నిర్వహణకు నిధులివ్వక ప్రాజెక్టుల భద్రత గాలికి..
ఈ ఫొటోలన్నీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో కీలకమైన ధవళేశ్వరం కాటన్ బ్యారేజి దుస్థితికి సంబంధించినవి.
ఇప్పటికే కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు
పులిచింతల, గుండ్లకమ్మ గేటుదీ అదే పరిస్థితి
ఇంత జరిగినా మేల్కోని జగన్ సర్కార్
నిర్వహణ పనులకు ఏ మాత్రం చాలని నిధులు
బిల్లులు రాక ముందుకు రాని గుత్తేదారులు
అధ్వానంగా అనేక ప్రాజెక్టులు
ఈ ఫొటోలన్నీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో కీలకమైన ధవళేశ్వరం కాటన్ బ్యారేజి దుస్థితికి సంబంధించినవి. ఈ బ్యారేజి దాదాపు 10 లక్షల ఎకరాలకు నీరందిస్తుంది. వరద కాలంలో బ్యారేజిలో నీరు నిలిపి మధ్య, పశ్చిమ, తూర్పు డెల్టా కాలువల ద్వారా లక్షల ఎకరాలకు నీరందిస్తారు. అయితే బ్యారేజి పరిస్థితి, అందులోని గేట్లు అత్యంత దారుణంగా తయారయ్యాయి. ప్రాజెక్టు గేట్ల రోలర్లలో బేరింగులు పాడైపోయాయి. ఆ బేరింగుల్లో ఉండే బాల్స్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. డ్యాం భద్రతా కమిటీ ఈ విషయాలను గుర్తించి తక్షణమే పనులు చేపట్టాలని సిఫార్సు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం ప్రధాన గేట్లు 175, స్లూయిస్ గేట్లు 22 ఉన్నాయి. గతంలో 53 గేట్లకు మాత్రమే మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం మిగిలిన అన్ని గేట్ల పరిస్థితీ దారుణంగా తయారైంది. 2018 నుంచి కూడా ధవళేశ్వరం బ్యారేజి గేట్లు, ఇతర మరమ్మతు పనులు పూర్తి కావడం లేదు. నిధులు లేకపోవడం, బిల్లులు పెండింగులో ఉండటమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.
ఈనాడు - అమరావతి
లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల జనాభాకు తాగునీరు అందించే ప్రాజెక్టులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉన్నా వాటి నిర్వహణ విషయంలో రాష్ట్రంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. వరుసగా ప్రాజెక్టుల గేట్లు...మొత్తం ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నా ప్రభుత్వం మేల్కొనడం లేదు. ప్రాజెక్టుల మరమ్మతులకు చర్యలు తీసుకోవడం లేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత ఒక కమిటీని వేసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను సరిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఇప్పటికీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు లేవు. చర్యలూ లేవు.
రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించిన డ్యాంలు అవి. ఏటా తప్పనిసరిగా వాటి నిర్వహణ పనులు చేపట్టాలి. అన్ని పరికరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో సరిచూసుకోవాలి. తలుపులు ఎత్తే హాయిస్టంగ్ వ్యవస్థ సరిగా పని చేస్తోందో లేదో గమనించుకోవాలి. తలుపులు గట్టిగా ఉన్నాయా? ఏవైనా మరమ్మతులు అవసరమా అన్నది పరిశీలించి ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ ఉండాలి. అయితే ఇందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. ‘మా ప్రాజెక్టుకు నిధులు కావాలి, నిర్వహణ ఎంతో ముఖ్యం..మంజూరు చేయండి’ అని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ‘ఒక పెద్ద ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకు రూ.5 లక్షలు కావాలని కోరినా ఆర్థికశాఖ స్పందించడం లేదు’ అని జల వనరులశాఖలో కీలక అధికారి ఒకరు ఆవేదన చెందారంటే పరిస్థితి ఊహించవచ్చు. ప్రాజెక్టుల నిర్వహణకు చాలా కొద్ది మొత్తాల కోసం ఆర్థికశాఖకు పంపిన ఫైళ్లు సైతం మూలుగుతున్నాయి తప్ప జీవోలు రావడం లేదు’ అని ఆయన ఆవేదన చెందారు.
ఇదీ పరిస్థితి
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ హయాంలోనే పులిచింతల గేటు కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు, పింఛా వరద కట్ట కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు సైతం కొట్టుకుపోయి 33 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మేల్కోలేదు. ఇప్పటికీ సరిదిద్దే పరిస్థితి లేదు. అన్నమయ్య ప్రాజెక్టు విషాదం తర్వాత సీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి అన్ని ప్రాజెక్టులపై అధ్యయనం చేయించి ప్రాజెక్టుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినా వరుసగా రెండో ఏడాదీ అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది.
గుత్తేదారులు ముందుకు రావడం లేదు
ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కావాలని ఎప్పటికప్పుడు కింది స్థాయి నుంచి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం ఉండటం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి చిన్న పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు.
కీలక శ్రీశైలం ప్రాజెక్టుపైనా నిర్లక్ష్యం
శ్రీశైలం ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు అటు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రయత్నిస్తున్నా మంజూరు కావడం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమూ తగినన్ని నిధులు ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్టు నిర్వహణ పనుల కోసం సుమారు రూ.50 లక్షలు మాత్రమే బడ్జెట్లో చూపారని, అవి ఏమాత్రం సరిపోవని అధికారులే అంటున్నారు. చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లోనూ ఆలస్యమవుతున్నాయి. శ్రీశైలంలోనూ గుత్తేదారులు మధ్యలోనే పనులు ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. స్టాప్ లాగ్ గేట్ల బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు ఇప్పటికీ ఆ పనులు చేయలేదు.
డ్యాం భద్రతా కమిటీలు నివేదికలు ఇచ్చినా...
రాష్ట్రంలో డ్యాం భద్రతా కమిటీ ఏటా కొన్ని ప్రాజెక్టులను సందర్శించి చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇస్తుంటుంది. అయితే ఆ మేరకూ పనులు సకాలంలో చేస్తున్న దాఖలాలు లేవు.
* డ్యాంలపై అవగాహన ఉన్న సిబ్బంది చాలా మంది పదవీవిరమణ చేశారు. వారి స్థానంలో కొత్తవారి నియామకానికి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. చాలా చోట్ల లస్కర్లు కూడా లేరు.
నిధులు ఎక్కడ?
ప్రాజెక్టుల నిర్వహణకు నిధులిచ్చే హెడ్లలో నిధులు లేకపోవడంతో ఆ పనులు ఏవీ సరిగా జరగడం లేదు. రూ.మూడునాలుగు లక్షలు కూడా నిర్వహణ ఖర్చులకు ఇచ్చే పరిస్థితి లేదని రాయలసీమ ప్రాజెక్టులకు చెందిన ఎస్ఈ ఒకరు వాపోయారు. గుత్తేదారులు కూడా పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. బతిమాలుకొని పనులు చేయించాల్సి వస్తోందని చెబుతున్నారు. కొన్ని చోట్ల అధికారులు సొంత డబ్బులు పెట్టి చిన్నచిన్న పనులు చేయిస్తున్నారు.
* గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గతంలోనే రూ.3 కోట్లు మంజూరు చేయాలని అడిగారు. ఆ నిధులు ఇవ్వకపోవడం వల్ల కిందటేడాది సెప్టెంబరులో గేటు కొట్టుకుపోయింది. ఆ తర్వాత నిపుణుల కమిటీలు సందర్శించి నివేదికలు ఇచ్చినా ఆ మేరకు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అనేక గేట్లు బలహీనంగా ఉన్నాయని గుర్తించినా ఇప్పటికీ వాటిని సరిదిద్దలేదు.
* 2021 ఆగస్టు 5 తెల్లవారుజామున పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. టైప్లాట్స్ పూర్తిగా తెగిపోయాయి. పనులకు నిధులు మంజూరు చేయడంలోనూ ఆలస్యం అయింది. టెండర్లు పిలిచి పనులు చేపట్టింది కిందటి ఏడాదిలోనే. గేటు కొట్టుకుపోయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
* ప్రస్తుత ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఎర్రకాలువ జలాశయంలో నాలుగేళ్ల కిందట గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించగా అవి పని చేయలేదు. దీంతో దిగువన సర్ప్లస్ ఛానల్కు గండి పడింది. ఆ నిధుల కోసం అధికారులు అనేకసార్లు ప్రతిపాదనలు పంపిన తర్వాత చివరికి 2022 జూన్లో పాలనామోదం దక్కింది. ఇంతవరకు ఎర్రకాలువ ప్రధాన జలాశయానికి సంబంధించిన షట్టర్లు, బేరింగులు తదితర పనులు పూర్తి కాలేదు. జలాశయంలో నీళ్లు ఉండటం వల్లే ఆ పనులు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు. కొంత మేర పనులు అయ్యాయని చెబుతున్నారు. రూ. 20 లక్షలకు బిల్లులు సమర్పించాల్సి ఉందన్నారు.
* కడప జిల్లా లోయర్ సగిలేరు నిర్వహణ పనులు, గేట్ల పనులు ఆలస్యమవుతున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ