిల్స్లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
వేకువనే పోలీసు పంజా
పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
జగన్ హయాంలో పెరిగిన శిరోముండనం ఘటనలు
జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. -
ఏపీఈఏపీ సెట్కు 3,54,235 దరఖాస్తులు
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
వెబ్సైట్లో పాలిసెట్ హాల్టికెట్లు
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు హాల్టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
కొయ్.. రాజా.. కొయ్!
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. -
క్షేత్రస్థాయికి ఎన్నికల నిఘా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
-
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం
-
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
-
మోదీ వేవ్ లేదట.. వివాదంలో భాజపా అభ్యర్థి నవనీత్ రాణా
-
నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు
-
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?