సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు ఏపీవై అవార్డు

అటల్‌ పెన్షన్‌ యోజన(ఏపీవై) వార్షిక అవార్డు, జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 2022-23 సంవత్సరానికి స్పాన్సర్‌ బ్యాంకు ఇండియన్‌ బ్యాంకుతో సహా సప్తగిరి గ్రామీణ బ్యాంకు విజేతగా నిలిచింది.

Published : 08 Jun 2023 05:29 IST

ఈనాడు-అమరావతి: అటల్‌ పెన్షన్‌ యోజన(ఏపీవై) వార్షిక అవార్డు, జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 2022-23 సంవత్సరానికి స్పాన్సర్‌ బ్యాంకు ఇండియన్‌ బ్యాంకుతో సహా సప్తగిరి గ్రామీణ బ్యాంకు విజేతగా నిలిచింది. ఏపీవై ప్రారంభించిన ఎనిమిదేళ్లలో మొదటిసారి ఈ విజయం సాధించింది. దిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పెన్షన ఫండ్‌ నియంత్రణ, అభివృద్ధి సంస్థ(పీఎఫ్‌ఆర్డీఏ) ఛైర్మన్‌ దీపక్‌ మహంతి చేతుల మీదుగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఛైర్మన్‌ ఏఎస్‌ఎన్‌ ప్రసాద్‌ రెండు అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఖాతాదారులకు మరింత సౌకర్యంగా, సామాజిక ప్రయోజనాలు కలిగే విధంగా అందిస్తామని బ్యాంకు ఛైర్మన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని