జగనన్నా.. పల్లెకు బస్సులు ఏవన్నా!?
అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తులను కేవలం భౌతికంగా ముట్టుకోవడానికి వీల్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం.
రాష్ట్రంలో 3,669 గ్రామాలకు ఆర్టీసీ సేవలే లేవు
వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటా తగ్గుతున్న వైనం
గ్రామస్థుల విజ్ఞప్తులు బుట్టదాఖలు చేస్తున్న అధికారులు
ఈనాడు - అమరావతి
అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తులను కేవలం భౌతికంగా ముట్టుకోవడానికి వీల్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం. రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పలు రూపాల్లో ఉన్న ఈ పెత్తందారీ భావజాలం మీద యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది.’
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం జగన్ వ్యాఖ్యలు ఇవి.
- ఆర్టీసీ బస్సులు ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం అంటరానితనం అన్నారే.. మరి మీరు రాష్ట్రంలోని పల్లెలన్నింటికీ పూర్తిస్థాయిలో బస్సుల్లేకుండా చేయడాన్ని ఏమంటారు జగన్?
- ఇది పేదల పక్షపాత ప్రభుత్వమని, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ.. అంటూ ప్రతి ప్రసంగంలో వారిపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తుంటారే.. మరి అదే పేదలు, రైతులు, కులవృత్తులు చేసుకునేవాళ్లు, అన్నివర్గాల గ్రామీణులు అత్యధికంగా ఉండే గ్రామాలన్నింటికీ ఆర్టీసీ బస్సులను ఎందుకు నడపలేకపోతున్నారు?
- రాష్ట్రంలో 3,669 గ్రామాలకు అసలు బస్సులే నడపకుండా, ఆటోల్లోనో, ప్రైవేటు వాహనాల్లోనో మీ పాట్లు మీరు పడండి అని వదిలేయడమేనా వారిపై ప్రేమంటే?
- ఆటోలు, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు అడిగినంత ఛార్జీ చెల్లించేందుకు గ్రామీణులు పడుతున్న ఇక్కట్లు మీకు కనిపించవా?
- బస్సుల్లేకపోవడంతో ఆయా గ్రామాలకు సామర్థ్యానికి మించి 10-15 మందిని ఎక్కించుకొని ప్రయాణించే ఆటోలు.. అధ్వానంగా ఉన్న రోడ్లపై గుంతలు తప్పించుకొని వెళ్లే ప్రయత్నంలో తరచూ ప్రమాదాలకు గురికావడం మీకు తెలియదా?
- నాలుగేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి, ప్రయాణికులపై ఏటా రూ.2 వేల కోట్ల మేర భారం వేయడంపై ఉన్న శ్రద్ధ పల్లెలకు బస్సులను పరుగులు పెట్టించడంపై ఎందుకు లేదు సీఎం సార్?
గ్రామాల్లో ఉండే ప్రజలు నిత్యం తమ అవసరాల కోసం సమీప పట్టణాలు, మండల, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాలంటే సురక్షిత ప్రయాణం, తక్కువ ఛార్జీల కారణంగా ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. కానీ ఏపీఎస్ఆర్టీసీ మాత్రం అన్ని పల్లెలకు బస్సులు నడిపేందుకు మొగ్గుచూపడంలేదు. గిట్టుబాటు కాదని, రూట్ కనెక్టివిటీ ఇవ్వలేమని.. ఇలా రకరకాల కారణాలతో పలు గ్రామాలకు బస్సులు నడపడంపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ నిత్యం 3,510 రూట్లలో బస్సులు నడుపుతుండగా.. ఇవి 14,213 గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అయినా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు 3,669 ఉన్నాయి. మా ఊళ్లకు బస్సు నడపండి మహాప్రభో అంటూ ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వేడుకున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడంలేదు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే.. పరిశీలిస్తామని హామీ ఇచ్చి, తర్వాత దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు.
ఏటా తగ్గుతున్న బస్సుల సంఖ్య
జగన్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో బస్సుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. అత్యధిక కిలోమీటర్లు తిరిగిన, కాలంచెల్లిన బస్సుల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేయడంలేదు. దీంతో గత నాలుగేళ్లలో ఏసీ మినహా, మిగిలిన అన్ని రకాల సర్వీసుల సంఖ్య తగ్గిపోయింది.
ఆర్టీసీలో 2019లో మొత్తం బస్సుల సంఖ్య 11,770 కాగా, వైకాపా అధికారంలో ఉన్న గత నాలుగేళ్లలో 866 బస్సులు తగ్గి 10,904కి చేరింది.
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ వంటి నాన్ ఏసీ బస్సులు 4,439 ఉండగా, ప్రస్తుతం 568 బస్సులు తగ్గిపోవడంతో 3,871 మాత్రమే నడుపుతున్నారు.
గ్రామీణుల ప్రయాణించే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు 5,648 నుంచి 5,504 సర్వీసులకు తగ్గాయి. ఈ లెక్కన పల్లె బస్సుల్లో 144 కనుమరుగయ్యాయి.
గత నాలుగేళ్లలో కేవలం ఏసీ సర్వీసులు మాత్రమే పెరిగాయి. 2019లో 340 ఏసీ సర్వీసులు నడపగా, ప్రస్తుతం 462 బస్సులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
భూమ్భూమ్, ఆంధ్రాగోల్డ్ వంటి పేర్లతో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని రంగు నీళ్లతో కల్తీ చేసి విక్రయిస్తున్నాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ ఘటన వెలుగు చూసింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
వచ్చే ఏడాది (2024) సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా నోటిఫికేషన్లో పేర్కొంది. -
ప్రధాని మోదీతో మాట్లాడిన పాకల మహిళ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో గురువారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. -
నాగార్జున సాగర్పై ఘర్షణ
ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ 13 గేట్ల స్వాధీనం పేరుతో జగన్ ప్రభుత్వం పెద్ద హైడ్రామాకు దిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు సినిమా కథను మరిపించేలా ఉత్కంఠగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. -
Visakhapatnam: ‘రౌడీ’ రాజు
ఆయన అధికార పార్టీలో కీలక నేత. నామినేటెడ్ పదవిలో ఉన్నారు. విశాఖపట్నంలో రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, దాన్ని ‘రాజు’లా నడిపిస్తున్నారు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
YS Jagan: ఇప్పుడే ఎందుకీ దండయాత్ర?
ఉలుకూ, పలుకూ లేకుండా.. ముందస్తుగా ఎలాంటి చర్చలు లేకుండా జగన్ ప్రభుత్వం నాగార్జునసాగర్పైకి దండయాత్రకు వెళ్లింది. -
IT Jobs in AP: కంపెనీలు రావడం లేదేంటి బ్రో!
రాష్ట్రంలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణల్ని నిలిపేసిన ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు భారీగా పడిపోయాయి. -
ఉద్యోగులకు డీఏ, జీపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు చెల్లించాల్సిన డీఏ, ఆర్జిత సెలవులు, జీపీఎఫ్ బకాయిలు, పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్ డిమాండ్ చేశారు. -
అగ్ర దేశాల్ని అధిగమించడమే లక్ష్యం
ప్రపంచంలోని అగ్ర దేశాల్ని అధిగమిస్తూ... 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ముందు వరుసలో నిలపాలన్నది ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. -
మొక్కుబడి పర్యటన.. తూతూమంత్రం పరిశీలన
ఎన్నడూ లేనన్ని అక్రమాలు, అవకతవకలు, లోపాలు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాల్లో వెలుగుచూస్తున్నాయి. -
తెలంగాణ ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ష్ణా, గోదావరి నదులపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్ -
‘రీ-సర్వేతో భూములపై’ హక్కులు పోతున్నాయ్
జగనన్న శాశ్వత భూ హక్కు కార్యక్రమంతో రైతులకు సొంత భూములపై హక్కు లేకుండా పోతోంది. వారసత్వంగా వచ్చిన భూమిలో పది సెంట్ల నుంచి ఎకరా వరకు రీ-సర్వేలో తగ్గిపోతుండటంతో కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
సమస్యలు పరిష్కరిస్తేనే సహకరిస్తాం
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లెలోని యురేనియం పరిశ్రమ ప్రభావిత గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తేనే ప్రజాభిప్రాయ సేకరణకు సహకరిస్తామని ఆయా గ్రామాల నాయకులు పేర్కొన్నారు. -
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడమే పొన్నవోలు లక్ష్యం
తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, వ్యక్తిగతంగా ఆయన్ను పలచన చేయడమే లక్ష్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి పని చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
కోర్టు చెప్పినా బేఖాతరు..!
రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాటన్ బ్యారేజీ సమీపంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం స్టే ఇచ్చినా గురువారం యథేచ్ఛగా తవ్వకాలు సాగిపోయాయి. -
హామీల కోతలు
తన చేతికి ఎముకలేదన్నట్లు ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి జగన్కు రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకిచ్చే పెట్టుబడి రాయితీని పెంచేందుకు మాత్రం 54 నెలలుగా చేతులు రావడం లేదు. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోండి
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్ పిలుపునిచ్చారు. -
ఏఆర్ఆర్ ప్రతిపాదనల సమర్పణ
ఏపీ ట్రాన్స్కో, విద్యుత్తు రంగ సంస్థలు ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ల 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 వరకు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లతోపాటు ఏపీ డిస్కంలు 2024-25కు రిటైల్ సరఫరా కార్యకలాపాల ఏఆర్ఆర్ను గురువారం దాఖలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Bomb threat: బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?