నాడు నంబి నారాయణన్.. నేడు చంద్రబాబు
నిజాయతీపరుడైన ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్పై కక్షసాధింపుతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపినట్లుగానే 45 ఏళ్లపాటు రాష్ట్రానికి సేవలందించిన మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని తెలుగుదేశం లోక్సభాపక్ష నేత కె.రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
నిజాయతీపరులపై తప్పుడు కేసులు
యువతరానికి ఏం సందేశం ఇస్తున్నారు?
లోక్సభలో రామ్మోహన్నాయుడు
ఈనాడు, దిల్లీ: నిజాయతీపరుడైన ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్పై కక్షసాధింపుతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపినట్లుగానే 45 ఏళ్లపాటు రాష్ట్రానికి సేవలందించిన మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని తెలుగుదేశం లోక్సభాపక్ష నేత కె.రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. నంబిని అరెస్టుచేసి జైలుకు పంపడం చూసిన తర్వాత కష్టపడి పనిచేసి దేశానికి సేవ చేయాలనుకున్న శాస్త్రవేత్తల మనసుల్లో భయాందోళనలు రేకెత్తాయని, ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో తనలాంటి యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆయన గురువారం లోక్సభలో చంద్రయాన్ విజయవంతంపై జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించారు.‘‘ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది. ఆ పరిస్థితుల్లో పోరాడేవారు నాయకులుగా ఎదుగుతారని మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. ఇస్రో శాస్త్రవేత్తలు దాన్నే ప్రపంచానికి చాటిచెప్పారు. వాళ్లు అవకాశాలను అందిపుచ్చుకొని నాయకులుగా ఎదిగారు. ఇస్రో పేరు ఎప్పుడు ప్రస్తావించినా యువతకు గుర్తొచ్చేది మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలామే. చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్గా ఉన్నప్పుడు అంతటి గొప్ప వ్యక్తి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినందుకు మేం గర్విస్తున్నాం. ఆయన ఈరోజు జీవించి ఉంటే ఇస్రో విజయాన్ని చూసి ఎంతో సంతోషించి ఉండేవారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇస్రో సహకారంతో పిడుగుపాట్ల వంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నించారు. ముందస్తు హెచ్చరికలతో ప్రజలు వాటి బారినుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడటానికి వీలైంది.
పోలవరం లాంటి భారీ కార్యక్రమాల పర్యవేక్షణకు స్పేషియల్ డ్యాష్బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నేను ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణ్ కేసు గురించి సభ దృష్టికి తేదలచుకున్నాను. శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి కోసం ఏళ్ల తరబడి చేసిన కష్టం... సంకుచిత కక్షసాధింపు ధోరణి కారణంగా వృథా అవుతుందనడానికి ఆయన ఉదంతం ఓ ఉదాహరణ. ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపడం చూసిన తర్వాత కష్టపడి పనిచేసి దేశానికి సేవ చేయాలనుకున్నవారిమనసుల్లో భయాందోళనలు రేకెత్తాయి. అన్ని అభియోగాల నుంచి విముక్తి పొందినా.. ఆయన ఆరోగ్యం, ప్రతిష్ఠను దెబ్బతీశాయి. 45 ఏళ్లపాటు నిరంతరంగా రాష్ట్రం కోసం పనిచేసిన మచ్చలేని మా నాయకుడు చంద్రబాబుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. నిజాయతీని శిక్షించడం ద్వారా నాలాంటి యువనాయకులకు ఏం సందేశంఇస్తున్నారు? మరోవైపు సైకోఫ్యాన్స్ చుట్టుముట్టిన నాయకుడు ఈ దేశానికి చెందిన రూ.43వేల కోట్లను దోచుకొని ఈ నెల 23న పదో బెయిల్ వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. అందువల్ల ఈవ్యవస్థను సరిదిద్దాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రజాస్వామ్య హననానికి వ్యతిరేకంగా సభలో ఉన్నవారంతా ముక్తకంఠంతో నినదించాలని పిలుపునిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
అన్పార్లమెంటరీ పదాలు వాడలేదు.. ప్యానల్ స్పీకర్: రామ్మోహన్నాయుడు మాట్లాడుతున్నప్పుడు వైకాపా ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేయగా ఆయన వాటిని తోసిపుచ్చారు. ‘‘నేను ఇక్కడ ఏదైనా ఒక్క అన్పార్లమెంటరీ వ్యాఖ్య చేసినా సభాధ్యక్ష స్థానంలో ఉన్న మీరు తొలగించవచ్చు. నేను ఎక్కడా హద్దులు దాటకుండా నా పరిధిలో మాట్లాడుతున్నా’’ అన్నారు. అది వినిపించుకోకుండా వైకాపా సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో స్పీకర్స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ ఎన్కే ప్రేమచంద్రన్ జోక్యంచేసుకొని వారి వాదనలను తోసిపుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
వైకాపా తన ప్రచారానికి దేనిని వదలడం లేదు. చివరికి ప్రభుత్వ నిధులతో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలకు సంబంధించిన పరికరాలను సైతం పార్టీ ప్రచారానికి వాడుకుంటోంది. -
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్మెన్ సుజిత్ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్ప్రెస్కు సోమవారం పెను ప్రమాదం తప్పింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రామాణిక విద్యకు ఛార్జి మెమోలే పరిష్కారమా?
ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసి, ఛార్జిమెమో ఇవ్వడం ద్వారా విద్యారంగంలోని సమస్యలు పరిష్కారం అవుతాయా అని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
ఏపీలో ఎయిర్ఫైబర్ సేవలు విస్తరించిన జియో
రిలయన్స్ జియో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఎయిర్ఫైబర్ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
Ramana Deekshitulu: తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు
తితిదే అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్ (ట్విటర్)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. -
ఐఐటీఎఫ్లో ఏపీ పెవిలియన్కు మూడో బహుమతి
దేశ రాజధాని దిల్లీ ప్రగతిమైదాన్లో ఈనెల 14 నుంచి 27 వరకు నిర్వహించిన భారత అంతర్జాతీయ వ్యాపారమేళా (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ఫెయిర్- ఐఐటీఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసిన పెవిలియన్కు మూడో బహుమతి దక్కింది. -
కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప!
విద్యుత్ పంపిణీ సంస్థలకూ (డిస్కంలు) జగన్ ‘షాక్’ తప్పలేదు. ఈ ఏడాది జులై నాటికి వాటి నెత్తిన ప్రభుత్వం రూ.19 వేల కోట్ల కొత్త అప్పులు పెట్టింది. ఇప్పటికే డిస్కంలు నెలవారీ నిర్వహణ ఖర్చులకూ సతమతమవుతున్నాయి. -
అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో అంచనాలకు మించి తరలివచ్చారు. సుమారు రెండు లక్షలకు పైగా ప్రదక్షిణలో పాల్గొన్నారని అధికారుల అంచనా. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
స్మార్ట్మీటర్ల ఏర్పాటు.. మోదీ మెప్పుకోసమే
‘స్మార్ట్మీటర్ల ఏర్పాటును భాజపా పాలిత రాష్ట్రాలు సహా అందరూ వ్యతిరేకిస్తున్నారు. మోదీ మెప్పు కోసం ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల వ్యవసాయ పంపుసెట్లు సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్మార్ట్మీటర్లను బిగించడానికి సన్నాహాలు చేస్తోంది’ -
రాజధానిలో యథేచ్ఛగా రహదారుల విధ్వంసం
రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం బోరుపాలెం ఇసుక రీచ్ వద్ద రోడ్డు తవ్వుకుపోయిన దొంగలు.. -
పుడమితల్లికి సేవ.. లాభాల సాగుకు తోవ
ఏ పంటైనా సరే.. విత్తు దగ్గర నుంచి కోత వరకు కనీసం 60- 180 రోజుల సమయం పడుతుంది. అదే ప్రతివారం ఏదో ఒక పంట కోతకు వచ్చి ఆదాయం చేతికందితే ఎలా ఉంటుంది. అదే చేసి చూపించారు.. అనంతపురం జిల్లాకు చెందిన రైతు నారాయణప్ప. -
పశువులూ అల్లాడుతున్నాయ్!
నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి. -
వచ్చామా.. చూశామా.. వెళ్లామా..!
ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన హడావుడిగా సాగింది. కొన్ని చోట్ల ఆయన పదేసి నిమిషాలపాటు మాత్రమే పరిశీలించారు. -
Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
పెద్దిరెడ్డి ఇలాకాలో భూసేకరణపై రైతుల మండిపాటు
విద్యుత్తు బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్కు తమ భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. -
వెలిగొండ గుండె మండుతోంది!
వచ్చే ఏడాది సెప్టెంబరు, అక్టోబరుకల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, జలాశయంలో నీటిని నిలుపుతాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టు నిర్వాసితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ప్యాకేజీ అందిస్తాం. -
డి-ఫార్మసీ(పాలిటెక్నిక్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కళాశాలల్లో డి-ఫార్మసీ కోర్సు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. -
ఇటొస్తే.. ఇరుక్కున్నట్లే..!
గుంతల రహదారులు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. రాకపోకలు సాగించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రహదారుల దుస్థితికి ఈ చిత్రం నిదర్శనం.


తాజా వార్తలు (Latest News)
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
-
Team India: పెళ్లిపీటలెక్కబోతున్న భారత్ ఫాస్ట్ బౌలర్
-
Uttarakhand Tunnel: ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి.. సొరంగం నుంచి సురక్షితంగా బయటికొస్తున్న కూలీలు
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Child Selling Racket: పేద తల్లులే లక్ష్యం.. శిశు విక్రయ ముఠా గుట్టు రట్టు
-
Paris: బీచ్లు, పార్కుల్లో ధూమపానంపై నిషేధం!