వరి రైతుకు మిగిలేదేంటి?
ఎకరాకు రూ.45 వేలకు పైగా పెట్టుబడి పెట్టి, వానల్ని, వరదల్ని తట్టుకుని పండిస్తేనే రైతన్న చేతికి ధాన్యం వస్తుంది. దానికి గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి జగన్.. అదేదో ఉచితంగా ఇచ్చినట్లు, ధాన్యం కొనుగోలు ద్వారా రూ.58 వేల కోట్ల సాయం చేశామని చెబుతున్నారు.
క్వింటాలు ఉత్పత్తికి రాష్ట్ర లెక్క రూ.2,084
కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,183
తేమ, నూకల పేరిట కొనుగోళ్ల వేళ కోత
వర్షాలు, వరదలొస్తే మరింత నష్టం
ఈనాడు, అమరావతి: ఎకరాకు రూ.45 వేలకు పైగా పెట్టుబడి పెట్టి, వానల్ని, వరదల్ని తట్టుకుని పండిస్తేనే రైతన్న చేతికి ధాన్యం వస్తుంది. దానికి గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి జగన్.. అదేదో ఉచితంగా ఇచ్చినట్లు, ధాన్యం కొనుగోలు ద్వారా రూ.58 వేల కోట్ల సాయం చేశామని చెబుతున్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే రైతులు సంతోషంగా ఉన్నారంటున్న ఆయన.. గతేడాది ఖరీఫ్, రబీలో సాధారణ విస్తీర్ణం కంటే 9 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎందుకు తగ్గిందో చెప్పలేదు. ధాన్యం అమ్మాలంటే మిల్లర్లకు ఎదురు సొమ్ము చెల్లించాల్సిన దుస్థితి ఏపీలోనే ఎందుకుందో సెలవివ్వలేదు. బోనస్ ఇచ్చి ఆదుకోవాలన్న ఆలోచనే మానుకున్నారు.
ఎకరా వరి సాగుకు రైతు కుటుంబ శ్రమ కాకుండానే రూ.45 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. క్వింటాలు ఉత్పత్తికి రూ.2,084 ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వమే అంచనా వేసింది. అయినా కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,183 మాత్రమే. ఇందులోనూ తేమ, నూకల పేరుతో క్వింటాలుకు రూ.300-400 వరకు కోతలు విధిస్తున్నారు. వర్షాలు, వరదలొచ్చి వడ్లు రంగు మారినా, మొలకలు వచ్చినా ధరలు తగ్గిస్తున్నారు. అందుకే అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో వరి సాగుకు రైతులు వెనకాడుతున్నారు. ధాన్యాగారమైన గోదావరి జిల్లాల్లోనే ఖరీఫ్లో వరి సాగుకు విరామం ప్రకటిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని, ఈ కొత్త విధానంతో రైతులంతా సంతోషంగా ఉన్నారంటున్న ప్రభుత్వం.. కుంగిపోతున్న అన్నదాతల ఆవేదనను పట్టించుకోవడం లేదు.
పెట్టుబడి వ్యయమే అధికం
2023-24 సంవత్సరానికి క్వింటాలు వరికి మద్దతు ధరగా రూ.3,126 చొప్పున ఇవ్వాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్(సీఏసీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అయితే కేంద్రం రూ.2,183 మాత్రమే నిర్ణయించింది. అంటే రాష్ట్రం ప్రతిపాదించిన ధర కంటే రూ.943 తక్కువే.
* క్వింటాలు ఉత్పత్తికి రూ.2,084 ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం సీఏసీపీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఎకరానికి 24 క్వింటాళ్ల దిగుబడిగా నిర్ణయించి.. ఈ లెక్కలు వేసింది.
* ఖరీఫ్ పంటనే పరిశీలిస్తే.. 2019-20లో ఎకరాకు 21 క్వింటాళ్లు, 2020-21లో 16.89, 2021-22లో 17.21 క్వింటాళ్ల దిగుబడే లభించింది. గతేడాది కూడా ముందస్తు అంచనాల ప్రకారం 20.78 క్వింటాళ్లుగా గుర్తించారు. అంటే ప్రభుత్వం చెబుతున్న దిగుబడి గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేదు.
* ఖరీఫ్లో వాస్తవ పెట్టుబడి ఎకరానికి రూ.50 వేల వరకు అవుతుంది. సగటున 20 క్వింటాళ్ల దిగుబడి లెక్కన చూస్తే.. క్వింటాలు ఉత్పత్తికి రూ.2,500 చొప్పున ధర దక్కాలి. కేంద్రం నిర్ణయించిన రూ.2,183కు అమ్ముకుంటే క్వింటాలుపై రైతు రూ.317 నష్టపోతున్నారు. ఎకరాకు 30 బస్తాల ధాన్యం పండిస్తే తేమ, నూక పేరుతో రూ.12వేల వరకు వ్యాపారులే దోచుకుంటున్నారు. ప్రభుత్వం కూడా రైతుల్ని వ్యాపారులకు వదిలేసి చోద్యం చూస్తోంది.
బోనస్తో కొంతైనా భరోసా
వరి సాగుకు అధిక పెట్టుబడి అయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్దే. 2021-22 గణాంకాల ప్రకారం తెలంగాణలో ఎకరాకు రూ.45,306 ఖర్చవుతుంటే.. ఏపీలో రూ.41,423 అవుతోంది. కేరళలో రూ.40,364 ఖర్చవుతోంది. అయినా అక్కడి ప్రభుత్వం క్వింటాలుపై రూ.780 వరకు బోనస్ ఇస్తోంది. తమిళనాడులోనూ రూ.100 వరకు ఇస్తున్నారు.
అమ్మాలంటే అగచాట్లే
తేమ, నూకశాతం పేరుతో క్వింటాలుకు రూ.200 నుంచి రూ.400 వరకు వ్యాపారులు దోచుకుంటున్నారు. ధాన్యం సేకరణ ద్వారా లబ్ధి పొందే వారిలో సన్నకారు రైతులు కేవలం 22% మంది మాత్రమే ఉన్నారు. అదే తెలంగాణలో 71.5%, ఛత్తీస్గఢ్లో 53.7% మందికి లబ్ధి కలుగుతోంది. గ్రామాల్లో ఎకరా, రెండెకరాలను కౌలుకు తీసుకుని వరి పండించే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని అర్థమవుతోంది. వీరి పేరుతో యజమానులే అమ్ముకుంటున్నారు. అందుకే అయిదెకరాలు, ఆపై విస్తీర్ణమున్న రైతుల సంఖ్య అధికంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై