Polavaram Project: పోలవరానికి అదనంగా రూ.12,911 కోట్లు
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులిచ్చింది.
కేంద్ర ఆర్థిక శాఖ పచ్చజెండా
మంత్రిమండలి ముందుకు నోట్.. త్వరలో ఆమోదం
41.15 మీటర్ల ఎత్తుకు నీరు నిలిపేందుకే
తొలి దశ అని ఉత్తర్వుల్లో ప్రస్తావించని ఆర్థికశాఖ
లైడార్ సర్వేతో 41.15 మీటర్ల పరిధిలో పెరిగిన నిర్వాసితులు
వారి పునరావాసానికి నిధులివ్వని కేంద్రం
ఈనాడు, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులిచ్చింది. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రిమండలి ముందు తీర్మానం ప్రతిపాదించి.. ఆమోదం పొందాలని సూచించింది. కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం డైరెక్టర్ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం 45.72 మీటర్ల ఎత్తున నీరు నిలబెట్టేలా నిర్మించాలి. 41.15 మీటర్ల ఎత్తుకు నీరు నిలబెట్టేందుకు ఎంత ఖర్చవుతుందో.. ఆ మేరకు ఇంకెన్ని నిధులు అవసరమో అవి మంజూరు చేస్తున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. తొలి దశ కింద ఈ నిధులు ఇస్తున్నట్లు కానీ, మలి దశ రూపంలో మళ్లీ నిధులిచ్చే ప్రతిపాదన ఉన్నట్లు కానీ వాటిలో ఎక్కడా ప్రస్తావించలేదు.
పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు నిర్మించడానికి రూ.10,911.15 కోట్లకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించినా కేంద్ర జల్శక్తి శాఖ మరికొన్ని వివరాలు కోరింది. దీంతో ఈ ఏడాది మే నెల ప్రారంభంలో తాజా లెక్కలు రూపొందించారు. డయాఫ్రం వాల్ మరమ్మతులు, ప్రధాన డ్యాంలో పడ్డ అగాధాలు పూడ్చేందుకు అవసరమయ్యే నిధుల అంచనా కూడా కలిపి రూ.16,952.07 కోట్లు అవసరమని తేల్చి పోలవరం అథారిటీకి, కేంద్ర జల్శక్తి శాఖకు సమర్పించారు. ఈ లోపునే పాత అంచనాల మేరకు రూ.10,911.15 కోట్లను పరిగణనలోకి తీసుకున్నారు. దాంతో పాటు పోలవరంలో డయాఫ్రం వాల్ మరమ్మతులు, పాక్షిక డయాఫ్రం వాల్ నిర్మాణానికి, ప్రధాన డ్యాం ప్రాంతంలో ఏర్పడ్డ పెద్ద పెద్ద అగాధాల పూడ్చివేతకు అంచనా వేసిన రూ.2,000 కోట్లు కూడా కలిపి రూ.12,911.15 కోట్లకు కేంద్ర ఆర్థికశాఖ వ్యయ నియంత్రణ విభాగం ఆమోదించడం విశేషం.
విభాగాలవారీ పరిమితి ఎత్తివేత
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు రెండుసార్లు పెట్టుబడి వ్యయం ఆమోదించారు. 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లకు తొలిసారి ఆమోదించారు.
* తర్వాత 2013-14 ధరల ప్రకారం రూ.20,398.81 కోట్లకు సాగునీటి వ్యయంగా కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించగా మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.
* ప్రస్తుతం ఆ అంచనా ధరలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే కేంద్రం నిధులు ఇస్తోంది. ఇందులో ప్రధాన డ్యాం, కుడి కాలువ, ఎడమ కాలువ, భూసేకరణ, పునరావాసం కింద ఏయే విభాగానికి ఎంత నిధులు ఆమోదం పొందాయో ఆ ప్రకారమే ఇస్తోంది.
* ఒక విభాగం కింద ఆమోదం పొందిన పరిమితి మేరకు నిధులివ్వడం పూర్తయితే.. ఆ విభాగం కింద అదనపు బిల్లులు సమర్పించినా డీపీఆర్లో ఆమోదం లేదంటూ పక్కన పెడుతున్నారు.
* తాజాగా ఆమోదించిన విధానం ప్రకారం అదనంగా ఇవ్వబోయే రూ.12,911.15 కోట్లకు ఇలాంటి పరిమితి విధించబోమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ఈ అదనపు నిధులు ఏ విభాగం పరిధిలోనైనా ఖర్చు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.
* రూ. 47,725.24 కోట్ల మొత్తానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపి, మంత్రిమండలి ముందుంచి ఆమోదిస్తే నిధులు ఇచ్చేందుకు వీలయ్యేది. అన్ని దశలు దాటిన ఆ డీపీఆర్ను ఆర్థికశాఖ ఆమోదించలేదు. ప్రస్తుతం 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు అవసరమయ్యే నిధులు అంటూ రూ.12,911.15 కోట్లకు ఆమోదించింది. 45.72 మీటర్ల స్థాయికి ప్రాజెక్టు నిర్మించి తొలుత 41.15 మీటర్లకు నీరు నిలబెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇవి తొలిదశ నిధులే అంటోంది. అయితే కేంద్రం తన తాజా ఆదేశాల్లో ఎక్కడా తొలిదశ అని ప్రస్తావించలేదు.
తొలిదశలో పునరావాసానికి ఇంకా నిధులు కావాలి
పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిలబెట్టాలంటే భూసేకరణ, పునరావాసానికి ఇప్పుడు లెక్కించిన మొత్తం కాకుండా అదనంగా రూ.5,127 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తొలి దశలో 41.15 మీటర్ల స్థాయికి నీరు నిలబెడితే మరో 36 గ్రామాలు, 16,642 కుటుంబాలు తొలిదశ నిర్వాసితుల జాబితాలోకే వస్తాయని తాజా లైడార్ సర్వేలో తేలినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ నిధులూ కావాలని తాజా అంచనాల్లో కోరింది. ఇప్పుడు కేంద్రం 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అంటూ మంజూరు చేసిన నిధుల్లో ఆ అదనపు మొత్తం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
-
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?