Andhra News: కళ్లజోళ్లూ ఇవ్వలేరా?ముద్దు పెడుతూ.. పలకరిస్తే సరిపోతుందా?
ముఖ్యమంత్రి జగన్ అవ్వా, తాతలపై ఒలకపోస్తున్న మమకారం మాత్రం చేతల్లో కనిపించడం లేదు. కంటి వెలుగు పథకం ద్వారా వారికి కళ్లజోళ్లు ఇచ్చి కొత్త ప్రపంచాన్ని చూపిస్తామని ఆర్భాటంగా ఆయన ప్రకటించారు.
మాపై కనికరం లేదా?
ఒకరికి రూ.160 కూడా ఖర్చు పెట్టలేరా?
సీఎం జగన్కు 3 లక్షల మంది అవ్వా, తాతల వేడుకోలు
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అవ్వా, తాతలపై ఒలకపోస్తున్న మమకారం మాత్రం చేతల్లో కనిపించడం లేదు. కంటి వెలుగు పథకం ద్వారా వారికి కళ్లజోళ్లు ఇచ్చి కొత్త ప్రపంచాన్ని చూపిస్తామని ఆర్భాటంగా ఆయన ప్రకటించారు. నెలలు గడిచిపోతున్నా... రాని కళ్లజోళ్ల కోసం నిరీక్షించాలో... తడుముకుంటూ ఎంతకాలం పనులు చేసుకోవాలో.. కొత్త వాటిని కొనుక్కోవాలో వద్దో.. తెలియని పరిస్థితుల్లో ఉన్నామని అవ్వా, తాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నాడు-నేడు, ఇతర అభివృద్ధి పథకాలను రూ.16 వేల కోట్లతో అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి జగన్ కేవలం రూ.160లను ఒక కళ్లజోడుకు ఖర్చు పెట్టేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో? సమస్య తీవ్రత గురించి తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదోనని వారు ప్రశ్నిస్తున్నారు.
అస్తవ్యస్తంగా పంపిణీ
రాష్ట్రంలో కంటి-వెలుగు పథకం అమలు తొలి నుంచీ గందరగోళంగానే ఉంది. ముఖ్యంగా అవ్వా, తాతలకు కళ్లజోళ్ల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పరీక్షలు జరిపి.. వెంటనే కళ్లజోళ్లు అందచేస్తామని చెప్పి నెలలు నడిచిపోతున్నా.. ఇవ్వడం లేదు. వాటి కోసం దాదాపు ఏడెనిమిది నెలల నుంచి అవ్వాతాతలు నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 సంవత్సరాల వయస్సు దాటిన మొత్తం 57 లక్షల మందిలో 35 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. 22 లక్షల మందికి చేయాల్సి ఉంది. ఇందులోభాగంగా 12 లక్షల కళ్లజోళ్ల సరఫరాకు అనుమతి ఇచ్చారు. అందులో మూడు లక్షల మందికి కళ్లజోళ్ల పంపిణీ జరగాల్సి ఉంది. వీరిలో 1.6 లక్షల మంది రాయలసీమలోనే ఉండడం గమనార్హం. కొందరు మూడు, నాలుగు నెలలుగా.. అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ కడప జిల్లాలకు చెందిన వారైతే గత ఏడాది ఆగస్టు నుంచి ఎదురుచూస్తున్నారు.
చేతులెత్తేసిన ‘ఆక్రితి’
వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు అనుసరించి ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వేర్వేరు టెండర్ల ద్వారా మూడు సంస్థలను ఎంపిక చేసింది. తొలి టెండరు ద్వారా కొవిడ్ ముందు ఎంపిక చేసిన ఆక్రితి సంస్థకు ఒక కళ్లజోడు పంపిణీకి రూ.67 ధరను ఖరారు చేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పంపిణీ బాధ్యతను అప్పగించారు. కొన్నాళ్లు పంపిణీ చేసిన ఈ సంస్థ గత ఏడాది ఆగస్టు నుంచి ఆపేసింది. తొలి టెండరు ద్వారా ఖరారు చేసిన ధర ప్రకారం కళ్లజోళ్లను పంపిణీ చేయలేమని, ఇతర ఏజెన్సీలకు మాదిరిగానే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే చెల్లింపులు వెనువెంటనే జరగాలని, ఆలస్యంగా సరఫరా చేస్తే జరిమానా విధించే విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరింది. ముడిసరకుల ధరలు పెరిగినందున ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతోంది. మరో పక్క కొవిడ్ అనంతరం వైద్య ఆరోగ్య శాఖ జోన్ల వారీగా కళ్లజోళ్లను పంపిణీ చేసేందుకు మరో రెండు సంస్థలను ఎంపిక చేసింది. వీటికి రూ.145 నుంచి రూ.160 మధ్య చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్రితి సంస్థ కూడా ధరపెంచమని అడుగుతోంది. దీనిపై యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకోలేకపోవడంతో కళ్లజోళ్ల పంపిణీ నిలిచిపోయింది. దాంతో అవ్వాతాతలకు నిరీక్షణ తప్పడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా దాదాపు 80 వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
అంకెలు పెంచి.. ఆశలు తుంచారు!
ముందుచూపు మందగించిన జగన్ ఏలుబడిలో పోలవరం పనులు అటకెక్కాయి! పోనీ నిర్వాసితులకు పరిహారమైనా.. అందిందా అంటే ఊహూ.. అదీ లేదు!! ముంపును కళ్లారా చూశానన్నారు... ముప్పు నుంచి అమాయకులను రక్షించాల్సిందేనన్నారు... ఇస్తున్న ప్యాకేజీని పెంచాలన్నారు... ఇచ్చిన పరిహారం సరిపోదన్నారు... బాధితులే తొలి లబ్ధిదారులు కావాలన్నారు. -
‘సిద్ధం’ సభకు బస్సులు.. ప్రయాణికులకు కష్టాలు!
వైయస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 400కుపైగా బస్సులు మళ్లించారు. -
సాగునీరందక దెబ్బతింటున్న వరి
అప్పులు చేసి.. బంగారం తాకట్టు పెట్టి వరి సాగుకు పెట్టుబడి పెడితే సకాలంలో నీరందక పైరు దెబ్బతింటోందని, రుణం తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం ఆయకట్టు గ్రాంటు పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. -
పొట్లను మించిన సొరకాయ!
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట డౌన్లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామి ఇంటి ఆవరణలో ఓ సొర పాదు 5 అడుగుల కాయ కాసింది. -
మంచం పట్టిన సేవానాయక్ తండా
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సేవానాయక్ తండాలో గన్యా జ్వరం విజృంభణతో స్థానికులు విలవిల్లాడుతున్నారు. 170 కుటుంబాలు ఉన్న ఈ తండాలో సుమారు 400 మంది నివసిస్తున్నారు. -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
విద్యుత్పై అదనపు లోడ్ ఛార్జీల భారం
ఆదాయ మార్గాలను అన్వేషించి ప్రజలను పీల్చి పిప్పిచేయడం జగన్ ప్రభుత్వానికి రివాజుగా మారింది. వడ్డీ వ్యాపారుల మాదిరి విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపుతోంది. -
కార్టూన్
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా