Jagananna Vidya Kanuka: పిల్లలు తగ్గినా ‘కానుక’ ఖర్చు పెరిగింది.. నాణ్యత పేరుతో అధిక ధరలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘విద్యా కానుక’ కిట్ల ధర ఈ ఏడాది భారీగా పెరిగిపోయింది. విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులన్నీ నాణ్యమైనవని ప్రభుత్వం ఏటా ప్రకటిస్తోంది.
గతేడాదితో పోల్చితే 2 లక్షల మంది తగ్గిన విద్యార్థులు
పెరిగిన రూ.155 కోట్ల వ్యయం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘విద్యా కానుక’ కిట్ల ధర ఈ ఏడాది భారీగా పెరిగిపోయింది. విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులన్నీ నాణ్యమైనవని ప్రభుత్వం ఏటా ప్రకటిస్తోంది. కానీ, ఈసారి నాణ్యత పెంచామంటూ వ్యయాన్నీ భారీగా పెంచేశారు. అంటే గతంలో ఇచ్చిన వస్తువుల్లో నాణ్యత లేదా? లేదంటే ఈసారి ఎక్కువ ధరలు పెట్టి కొన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల నిబంధనల ప్రకారం గుత్తేదార్లు వస్తువులను సరఫరా చేయాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధించడంతోపాటు బ్లాక్ లిస్టులో పెట్టొచ్చు. కానీ టెండర్ల నిబంధనల ప్రకారం వస్తువుల నాణ్యత ఉందా లేదా అని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కు అప్పగించింది. ఇందుకోసం ఈ సంస్థకు రూ.1.50 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది సరఫరా చేసిన బ్యాగ్ల్లో చాలా వరకు చినిగిపోయాయి. అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకే 6 లక్షలు చినిగినట్లు గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి ఇచ్చారు. కానీ, గుత్తేదార్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పాత గుత్తేదార్లలో ముగ్గురు ఈ ఏడాదీ బ్యాగ్లు సరఫరా చేస్తుండటం గమనార్హం. చినిగిన బ్యాగ్లు ఇచ్చిన వారిని వదిలేసి, వస్తువుల తనిఖీ కోసమంటూ రూ.1.5 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పిల్లలు తగ్గినా.. వ్యయం పెరిగింది
2022-23 విద్యా సంవత్సరంలో 45,14,687 మంది విద్యార్థులకు కిట్లు అందించేందుకు రూ.886.69 కోట్లు వ్యయమైంది. ఈ ఏడాది 43,10,165 మంది పిల్లలకు కిట్లు ఇవ్వడానికి రూ.1,042.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పిల్లల సంఖ్య రెండు లక్షలు తగ్గినా.. వ్యయం మాత్రం రూ.155 కోట్లు పెరగడం గమనార్హం.
భారీగా పెరిగిన బ్యాగ్ల ధర
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 39,95,992 మంది ఉన్నారు. అదనంగా వచ్చే పిల్లల కోసమని కూడా లెక్కవేసి 43 లక్షలకు పైగా బ్యాగులు కొనుగోలు చేశారు. గతేడాది నాణ్యత లేని బ్యాగ్లు ఇచ్చారని, ఈసారి నాణ్యమైనవి కొనడం వల్లే ధరలు పెరిగినట్లు అధికారులు చెప్పడం గమనార్హం. గతేడాది మూడు సైజుల బ్యాగ్ల ధర సరాసరిన రూ.185 ఉండగా.. ఈసారి అది రూ.272.92 అయింది. అంటే ఒక్క బ్యాగ్ ధరే సుమారు రూ.88 పెరిగింది. గుత్తేదార్లు రింగ్ కావడం వల్లే దీని ధరలు భారీగా పెరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని స్థాయిల విద్యార్థులకు కలిపి ఒకే బ్యాగ్ అందించేలా ఒక్కోటి రూ.265 ధరకు టెండర్లు పిలిచారు. గుత్తేదార్లు రింగై 30 శాతం అధికానికి కోట్ చేశారు. రివర్స్ టెండర్లలోనూ గుత్తేదార్లు దిగి రాకపోవడంతో వీటిని రద్దు చేశారు. ఆ తర్వాత బ్యాగ్ల సైజులను మూడు రకాలుగా విభజించి, అయిదు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. 2.43 శాతం అధికంగా గుత్తేదారులు కోట్ చేశారు. ఒక్కో బ్యాగ్ రూ.272.92 సరఫరా చేసేందుకు అంగీకరించారు.
* గతేడాది జత బూట్లు, 2 జతల సాక్సులు కలిపి రూ.175కు కొనగా.. ఈసారి అది రూ.187.48కి పెరిగింది. ఒక్కో యూనిట్పై రూ.12 అధికంగా చెల్లించబోతున్నారు.
* గతేడాది 1-5 తరగతులకు ఇచ్చిన పిక్టోరియల్ డిక్షనరీ ఒక్కోదాన్ని రూ.64కు ముద్రిస్తే ఈసారి రూ.69.47కు పెరిగిపోయింది. 6-10 తరగతులకు ఇస్తున్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒక్కోటి గతేడాది రూ.168 పెట్టి కొన్నారు. ఈసారి ఏకంగా రూ.193 ఖర్చు చేశారు.
* 1-8 తరగతులకు ఇస్తున్న ఒక్కో పాఠ్యపుస్తకం ధర సరాసరిన రూ.11.88 పెరిగింది.
* 6-10 తరగతులు చదివే విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న నోటు పుస్తకాల పరిస్థితీ ఇలాగే ఉంది. ఈ ఏడాది సరాసరిన ఒక్కో నోట్ పుస్తకానికి రూ.6 అదనంగా ఖర్చు చేశారు.
నోటుపుస్తకాలపైనా జగన్ ప్రచారం
ముఖ్యమంత్రి జగన్ ప్రచారం కోసం చివరికి విద్యార్థుల్నీ వదలేదు. విద్యా కానుక కింద ఇచ్చే రాత పుస్తకాలపైన జగన్ ఫొటో ముద్రించారు. స్వచ్ఛంగా ఉండాల్సిన పాఠశాల వాతావరణాన్నీ రాజకీయాలతో కలుషితం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది నోటు పుస్తకాలపై ‘నాడు- నేడు’, సంప్రదాయ నృత్యాలు, చేతివృత్తులు వంటి చిత్రాలను ముద్రించారు. ఈసారి ‘జగనన్న అమ్మఒడి’, జగనన్న విద్యాకానుక, తదితర కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ ఫొటో ముద్రించారు. పాఠశాల విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి స్వామి భక్తి ప్రదర్శించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్