పునర్ వైభవం దిశగా.. పుష్కరిణి!
రాష్ట్రంలోనే పెద్ద కోనేరుగా చెప్పుకొనే గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ పుష్కరిణి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోనే పెద్ద కోనేరుగా చెప్పుకొనే గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ పుష్కరిణి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఏళ్లుగా నిర్వహణ లేక చాలా వరకు పూడుకొనిపోయింది. 450 ఏళ్ల నాటిది కావడంతో కొన్ని చోట్ల మెట్లూ దెబ్బతిన్నాయి. అప్పట్లో 88 సెంట్ల విస్తీర్ణంలో శ్రీచక్ర ఆకారంలో నిర్మించారు. లోతు ఎంత ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీంతో కుప్పం నుంచి పిలిపించిన నిపుణుల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. ‘ఇంత పెద్ద కోనేరు రాష్ట్రంలో ఎక్కడా చూడలేదు. సుమారు 90 అడుగుల లోతు ఉందనుకుంటున్నాం. ఇంకా 10 అడుగుల పూడిక తీయాల్సి ఉంది’ అని వారంటున్నారు. పునరుద్ధరణ కోసం రూ.1.50 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్కు చేదు అనుభవం.. ప్రెస్మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ