నిండా మునిగిన పౌరసరఫరాల సంస్థ
అప్పుల విషయంలో తమను చూసి ప్రభుత్వరంగ సంస్థలూ నేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఎడాపెడా రుణ హామీలు ఇచ్చేస్తోంది.
ఇప్పటికే రూ.30వేల కోట్లకు పైగా రుణభారం
తాజాగా మరో రూ.5వేల కోట్ల రుణానికి హామీ ఇచ్చిన ప్రభుత్వం
మూడేళ్లలో ఇచ్చిన రాయితీ సొమ్ము రూ.900 కోట్ల లోపే
ఈనాడు, అమరావతి: అప్పుల విషయంలో తమను చూసి ప్రభుత్వరంగ సంస్థలూ నేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఎడాపెడా రుణ హామీలు ఇచ్చేస్తోంది. ఇలాగే.. పౌరసరఫరాల సంస్థకూ అదనంగా రూ.5వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతించింది. ఈ సంస్థ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి, రైతుల వద్ద కొన్న ధాన్యానికి చెల్లించేందుకు సొమ్ము లేక సతమతమవుతోంది. 2014-15లో రూ.6,042 కోట్ల అప్పు మాత్రమే ఉండగా.. ఇది ఏటికేడు పెరుగుతూ రూ.30వేల కోట్లకు పైగా చేరింది. బ్యాంకుల్లో అప్పు పుట్టే దారి కానరాక.. రెండేళ్లుగా మార్క్ఫెడ్పై ఆధారపడుతోంది. అందుకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అదనపు సేకరణ ఏజెన్సీగా మార్క్ఫెడ్ను నియమించి రూ.5వేల కోట్ల రుణ హామీ ఇచ్చింది. ఆ సంస్థ ద్వారా రూ.వేలకోట్ల అప్పులు తెచ్చి.. ధాన్యం బకాయిల్ని చెల్లిస్తోంది. అయినా సమయానికి బకాయిలు చెల్లించట్లేదు. రైతులకు నెలల తరబడి ఎదురుచూపులు తప్పట్లేదు.
రూ.6,042 కోట్ల నుంచి రూ.32 వేల కోట్లకు పైగా
పౌరసరఫరాల సంస్థ రుణభారం ఏటికేడు పెరుగుతోంది. రాష్ట్రవిభజన సమయంలో సంస్థ అప్పు రూ.6,042 కోట్లే ఉంది. తర్వాత ఏటికేడు పెరుగుతోంది. 2022 మార్చి నాటికి రూ.31వేల కోట్ల మేర అప్పులు ఉన్నాయని కాగ్ నివేదిక వెల్లడిస్తోంది. వాటిలో కొంతమేర తీర్చగా.. మార్చి చివరకు రూ.30వేల కోట్ల వరకు రుణభారం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలు రూ.37వేల కోట్ల వరకూ చేరాయి. తాజాగా ప్రభుత్వం మరో రూ.5వేల కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. అంటే మొత్తం రూ.42వేల కోట్ల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పించింది.
రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు.. రూ.900 కోట్లతో సర్దుకోమన్నారు
పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నట్లు చెప్పే సర్కారు.. పౌరసరఫరాల సంస్థకు రాయితీ సొమ్ము మాత్రం విడుదల చేయట్లేదు. అందుకే సంస్థ రుణభారం ఏటికేడు పెరుగుతోంది. ఏడాదికి రాయితీ బియ్యం, కందిపప్పు, పంచదార సరఫరాకు రూ.3వేల కోట్లకు పైగా ఖర్చవుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.600 కోట్లు కూడా ఇవ్వట్లేదు. దీంతో బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి.. సర్దుబాటు చేస్తోంది. 2017-18లో అప్పటి ప్రభుత్వం రాయితీ కింద రూ.3,056 కోట్లు ఇచ్చింది. 2018-19లో రూ.340 కోట్లు, 2019-20లో రూ.396 కోట్లు, 2020-21లో రూ.23 లక్షలు, 2021-22లో రూ.503 కోట్లు మాత్రమే విడుదల చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలి మూడేళ్లకు పరిశీలిస్తే.. రాయితీ నిమిత్తం రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లే అందింది. మిగిలిన మొత్తాన్ని సంస్థ అప్పుల రూపంలోనే సర్దుబాటు చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం