Polavaram: ‘పోలవరంలో స్టార్ హోటల్ పెడతాం’
పోలవరం ప్రాజెక్టు సమీపంలో ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే అయిదు నక్షత్రాల హోటల్ నిర్మిస్తామని మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించినట్లు తెలిసింది.
స్థలం ఇవ్వాలని మేఘా కృష్ణారెడ్డి అభ్యర్థన
సీఎం జగన్ సానుకూల స్పందన
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సమీపంలో ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే అయిదు నక్షత్రాల హోటల్ నిర్మిస్తామని మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించినట్లు తెలిసింది. ఎప్పటి నుంచో తాము కొండపై స్థలం కోరుతున్నామని, ఇంతవరకు కేటాయించలేదని ఆయన ముఖ్యమంత్రి జగన్ వద్ద ప్రస్తావించారు. మంగళవారం సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శన క్రమంలో స్టార్ హోటల్ నిర్మాణ అంశం చర్చకు వచ్చింది. అయిదు కాకుండా, ఏడు నక్షత్రాల హోటల్ నిర్మించాలని సీఎం సూచించినట్లు సమాచారం. భూ కేటాయింపు గురించి అధికారులకు ఆయన కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలిసింది. స్థలం కేటాయిస్తే అటు పోలవరం ప్రాజెక్టుతో పాటు హోటల్ నిర్మాణం ఒకేసారి పూర్తి చేస్తామని కూడా కృష్ణారెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా