నిధుల సమస్య లేదు
‘పోలవరం ప్రాజెక్టు తొలిదశకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడం శుభపరిణామం. తాజాగా రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలవరం పనులు వేగవంతం చేయండి
అధికారులకు సీఎం జగన్ ఆదేశం
ప్రాజెక్టు పనుల పురోగతిపై పరిశీలన, సమీక్ష
ఈనాడు, ఏలూరు: ‘పోలవరం ప్రాజెక్టు తొలిదశకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడం శుభపరిణామం. తాజాగా రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల సమస్య ఉండదు కాబట్టి వేగంగా పనులు పూర్తి చేయాలి’ అని సీఎం జగన్ అన్నారు. ముందుగా డయాఫ్రం వాల్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేస్తే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా సాగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. త్వరలో పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ముందుగా విహంగ వీక్షణం చేశారు. అనంతరం స్పిల్వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించారు. ఈ మూడు ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
డయాఫ్రంవాల్ను పరిశీలించిన అనంతరం దాని నిర్మాణం గురించి సీఎం తెలుసుకున్నారు. పునరావాస కాలనీలను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటితో ఆయా కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇప్పటికే తరలించిన 12,658 కుటుంబాలతో పాటు షెడ్యూల్ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను వేగంగా తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ‘ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుని ముందుకు సాగుతాం. పోలవరం ప్రాజెక్టు ఆకృతితో ఎలాంటి సంబంధం లేని గైడ్వాల్ వంటి చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపిస్తున్నారు. అయినా దీన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అన్నారు.
ప్రాజెక్టు ప్రగతిని వివరించిన అధికారులు
అనంతరం ప్రాజెక్టు హిల్ వ్యూ దగ్గర సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గైడ్వాల్ సమస్య పరిష్కారం, పునరావాస కాలనీల నిర్మాణం, నిర్వాసితుల తరలింపు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, డయాఫ్రం వాల్ నిర్మాణంపై సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు 2025 జూన్కు పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా అధికారులు పేర్కొనగా, ఇంకాముందు పూర్తి చేయలేమా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇతర నిర్మాణాలకు ఎన్ని రోజుల సమయం పడుతుంది.. తదితర వివరాలను ఆయన అడిగారు. అధికారులు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రగతిని వివరించారు.
‘స్పిల్వే కాంక్రీట్ పూర్తి చేసి, 48 రేడియల్, రివర్ స్లూయిజ్ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టామని తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, పవర్ హౌస్లో సొరంగాల తవ్వకాలు పూర్తి చేశాం.. అప్రోచ్ ఛానల్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి’ అని వివరించారు. విడతలవారీగా బిల్లుల చెల్లింపులతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతున్న విషయం కేంద్రం పరిగణనలోకి తీసుకుని మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. గైడ్వాల్ సమస్యను సరిదిద్దడం పెద్ద సమస్య కాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచన మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 12,658 కుటుంబాలను తరలించామన్నారు.
జాప్యానికి తెదేపా కారణం: సీఎం
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్డ్యాంలో ఖాళీలను వదిలేశారు. వాటి గుండా వరద నీరు ప్రవహించడంతో డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఎవరికీ కనిపించదు కానీ.. ప్రాజెక్టు ఆకృతితో సంబంధం లేని గైడ్వాల్ గురించి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం వెంట మంత్రులు అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
మీడియాకు పోలీసు కాపలా
సీఎం పర్యటన నేపథ్యంలో మీడియాపై పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. కార్యక్రమం కవర్ చేసేందుకు అవకాశం లేకుండా నియంత్రించారు. ఫొటోగ్రాఫర్లకు పాసులు కూడా జారీ చేయలేదు. కవరేజ్ కోసం వెళ్లిన వారందరికీ ఒక ప్రాంతంలో గుడారాలు వేసి సీఎం సమీక్ష సమావేశానికి వెళ్లే వరకూ అక్కడే నిర్బంధించారు. ఎవరూ బయటకు వెళ్లకుండా భారీగా పోలీసులను కాపలా పెట్టారు. సీఎం సమీక్షకు కూడా అనుమతించకుండా బలవంతంగా ప్రాజెక్టు దగ్గర నుంచి పోలవరం చెక్పోస్ట్ దగ్గరకు తీసుకు వచ్చారు. మీడియాను తీసుకొచ్చిన బస్సు వచ్చినప్పటి నుంచి ఓ సీఐ, నలుగురు కానిస్టేబుళ్లు వారు ఎక్కడికి వెళ్లకుండా నియంత్రించారు. సీఎం వెళ్లకుండానే ఏలూరు వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు. కార్యక్రమం కవర్ చేసే అవకాశం లేనప్పుడు పాసులు ఇచ్చి తీసుకురావడం ఎందుకని మీడియా ప్రతినిధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంగళవారం ఉదయం నుంచి సాధారణ ప్రజలను సైతం ప్రాజెక్టు పరిసరాల్లోకి కూడా రాకుండా నియంత్రించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు