Polavaram: ‘పోలవరంలో స్టార్‌ హోటల్‌ పెడతాం’

పోలవరం ప్రాజెక్టు సమీపంలో ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే అయిదు నక్షత్రాల హోటల్‌ నిర్మిస్తామని మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించినట్లు తెలిసింది.

Updated : 07 Jun 2023 09:12 IST

స్థలం ఇవ్వాలని మేఘా కృష్ణారెడ్డి అభ్యర్థన
సీఎం జగన్‌ సానుకూల స్పందన

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సమీపంలో ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే అయిదు నక్షత్రాల హోటల్‌ నిర్మిస్తామని మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించినట్లు తెలిసింది. ఎప్పటి నుంచో తాము కొండపై స్థలం కోరుతున్నామని, ఇంతవరకు కేటాయించలేదని ఆయన ముఖ్యమంత్రి జగన్‌ వద్ద ప్రస్తావించారు. మంగళవారం సీఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టు సందర్శన క్రమంలో స్టార్‌ హోటల్‌ నిర్మాణ అంశం చర్చకు వచ్చింది. అయిదు కాకుండా, ఏడు నక్షత్రాల హోటల్‌ నిర్మించాలని సీఎం సూచించినట్లు సమాచారం. భూ కేటాయింపు గురించి అధికారులకు ఆయన కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలిసింది. స్థలం కేటాయిస్తే అటు పోలవరం ప్రాజెక్టుతో పాటు హోటల్‌ నిర్మాణం ఒకేసారి పూర్తి చేస్తామని కూడా కృష్ణారెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని