ఆసుపత్రుల రూపు మారేదెప్పుడు?
రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ‘నాడు-నేడు’ కింద మూడేళ్ల కిందట దశల వారీగా చేపట్టిన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి.
మందకొడిగా సాగుతున్న ‘నాడు-నేడు’ పనులు
‘‘నాడు-నేడు పథకం కింద ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఆసుపత్రులకు ఎవరు వెళ్లి చూసినా అక్కడ మార్పు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు వాటిని సందర్శించాలి. చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించాలి’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆర్భాట ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితమౌతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చేపట్టిన పనులు పరిశీలించినప్పుడు కొన్నిచోట్ల పీహెచ్సీలు, సీహెచ్సీలు, పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నట్లు స్పష్టమవుతుంది.
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ‘నాడు-నేడు’ కింద మూడేళ్ల కిందట దశల వారీగా చేపట్టిన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మొత్తంగా 11,870 ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా.. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల నిర్మాణాలు ఇప్పటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. వీటి నిర్మాణాలకు రూ.3,954 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు రూ.1,631 కోట్ల వరకు మాత్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయి. నిర్మాణాలు పూర్తికాకపోవడంతో కొన్నిచోట్ల ఇరుకు గదుల్లోనే రోగులకు చికిత్స అందించాల్సి వస్తోంది.
గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు జరగక...!
గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నిర్మాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ నిధులతో తలపెట్టాయి. వీటిలో కొత్త నిర్మాణాలే ఎక్కువ. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఇప్పటివరకు నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. ఒక్కో ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి ఉపాధి హామీ పథకం కింద మొదట్లో రూ.17.50 లక్షలు కేటాయించారు. నిధులు సరిపోవట్లేదని గుత్తేదారులు పనులు ఆపేయడంతో మరో రూ.3.30 లక్షల చొప్పున అదనంగా కేటాయించారు. మొత్తం 10,032 కేంద్రాల నిర్మాణాలు పనులు చేపట్టారు. ఇందులో 8,600 సంరక్షణ కేంద్రాలకు కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. మిగిలిన వాటికి మరమ్మత్తు పనులు సాగుతున్నాయి. ఇందుకయ్యే నిధుల్లో ఉపాధి పథకం హామీ కింద వచ్చే నిధుల్లో 90% కేంద్రం, 10% పంచాయతీరాజ్ శాఖ ఖర్చుపెడుతోంది. అలాగే..జాతీయ ఆరోగ్య మిషన్ కింద కొంత నిధులు సమకూరుస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 38 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయగా గత మూడేళ్లలో సగం భవనాల నిర్మాణాల పనులు కూడా పూర్తవలేదు. ఆరుచోట్ల అసలు పనులే ప్రారంభం కాలేదు. కమలాపురం నియోజకవర్గంలో 60 కేంద్రాలకుగాను 26 మాత్రమే పూర్తయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలో 54కు 34 పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. పంచాయతీరాజ్ ద్వారా ఈ పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద ఈ కేంద్రాలకు నిధులు సర్దుబాటులో సమస్యలు తలెత్తుతున్నాయి.
పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిస్థితి..!
పట్టణ వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ల నిర్మాణాల పనులూ నత్తనడకన సాగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తికాకముందే కొన్నిచోట్ల ఫర్నిచర్, వ్యాధి నిర్థారణ పరికరాలు ఆసుపత్రులకు చేరుకున్నాయి. వీటిని జాగ్రత్త చేసేందుకు, ఉపయోగించేందుకు సిబ్బంది పడరానిపాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లా చెట్నేపల్లిలోని పట్టణ కేంద్రం నిర్మాణానికి సంబంధించి రూ.60 లక్షల బిల్లులు పెండింగులో ఉండటంతో పనులు నిలిచిపోయాయి. గుత్తి పట్టణంలోని ఆరోగ్య కేంద్రం నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం తేరుబజార్ ప్రాంతంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం పనులూ పూర్తికాలేదు. పలమనేరు పట్టణంలోని గంటావూరు, కాకాతోపు ప్రాంతాల్లో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా...నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. గుత్తేదారులకు ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా అందకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
ఇతర ఆసుపత్రుల నిర్మాణాల్లోనూ జాప్యమే..!
అమలాపురంలోని ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు రూ.5.76 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. 2020 అక్టోబరులో నిర్మాణ పనులు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తికాలేదు. కావలి ప్రాంతీయ ఆసుపత్రిలో రెండున్నరేళ్ల కిందట నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ పనులూ నత్తనడకన సాగుతున్నాయి.
* ఏలూరు జిల్లా చనుబండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరుచేసి ఏడాది అవుతున్నా నిర్మాణ పనులు ఇంకా ప్రారంభంకాలేదు. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని (రూ.25 లక్షలు) దాత అందచేసినా పనుల్లో కదలికలేదు. రూ.2.30 కోట్ల అంచనాతో టెండరు పిలవగా గుత్తేదారులు ముందుకురాలేదు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ఉన్న పీహెచ్సీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2020లో కూల్చివేశారు. నాడు-నేడు కింద రూ.1.77 కోట్లు మంజూరుచేశారు. ఈ పనులకు 2021 డిసెంబరు 31న శంకుస్థాపన జరిగింది. భవనం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గుత్తేదారులకు సుమారు రూ.50 లక్షల వరకు చెల్లింపులు జరగకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి