AP CID: 14 గంటల్లో మాట మార్చేశారు
‘మార్గదర్శి చిట్ఫండ్ ఎండీ శైలజాకిరణ్ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారు. ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయి’ అని మంగళవారం రాత్రి 8.30కి చెప్పిన సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ బుధవారం ఉదయం 11 గంటలకు మాట మార్చేశారు.
మంగళవారం రాత్రి ఒక మాట.. బుధవారం ఉదయం కొత్త పాట
మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ విచారణకు సహకరించలేదని మాట మార్చిన సీఐడీ అదనపు ఎస్పీ
విలేకర్ల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు
ఈనాడు, అమరావతి: ‘మార్గదర్శి చిట్ఫండ్ ఎండీ శైలజాకిరణ్ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారు. ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయి’ అని మంగళవారం రాత్రి 8.30కి చెప్పిన సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ బుధవారం ఉదయం 11 గంటలకు మాట మార్చేశారు. ఎవరి ప్రోద్బలమో తెలియదు గానీ, కేవలం 14 గంటల తేడాలో ఆయన పూర్తిగా భిన్నవాదన వినిపించారు. శైలజాకిరణ్ తమ దర్యాప్తునకు సహకరించలేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఒక్క రాత్రిలోనే ఇలా మాట మార్చేయడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని ప్రశ్నిస్తే.. ఎవరి ఒత్తిళ్లూ లేవంటూనే పొంతనలేని సమాధానాలు చెప్పారు. సీఐడీ ఐజీ సీహెచ్.శ్రీకాంత్తో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన... ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వలేక ఆద్యంతం తడబడ్డారు.
మంగళవారంసాయంత్రం: ‘‘శైలజాకిరణ్ అనారోగ్యంతో బాధపడుతున్నా విచారణకు సహకరించారు. మా ప్రశ్నలకు ఆమెకు తెలిసిన సమాధానాలిచ్చారు. విచారణ పట్ల సంతృప్తి చెందాం’’ అని మార్గదర్శి చిట్ఫండ్ ఎండీ శైలజాకిరణ్ విచారణ ముగిసిన తర్వాత సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్ హైదరాబాద్లో విలేకర్లకు చెప్పారు.
బుధవారం ఉదయం: ‘‘విచారణలో భాగంగా మేం అడిగిన ప్రశ్నలకు శైలజాకిరణ్ సరైన సమాధానాలు చెప్పలేదు. తనకు ఆరోగ్యం బాగాలేదని, సమాధానాలు తర్వాత చెబుతానంటూ సమయం అడిగారు. 25% ప్రశ్నలకే ఆమె సమాధానమిచ్చారు. మిగతా వాటికి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ప్రతిసారీ తనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతూ విచారణను జాప్యం చేయిస్తున్నారు’’ అని సచివాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో అదే అధికారి వ్యాఖ్యానించారు.
హడావుడిలో జనరల్గా మాట్లాడానంతే
విలేకర్లు: శైలజాకిరణ్ విచారణ పట్ల సంతృప్తి చెందామని, ఆమె విచారణకు పూర్తిగా సహకరించారని మీరే అన్నారు కదా?
రవికుమార్: విచారణకు ఒకసారి సహకరించొచ్చు, ఇంకోసారి సహకరించకపోవొచ్చు. విచారణ ముగిసిన తర్వాత మా ఎస్పీని కలిసి మాట్లాడేందుకు నేను వెళ్తుండగా మీడియా ప్రతినిధులు ప్రశ్నించటంతో... ఆ హడావుడిలో నేను జనరల్గా మాట్లాడానంతే.
మాట మార్చాలని మీపై ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి?
విలేకర్లు: మంగళవారం రాత్రి మీరు చెప్పిన మాటలకు, బుధవారం ఉదయం మీరు చేస్తున్న ప్రకటనకు ఏ మాత్రం పొంతనలేదు. ఇలా మాట మార్చటం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? అవి ఏ స్థాయి వారివి?
రవికుమార్: నాపైన ఎవరి ఒత్తిళ్లూ లేవు. (ఈ సమాధానం చెప్పేటప్పుడు తడబడ్డారు.)
చందాదారులు ఫిర్యాదు చేయకపోయినా మార్గదర్శిపై వేధింపులేంటి?
విలేకర్లు: చందాదారులు ఎవరూ ఫిర్యాదులు చేయకపోయినా సరే మార్గదర్శిని వేధించటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఎందుకు వ్యవహరిస్తోంది?
రవికుమార్: మేం విచారణ చేపట్టిన తర్వాత నుంచి అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నారు. వారి వాంగ్మూలాలు రికార్డు చేస్తున్నాం.
విలేకర్లు:మరి ఆ వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు?
రవికుమార్: సమాధానం లేదు.
చట్ట పరిధిలోనే దర్యాప్తు చేస్తున్నాం
- రవికుమార్
మార్గదర్శి చిట్ఫండ్పై నమోదు చేసిన కేసులను చట్ట పరిధిలోనే తాము దర్యాప్తు చేస్తున్నామని రవికుమార్ చెప్పారు. చిట్ఫండ్ చందాదారుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకే తాము చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. విచారణ సమయంలో తాము ఎవర్నీ వేధించలేదని, నిజాల్ని రాబట్టడానికి పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. శైలజాకిరణ్కు మరోసారి నోటీసులిచ్చి విచారిస్తామని చెప్పారు. మార్గదర్శి ఆస్తుల ఎటాచ్మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
లోపలికి అనుమతించటం వరకే సహకరించారు...
విలేకర్లు: శైలజాకిరణ్ విచారణకు సహకరించారని మీరే చెప్పారు కదా! ఇప్పుడు ఆమె సహకరించలేదని ఎలా అంటున్నారు?
రవికుమార్: మమ్మల్ని లోపలికి అనుమతించటం వరకే సహకరించారు. ఆమె ఓవరాల్గా మాట్లాడారు. దర్యాప్తునకు సహకరించలేదు. తనకు ఆరోగ్యం బాగాలేదని, పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
విలేకర్లు: ఆరోగ్యం బాగాలేకున్నా విచారణకు సహకరించారని అన్నారు కదా?
రవికుమార్: దర్యాప్తు పరంగా ఆమె మాకు సహకరించలేదు. మేం అడిగిన ప్రశ్నలకు ఆమెకు తెలిసిన సమాధానమే చెబుతున్నారు. తెలిసిన సమాచారం చెప్పట్లేదు. మేనేజర్లను అడిగి చెబుతానంటూ దాటవేస్తున్నారు. (ఇలా అర్థరహితంగా సమాధానమిచ్చారు.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.