చంద్రబాబు భద్రతపై కలవరం
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీ డెంగీతో మృతి
అక్కడే ఉన్న తెదేపా అధినేత ఆరోగ్యంపై శ్రేణుల్లో ఆందోళన
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన దోమలతో ఇబ్బంది పడుతున్నారని ములాఖత్ అనంతరం కుటుంబ సభ్యులు, తెదేపా కీలక నేతలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా అదే జైలులో రిమాండ్లో ఉన్న 19 ఏళ్ల యువకుడు డెంగీ, టైఫాయిడ్ ఇతర ఆరోగ్య సమస్యలతో మృతిచెందడంతో జైల్లోని పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ(19)ను ఓ కేసులో ఈ నెల 6న రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఆరోగ్య సమస్యల కారణంగా జైలు అధికారులు ఈనెల 7న అతడిని స్థానిక సర్వజన ఆసుపత్రికి తరలించారు. 15న అతనికి డెంగీ అని తేలింది.. పరిస్థితి విషమించడంతో 18న అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ 20న తెల్లవారుజామున సత్యనారాయణ మృతిచెందాడు. ఈ ఘటనతో తెదేపా శిబిరం కలవరపడుతోంది. చంద్రబాబు కంటే నాలుగు రోజుల ముందే రిమాండ్ ఖైదీగా వచ్చిన యువకుడు డెంగీ సోకి మృతిచెందడంతో అక్కడున్న చంద్రబాబుతోపాటు మిగిలిన ఖైదీల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ‘జడ్ ప్లస్ భద్రత ఉండాల్సిన చంద్రబాబు చుట్టూ సాధారణ భద్రత ఉంది.. కేటగిరీ-1 సౌకర్యాలు కల్పించాల్సిన చోట ఆ ఊసేలేదు.. పారిశుద్ధ్యం అంతంత మాత్రమే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు..’ అంటూ తమ అధినేత చంద్రబాబు చుట్టూ నెలకొన్న పరిస్థితులపై తెదేపా నేతలు ఆందోళన చెందుతున్నారు. తొలి మూడు రోజులూ దోమల బెడదతో చంద్రబాబు చాలా ఇబ్బందిపడ్డారు. ములాఖత్లో కలిసిన వారికి ఈ విషయం చెప్పడంతో వారు జైలు అధికారులతో మాట్లాడిన తర్వాత దోమ తెర ఇచ్చినట్లు సమాచారం. అయితే దోమల బెడద ఎక్కువగా ఉండడంతో పగటిపూట పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోంది.
జైలులో జ్వరాల కేసులే అధికం
ఈ కేంద్ర కారాగారం సుమారు 170 ఎకరాల్లో విస్తరించి ఉంటే.. అందులో 37 ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. మిగిలినదంతా పచ్చదనం, ఖాళీ ప్రాంతాలే. పారిశుద్ధ్య పరిస్థితులు, వాతావరణ ప్రతికూలతలతో దోమల బెడద వేధిస్తోంది. ప్రస్తుతం లోపల 2,064 మంది ఖైదీలున్నారు. ప్రముఖ వ్యక్తి జ్యుడిషియల్ రిమాండ్కు రావడంతో కారాగారంలో సౌకర్యాలు, పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
- జైలు లోపల ఉన్న ఆసుపత్రిని రోజూ వివిధ అనారోగ్య సమస్యలతో సుమారు 100 నుంచి 150 మంది వరకు ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ఈ కేసుల్లో ఎక్కువ శాతం జ్వర పీడితులే ఉంటున్నారని తెలుస్తోంది.
- రాజమహేంద్రవరం జైలు నుంచి జిల్లా ఆసుపత్రికి నిత్యం సగటున అయిదుగురు వివిధ అనారోగ్య సమస్యలతో వైద్యానికి వెళుతున్నారు. ఆగస్టులో ముగ్గురు ఇన్పేషెంట్లుగా చేరగా.. ఈ నెలలో ఇప్పటివరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఎక్కువ మంది తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నవారే కావడం గమనార్హం.
డెంగీ కలకలం.. ఫాగింగ్ హడావుడి
కేంద్ర కారాగారంలో డెంగీ కలకలం రేగడం.. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తమవడంతో జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. మలేరియా విభాగం సహకారంతో హుటాహుటిన ఫాగింగ్ చేయించారు. లార్వా సర్వేతోపాటు ఖైదీల ఆరోగ్యంపైనా వాకబు చేస్తున్నారు.
దోమల నివారణ చర్యలు చేపట్టాం: డీఐజీ
రిమాండ్ ఖైదీ గంజేటి వీరవెంకట సత్యనారాయణ (19) కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ తెలిపారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మొత్తం 2,064 మంది ఖైదీలు, సుమారు 200 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ‘వారందరి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దోమల బెడద ఉంటే అందరికీ ఇబ్బందే. అందుకే నివారణ చర్యలు తీసుకుంటున్నాం. జ్వరం కేసులు ఉంటే వారిని వేరుగా ఉంచి పర్యవేక్షిస్తున్నాం. తాజాగా మలేరియా విభాగం జైలులో లార్వా సర్వే చేసింది. ఎక్కడా ఆ జాడలు లేవు. జైలులో ప్రతి వారం ఫాగింగ్ చేయిస్తున్నాం. ప్రస్తుతానికి జైలులో డెంగీ కేసులు లేవు’ అని వివరించారు.
కేటగిరీ-1 సౌకర్యాలేవీ..?
‘చంద్రబాబు భద్రతపై భయం ఉంది. ఆయనకు కేటగిరీ-1 సౌకర్యం ఇవ్వాలి. అవేవీ అక్కడ కనిపించలేదు. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోంది.’
ఈనెల 12న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన
దోమలు విపరీతంగా ఉన్నాయి..
‘జైలులో భద్రతపై ఆందోళన ఉంది. దోమలు విపరీతంగా ఉండడంతో చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. జైళ్లశాఖ డీఐజీని అడిగితే దోమతెర, మంచం ఇచ్చామని చెబుతున్నారు. అక్కడ సౌకర్యాల లేమి స్పష్టంగా తెలుస్తోంది.’
ఈనెల 18న చంద్రబాబుతో ములాఖత్ తర్వాత తెదేపానేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్య
చంద్రబాబును అంతం చేసేందుకు జగన్ కుట్ర
‘చంద్రబాబును... సైకో జగన్ అక్రమంగా అరెస్టు చేయించింది జైల్లో అంతం చేయడానికేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేశారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదు. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించారు. చంద్రబాబునూ ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్దే బాధ్యత.’
ట్విటర్లో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. -
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
ఒకవైపు విశాఖలోని రిషికొండపై రూ.వందల కోట్లు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలోని ప్రస్తుత కార్యాలయాన్నీ సుందరీకరిస్తున్నారు. -
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి. -
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు. -
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. -
ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రోత్సాహకాల్ని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువును మార్చింది. -
ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించేలా సిడ్బీతో ఒప్పందం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు రుణ సహకారాన్ని అందించేలా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ), ఏపీఐఐసీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి: కేవీపీఎస్
రాజకీయ క్రీడల్లో దళితులను బలి చేయొద్దని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రిలు విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా డెల్టా కాలువలకు ఆగిన నీటి సరఫరా
కృష్ణా డెల్టా కాలువలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయకట్టులో కొన్నిచోట్ల ఇంకా వరి పంట చేతికి రాలేదు. ఈ పరిస్థితుల్లో తాము నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పూల వ్యర్థాలతో పరిమళాలు
విజయవాడ నగరంలో దేవాలయాలు, పూల మార్కెట్ల నుంచి నిత్యం టన్నుకు పైగా పూల వ్యర్థాలు పోగవుతున్నాయి. -
ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు స్టే
గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. -
‘గడప గడప’లో ప్రశ్నించారని పోలీసులకు ఫిర్యాదు
‘గడపగడపకు మన ప్రభుత్వం’లో గోడు వెల్లబోసుకోవడమే ఆ తల్లీకుమారుల తప్పైంది. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారంటూ బుధవారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి
కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్తంభించిన టెలి వైద్యం.. రోగులకు అవస్థలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ) ఆందోళనల వల్ల ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా రోగులకు అందాల్సిన టెలి వైద్యసేవలు స్తంభించాయి. -
రాష్ట్రంపై నాలుగు రోజులు తుపాను ప్రభావం
ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం తీవ్రంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
విద్యామృత్ మహోత్సవ్ ఫలితాల్లో రాష్ట్రానికి రెండు పతకాలు
‘విద్యామృత్ మహోత్సవ్ 2022-2023’లో భాగంగా ‘ఇన్నోవేటివ్ పెడగాజీ’ ప్రాజెక్టు పోటీల్లో రాష్ట్రానికి రెండు స్థానాలు దక్కాయని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?
-
Exit polls: భాజపా ఖాతాలోకి రాజస్థాన్.. మధ్యప్రదేశ్లో హోరాహోరీ!
-
Nagarjuna sagar: సాగర్ డ్యామ్ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత
-
Ola: ఇక ఓలా యాప్లోనూ యూపీఐ చెల్లింపులు
-
MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్తో బోట్ గేమింగ్ ఇయర్బడ్స్