‘గోరుముద్ద’ గ్లాసులపైనా జగనన్న పేరే!

వైకాపా ప్రభుత్వ ప్రచార దాహానికి ఇళ్లు, గుళ్లూ చాలడం లేదు. ఇప్పుడు ఏకంగా విద్యార్థులకు ఇవ్వనున్న గ్లాసులపై కూడా ‘జగనన్న..’ పేరే కనిపిస్తోంది.

Updated : 10 Jun 2023 05:59 IST

వైకాపా ప్రభుత్వ ప్రచార దాహానికి ఇళ్లు, గుళ్లూ చాలడం లేదు. ఇప్పుడు ఏకంగా విద్యార్థులకు ఇవ్వనున్న గ్లాసులపై కూడా ‘జగనన్న..’ పేరే కనిపిస్తోంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు గ్లాసులను సరఫరా చేయాలని చూస్తోంది. ఇప్పటికే మండల కేంద్రాలకు గ్లాసులు వచ్చాయి. వాటిపైనా ‘జగనన్న గోరుముద్ద’ అని ముద్రించారు. విద్యార్థులకు అందించే వాటిపైనా ఇలా పేర్లేంటని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలానికి సరఫరా చేసిన గ్లాసులివి.

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని