హాథీరాంజీ మఠం మహంతు సస్పెన్షన్
తిరుపతి హాథీరాంజీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ను సస్పెండ్ చేస్తూ ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకుందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
లక్ష్మీ రాజశ్యామల యాగ ఫలితమే కేంద్ర నిధులు
దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఈనాడు, అమరావతి: తిరుపతి హాథీరాంజీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ను సస్పెండ్ చేస్తూ ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకుందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘మఠానికి మహంతుగా ఉన్న వ్యక్తి సన్యాసిగా ఉండాలి. కానీ, అర్జున్ దాస్కు వివాహమై, పిల్లలున్నారు. మఠం ఆస్తులను అన్యాక్రాంతం చేసి, ఇష్టం వచ్చినట్లు లీజులకు ఇస్తున్నారు. ఆయనపై చర్యలకు సిద్ధపడగా.. అర్జున్ దాస్ కోర్టును ఆశ్రయించారు. ధార్మిక పరిషత్ ద్వారా ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నాం. ఆయన స్థానంలో మరొకర్ని నియమిస్తాం’ అని మంత్రి తెలిపారు.‘ఇటీవల విజయవాడలో నిర్వహించిన లక్ష్మీ రాజశ్యామల యాగం ఫలితంగానే కేంద్రం నుంచి నిధులు వచ్చాయని చెప్పడానికి మంత్రిగా చొరవ తీసుకుంటున్నా’’ అని తెలిపారు.
సీఎం జగన్ ధనవంతుడే అయినా..
సీఎం జగన్ మొదటి నుంచి ధనవంతుడైనప్పటికీ పేదల పక్షాన ఉంటున్నారని పేర్కొన్నారు. వంగవీటి రాధ ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. మద్యం దుకాణాలు, ఇసుక లావాదేవీల్లో డిజిటల్ విధానం అమలు చేయకపోవడం గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. కాపు కులాన్ని మళ్లీ ముంచేందుకు జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓ కాపు నాయకుడిగా తాను జనసేనలో చేరనని మంత్రి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?