సంక్షిప్త వార్తలు (5)
అరకొరగా ప్రకటించిన రాయితీలు.. ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని చల్లార్చలేవని, ప్రభుత్వం వారిని దగా చేసిందని ఏపీ పంచాయతీరాజ్ డిప్లమో ఇంజినీర్ల సంఘం సలహాదారు హనుమంతరావు మండిపడ్డారు.
‘ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం’
ఈనాడు, అమరావతి: అరకొరగా ప్రకటించిన రాయితీలు.. ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని చల్లార్చలేవని, ప్రభుత్వం వారిని దగా చేసిందని ఏపీ పంచాయతీరాజ్ డిప్లమో ఇంజినీర్ల సంఘం సలహాదారు హనుమంతరావు మండిపడ్డారు. ఐఆర్ ఇవ్వకుండా పీఆర్సీని నియమించడం పెద్ద మోసమని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘2014 జూన్ 2 నాటికి అయిదేళ్లు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజ్ చేయాలనడం అనేకమంది జీవితాలను ఛిద్రం చేయడమే. 1/3 వంతు కాంట్రాక్టు ఉద్యోగులకే న్యాయం జరగనుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఊసే లేదు. 11వ పీఆర్సీ బకాయిలు నాలుగేళ్లలో 16 వాయిదాల్లో ఇవ్వడం ఎక్కడా లేదు. జీపీఎస్తో ఉద్యోగులకు జీవిత భద్రత ఉండదు. ప్రభుత్వానికి దాసోహం అన్న ఉద్యోగ సంఘాల నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఉద్యోగులను మోసం చేసిన జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి’ అని హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు గుంటూరులో ఏపీ జేఏసీ ప్రాంతీయ సదస్సు
గుంటూరు (కలెక్టరేట్), న్యూస్టుడే: ఏపీ జేఏసీ అమరావతి చేపడుతున్న మూడో దశ ఉద్యమ ప్రణాళికలో భాగంగా నాలుగో ప్రాంతీయ సదస్సు గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించనున్నామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ఛైర్మన్ కనపర్తి సంగీతరావు, ప్రధాన కార్యదర్శి పి.ఎ.కిరణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మూడు ప్రాంతీయ సదస్సులను నిర్వహించామన్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు గుంటూరులోని నగరంపాలెం నుంచి ప్రదర్శన ప్రారంభమై రెవెన్యూ కల్యాణ మండపానికి చేరుకుంటుందన్నారు. 9.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలిపారు.
50% పింఛను, డీఏ ఇవ్వడం సంతోషం: ఏపీ ఎన్జీవో
ఈనాడు, అమరావతి :ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఏపీ వైద్య విధానపరిషత్ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాల చెల్లింపు, జీపీఎస్ అమలు తదితర అంశాలకు కేబినెట్లో ఆమోదం తెలిపినందుకు ఏపీ ఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 50% పింఛను, డీఏ ఇవ్వడం సంతోషమే కాని ఉద్యోగి నుంచి కాంట్రిబ్యూషన్ లేకుండా చేయాలని కోరారు. పీఆర్సీ, డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
డీఈఈసెట్ 12న
ఈనాడు, అమరావతి: డీఈఎల్ఈడీ(డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలకు డీఈఈసెట్ను ఈనెల 12న నిర్వహించనున్నట్లు కన్వీనర్ మేరీ చంద్రిక తెలిపారు. హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
రేబిస్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి: కృష్ణబాబు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కుక్కల స్వైర విహారం ఎక్కువవుతున్నందున రేబిస్ వ్యాధి సోకకుండా హైరిస్క్ గ్రూపులో ఉన్న వారికి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర జునోసిస్(జంతువులు, మనుషుల మధ్య సంక్రమించే వ్యాధులు) కమిటీ నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జునోసిస్ కమిటీ సమావేశం నిర్వహించారు. కృష్ణబాబు మాట్లాడుతూ ‘మున్సిపల్ కార్మికులు, వెటర్నరీ సిబ్బంది, ఇతర హైరిస్క్ జాబితాలో ఉన్న వారికి రేబిస్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్ నిరోధక టీకాలు అందుబాటులో ఉంచాలి. పశువుల ఆసుపత్రుల్లో శునకాలకు వేసే వ్యాక్సిన్లు కూడా సిద్ధం చేయాలి. జునోటిక్ వ్యాధుల బారినపడిన వారి జీవనశైలిపై సిద్ధార్థ వైద్య కళాశాల, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్స్కు చెందిన వైద్య బృందాలు అధ్యయనం చేయాలి. లెఫ్టోస్పిరోసిస్ వంటి వ్యాధుల ప్రభావంపై అధ్యయనం జరగాలి’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల విచారణ నుంచి...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
929 మంది వాలంటీర్లను తొలగించాం
ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. -
సంక్షిప్త వార్తలు
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)