చంద్రబాబు పోలీసు కస్టడీపై నేడు అనిశా కోర్టు నిర్ణయం
నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తామని అనిశా కోర్టు న్యాయాధికారి బి.సత్య వెంకట హిమబిందు గురువారం తెలిపారు.
హైకోర్టు నేటి కేసుల జాబితాలో లేని క్వాష్ పిటిషన్
ఈనాడు, అమరావతి: నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తామని అనిశా కోర్టు న్యాయాధికారి బి.సత్య వెంకట హిమబిందు గురువారం తెలిపారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా అనిశా కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారమే హైకోర్టు నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందేమో వేచి చూద్దామన్నారు. శుక్రవారం హైకోర్టు నిర్ణయం లేకపోతే పోలీసు కస్టడీపై తాను ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఒకవేళ హైకోర్టు శుక్రవారమే స్పందిస్తే.. తన నిర్ణయాన్ని వాయిదా వేస్తానని పేర్కొన్నారు.
చంద్రబాబును అయిదు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అనిశా కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఈ నెల 20న సుదీర్ఘ వాదనలు జరిగాయి. 21న నిర్ణయం వెల్లడిస్తామని అనిశా కోర్టు న్యాయాధికారి పేర్కొన్నారు. 21న(గురువారం) జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్పై నిర్ణయం ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులను న్యాయాధికారి అడిగారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పందిస్తూ.. శుక్రవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు నాయుడి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. నిర్ణయం వెల్లడించాలా, శుక్రవారం వరకు వేచి ఉండాలా అనేది అనిశా కోర్టు ఇష్టమన్నారు. న్యాయాధికారి స్పందిస్తూ.. శుక్రవారం హైకోర్టు నిర్ణయం ఉంటుందేమో వేచి చూద్దామని, లేకపోతే ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తానన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించి శుక్రవారం విచారణకొచ్చే కేసుల జాబితాలో చంద్రబాబు పిటిషన్ లేనందున అనిశా కోర్టు నేడే తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. -
అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా?
కృష్ణా జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఓ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రమారమి మూడు వేల మందికి జీవనోపాధిగా ఉన్న ఉప్పు పరిశ్రమకు చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిలో పోర్టు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అన్ని అంశాలూ పరిశీలించాం.. కుట్ర కోణం లేదు..
కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని ఎన్ఐఏ పేర్కొంది. ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ మాత్రమే విచారణ జరపాలని స్పష్టం చేసింది. -
చదువూ లేదు.. కొలువూ రాదు!
పేదల పక్షపాతిని అని పదేపదే చెప్పుకొనే సీఎం జగన్... బీద బిడ్డలు ఎక్కువగా చదివే పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను గాలికొదిలేశారు. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. -
అడిగేదెవరని.. అడ్డే లేదని!
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఉపకులపతి(వీసీ)గా ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పలు నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలుమ్ని అసోసియేషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. -
ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్
ప్రతి గ్రామానికి, రైతుకు నాణ్యమైన విద్యుత్ను అందించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
అనగనగా అవుకు.. పూర్తికాకుండానే టముకు
అనగనగా అదొక అవుకు టన్నెల్. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండలను తొలచి నిర్మిస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలాశయానికి తరలించేలా నిర్మించారు. -
సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి?
‘అధికారాంతమునందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్..’ అని కవివాక్కు. ఇది ప్రభుత్వ పెద్దలకే కాదు... వారి అండ చూసుకొని విర్రవీగిన అధికారులకూ వర్తిస్తుంది. -
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!