మార్గదర్శిని దెబ్బతీయడమే అసలు లక్ష్యం
మార్గదర్శి సంస్థను అప్రతిష్ఠపాలు చేయాలన్న దుర్బుద్ధితో.. చిట్ఫండ్పై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి కొంతకాలంగా వేధిస్తున్న సీఐడీ.. మరోమారు విచారణ పేరుతో హడావుడి చేసింది.
ఏడు గంటల పాటు ఎండీ శైలజాకిరణ్ను విచారించిన సీఐడీ
మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు.. పొంతన లేని అంశాలు
ఈనాడు - హైదరాబాద్
మార్గదర్శి సంస్థను అప్రతిష్ఠపాలు చేయాలన్న దుర్బుద్ధితో.. చిట్ఫండ్పై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి కొంతకాలంగా వేధిస్తున్న సీఐడీ.. మరోమారు విచారణ పేరుతో హడావుడి చేసింది. సంస్థ ఎండీ శైలజాకిరణ్ను మంగళవారం సుమారు ఏడు గంటలపాటు విచారించింది. వేధింపులే లక్ష్యంగా సీఐడీ అధికారుల తీరు ఉన్నట్లు కనిపించింది. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగడం.. పొంతన లేని అంశాల గురించి ప్రస్తావించడం వారి దురుద్దేశాన్ని వెల్లడించింది. తొలుత విచారణ నిమిత్తం 40 ప్రశ్నలు అడుగుతామని చెప్పినా.. అధికారులు రోజంతా కేవలం 8 ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. పలుమార్లు అవే ప్రశ్నలతో తికమక పెట్టే ప్రయత్నం చేసినా శైలజాకిరణ్ నింపాదిగా సమాధానాలు చెప్పారు.
మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ క్రమంలో చిట్ఫండ్కు చెందిన రూ.793.5 కోట్ల విలువైన సొమ్మును ఎటాచ్ చేసేందుకు ఇటీవలే జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా చందాదారుల్లో సంస్థపై నమ్మకం ఇసుమంతైనా సడలకపోవడంతో తాజాగా మరోసారి విచారణ పేరుతో పన్నాగానికి తెరలేపింది. చిట్ఫండ్ సంస్థపై నమోదు చేసిన కేసు దర్యాప్తు పేరిట ఇప్పటికే సంస్థ ఎండీ శైలజాకిరణ్ను ఒకసారి విచారించిన సీఐడీ... హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలో మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఏపీ సీఐడీ ఎస్పీలు అమిత్ బర్దార్, హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ రవివర్మ, దర్యాప్తు అధికారి రవికుమార్ నేతృత్వంలో 20 మంది సభ్యుల బృందం మంగళవారం ఉదయం 10.30 సమయంలో ఆమె నివాసానికి చేరుకుంది.
సీఐడీ అధికారులు తమ వెంట డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులనూ తీసుకొచ్చారు.లోపలికి రాగానే ఈ విషయాన్ని గుర్తించిన మార్గదర్శి సిబ్బంది.. అందుకు అభ్యంతరం తెలిపారు. ఈ కేసుతో డీఆర్ఐ అధికారులకు ఏం సంబంధముందని నిలదీశారు. అయితే తమ దర్యాప్తునకు సహకారం కోసమే డీఆర్ఐ అధికారులను తీసుకొచ్చామని సీఐడీ అధికారులు వెల్లడించారు. తర్జనభర్జన అనంతరం సీఐడీ అధికారుల అభ్యర్థనను మార్గదర్శి సిబ్బంది అంగీకరించారు. సాయంత్రం దాదాపు 5.45 వరకూ విచారణ కొనసాగింది. సీఐడీ అడిగిన అన్ని ప్రశ్నలకూ శైలజాకిరణ్ స్పష్టమైన సమాధానాలిచ్చారు. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని దాదాపు మూడు గంటలపాటు సీఐడీ నమోదు చేసింది. 8.45 గంటల సమయంలో సీఐడీ బృందం వెనుదిరిగింది.
విచారణకు సహకరించారు
- రవికుమార్, దర్యాప్తు అధికారి
విచారణ అనంతరం శైలజాకిరణ్ నివాసం బయట సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. విచారణకు మార్గదర్శి ఎండీ పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు. ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. విచారణ ఇంకా జరగాల్సి ఉందని చెప్పారు. తదుపరి విచారణ తేదీని తర్వాత వెల్లడిస్తామన్నారు.
రోజంతా విషం చిమ్మిన సాక్షి మీడియా
మార్గదర్శి చిట్ఫండ్ ఎండీ శైలజాకిరణ్ విచారణ ఉదంతంపై సాక్షి మీడియా ఏపీ సీఐడీ విచారణను అడ్డుపెట్టుకుని మంగళవారం ఉదయం నుంచి విషం చిమ్ముతూనే ఉంది. సీఐడీ విచారణతో నిమిత్తం లేకుండా తనదైన శైలిలో దుష్ప్రచారం చేసింది. చిట్ఫండ్ వ్యాపారంపై కనీస అవగాహన లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేసింది.
* పత్రికా ప్రమాణాలు, విలువలు అంటే ఏమాత్రం సరిపడని సాక్షి.. దర్యాప్తు కొలిక్కి రాకుండానే ‘మార్గదర్శి చిట్ఫండ్ చందాదారుల నగదు దారి మళ్లింపుపై విచారణ’ అంటూ నిరాధార ఆరోపణలు చేసింది. ‘నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్న సీఐడీ’ అంటూ కట్టుకథలు అల్లింది.
* నిధుల మళ్లింపు అంశమే సీఐడీ విచారణలో ప్రస్తావనకు రాకున్నా రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు సీఐడీ గుర్తించిందని అసత్యప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా ‘రూ.793 కోట్ల ఆస్తుల్ని సీఐడీ ఎటాచ్ చేసింది. మిగిలిన నగదు అంతా ఎక్కడ దాచారు..? ఏయే కంపెనీలకు దారి మళ్లించారు..?’ అంటూ విచారిస్తున్నారని అడ్డగోలుతనం ప్రదర్శించింది. విదేశీ పెట్టుబడుల నేపథ్యంలోనూ శైలజాకిరణ్ను ప్రశ్నిస్తున్నట్లు ప్రసారం చేసి దుర్బుద్ధిని బయటపెట్టుకుంది.
* 60 ఏళ్లకు పైగా పటిష్ఠ ఆర్థిక భద్రతతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ నేడు చందాదారులకు డబ్బు చెల్లింపులు చేసే స్థితిలో లేదని అన్యాయమైన, అసత్య ఆరోపణలు గుప్పించిన సాక్షి... కళ్లున్న కబోది. చందాదారుల నుంచి వసూలు చేసిన వాయిదాలను చిట్ పాడుకున్న చందాదారులకు క్రమం తప్పకుండా చెల్లించడంలో మార్గదర్శిది తిరుగులేని ఆర్థిక క్రమశిక్షణ అన్న విషయాన్ని కావాలనే విస్మరించింది. చందాదారులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఆ మీడియా విషం కక్కింది.
* ‘శైలజాకిరణ్ పూర్తిస్థాయిలో విచారణకు సహకరించారు.. అన్ని ప్రశ్నలకూ సంతృప్తికర సమాధానాలిచ్చారు’ అని విచారణ అనంతరం దర్యాప్తు అధికారి రవికుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించినా... ‘శైలజాకిరణ్ సీఐడీ అధికారులకు సహకరించనట్లుగా తెలుస్తోంది’ అంటూ అసత్య ప్రచారం చేసింది.
* ‘ఉదయం 10.30 నుంచి దాదాపు 5 గంటలకు పైగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు..’ అంటూ వాస్తవ విరుద్ధ అంశాలతో సాక్షి మీడియా యథావిధిగా దుర్బుద్ధి చాటుకుంది. చిట్ఫండ్ నిర్వహణపై కనీస అవగాహన కూడా లేకుండా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసింది.
* ఒకవైపు ఎండీ శైలజాకిరణ్ స్టేట్మెంటును నమోదుచేస్తూ ఉంటే ఆమె నివాసంలో సీఐడీ సోదాలు జరుగుతున్నట్లు సాక్షి మీడియా బరితెగించి దుష్ప్రచారానికి ఒడిగట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.