దోపిడీ గుట్టు బట్టబయలు
రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా జేపీ సంస్థకు బదులుగా వైకాపా నాయకులే నిర్వహిస్తున్నారనే విషయం తిరుగులేని ఆధారాలతో బయటపడింది.
అధికార పార్టీ నాయకులే అనధికార రీచ్ల నిర్వాహకులు
ఇసుక రేవులు అడ్డగోలుగా సబ్లీజులకు..
వాటిని తీసుకున్న లీజుదారులు నష్టాల ఊబిలోకి
చివరికి ఒకరు ఆత్మహత్య.. తాజాగా మరొకరు ఆత్మహత్యాయత్నం
ఈనాడు, అమరావతి, కడప: రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా జేపీ సంస్థకు బదులుగా వైకాపా నాయకులే నిర్వహిస్తున్నారనే విషయం తిరుగులేని ఆధారాలతో బయటపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో, ఆయన సమీప బంధువే అనుమతుల్లేని ఇసుక రీచ్ కోసం డబ్బులు కట్టించుకుని, అవి తిరిగి ఇవ్వకుండా తిప్పిస్తున్నారంటూ పోకల నారాయణరెడ్డి అనే వ్యాపారి ఆత్మహత్యకు ప్రయత్నించడం... రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీని కళ్లకు కడుతోంది. ఇసుక వ్యాపారం పేరిట అధికార పార్టీ నాయకులు ఎంతటి అరాచకాలకు పాల్పడుతున్నారో అద్దం పడుతోంది. ఇసుక రేవులను కొంతమంది తన వద్ద సబ్లీజుకు తీసుకున్నారంటూ సీఎం బంధువు వీరారెడ్డి బాహాటంగా అంగీకరించటం.. ఆయన బరితెగింపుతనాన్ని చూపిస్తోంది. ఈ స్థాయిలో దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం నోరు మెదపరు. ఇసుక వ్యాపారాన్ని జేపీ సంస్థకు ఇచ్చేశామని, వారు ఎవరికి సబ్లీజు ఇచ్చుకున్నా తమకు సంబంధం లేదంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తరచూ ప్రకటనలు చేస్తుంటారు. ఇసుక వ్యాపారం కోసం వైకాపా నాయకులకు రూ.కోట్లలో డిపాజిట్టు, నెలవారీ చెల్లింపులు చేసి ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోలేక తీవ్రంగా నష్టపోయి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కళ్లేపల్లి ప్రేమ్రాజ్ మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వైయస్ఆర్ జిల్లాలో పోకల నారాయణరెడ్డి ఆత్మహత్యకు యత్నించటం, దానికి కారణం వీరారెడ్డి అంటూ ఆరోపిస్తూ వీడియో విడుదల చేయటం రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, అధికార వైకాపా నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న దోపిడీని చెప్పకనే చెబుతోంది.
వైకాపా నాయకుల నేతృత్వంలోనే
రాష్ట్రంలో ఇసుక వ్యాపారం జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ప్రధాన గుత్తేదారుగా, టర్న్కీ సంస్థ ఉపగుత్తేదారుగా సాగుతున్నట్లు ప్రభుత్వ దస్త్రాల్లో ఉంటుంది. ఇసుక కొన్నవారికి రసీదులూ ఆ సంస్థల పేరిటే ఇస్తారు. కానీ మొత్తం దందాను రాష్ట్ర స్థాయిలో వైకాపా ‘ముఖ్య నేతలు’, ప్రభుత్వ పెద్దలే శాసిస్తున్నారు. జిల్లాల వారీగా ఆ బాధ్యతలను వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, వారి బంధువులు, తమకు అత్యంత సన్నిహితులు, ఇతరులకు అప్పగించారు. వారి నుంచి ముందస్తుగా రూ.కోట్లలో అడ్వాన్సులు వసూలు చేశారు. నెలవారీగా ఎంత డబ్బు కట్టాలో లక్ష్యాలు నిర్దేశించారు. జిల్లా స్థాయిలో ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్న నాయకులు.. ‘ముఖ్య నేతలకు’ నెలవారీ కట్టాల్సిన డబ్బుతో పాటు, వారు మరింత సంపాదించేందుకు మరో అడుగు ముందుకేశారు. ఆయా జిల్లాల్లోని ఇసుక రేవులకు, ఇంత మొత్తమని ధర నిర్ణయించి స్థానిక వైకాపా నాయకులకు, ఇతరులకు అప్పగించారు. ఈ దోపిడీయే ఇప్పుడు ఆత్మహత్యలకు కారణమవుతోంది.
అడిగినంత కట్టలేక
కళ్లేపల్లి ప్రేమ్రాజ్ అనే వ్యక్తి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక వ్యాపార నిర్వహణ బాధ్యతలను రూ.25 కోట్లు డిపాజిట్టు చెల్లించి దక్కించుకున్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యనేతలకు ప్రతి నెలా రూ.21 కోట్లు చెల్లించాలి. వ్యాపారం సరిగ్గా జరగకపోవటంతో మూడు నెలల పాటు సొమ్ము చెల్లించలేదు. అధికార పార్టీ పెద్దలు ఆ మొత్తాన్ని డిపాజిట్ నుంచి మినహాయించుకున్నారు. అంతేకాదు ఇసుక వ్యాపార బాధ్యతను ఇతరులకు అప్పగించారు. మళ్లీ ఇసుక బాధ్యతలు ఇవ్వాలని ప్రేమ్రాజ్ ప్రభుత్వ పెద్దలను, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలను కలిసి ప్రాథేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు.
అనుమతుల్లేని రీచ్ అప్పగించి.. రూ.లక్షలు కొల్లగొట్టి
వైకాపా నేత, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏ.మల్లికార్జునరెడ్డి సోదరుడు, ముఖ్యమంత్రి జగన్కు సమీప బంధువైన దుగ్గాయపల్లె వీరారెడ్డి వైయస్ఆర్ జిల్లాలో ఇసుక సిండికేట్ను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె వద్ద పెన్నా నదిలో ఇసుక రీచ్ కోసం వీరారెడ్డికి తాను రూ.81 లక్షలు కట్టానని పోకల నారాయణరెడ్డి చెబుతున్నారు. ఆ రీచ్కు అనుమతి లేకపోవటంతో కొన్నాళ్లపాటు నడిచి మూతపడింది. నష్టపోయానని.. తాను కట్టిన డబ్బులో కొంతైనా తిరిగివ్వాలని బతిమాలుతున్నా వీరారెడ్డి ససేమిరా అనడంతో గత్యంతరం లేకే ఆత్మహత్యకు యత్నించినట్లు నారాయణరెడ్డి చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి