సభ నిర్వహణకు తెదేపా ఆటంకాలు
రాష్ట్రంలో 25 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాల్లో సీపీఎం పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు.అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేల వైఖరిని మంత్రులు ప్రశ్నించారు. శుక్రవారం మీడియా పాయింట్లో వారు మాట్లాడారు.
మంత్రుల మండిపాటు
ఈనాడు, అమరావతి: అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేల వైఖరిని మంత్రులు ప్రశ్నించారు. శుక్రవారం మీడియా పాయింట్లో వారు మాట్లాడారు.
రీల్ హీరో బాలకృష్ణ.. రియల్ హీరో జగన్
-మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
‘అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ రీల్ హీరో. ఆయన భయపెడితే భయపడిపోవడానికి ఇక్కడెవరూ లేరు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు చేదోడుగా ఉన్న సీఎం జగన్ రియల్ హీరో. బాలకృష్ణకు దమ్ము ధైర్యముంటే స్కిల్ కుంభకోణంపై జరిగే చర్చలో ఎందుకు పాల్గొనలేదు? ఇదేం హీరోయిజం? అంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనా? బాలకృష్ణను కళాకారుడని ఎవరైనా అంటే తలదించుకోవాలి.’
రచ్చ కోసమే ప్రతిపక్ష సభ్యులు సభకు వచ్చారు: మంత్రి రోజా
‘చర్చ కోసం కాకుండా రచ్చ కోసమే తెదేపా సభ్యులు అసెంబ్లీకి వచ్చారు. నైపుణ్యాభివృద్ధి స్కాంపై చర్చకు నోటీసు ఇచ్చి పాల్గొనకుండా సభ నుంచి పారిపోయారు. అన్ని అంశాలూ పరిశీలించి అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చాకే చంద్రబాబును జైలుకు పంపారు. ఇన్నర్రింగ్ రోడ్డు, ఫైబర్నెట్, రాజధానిలో నిర్మాణాలపైనా చర్చకు సిద్ధమే. బాలకృష్ణ అసెంబ్లీలో కాకుండా, హైకోర్టు న్యాయమూర్తి ముందు విజిల్ వేస్తే బాగుంటుంది. అప్పుడు ఆయన లెక్కలేమిటో తేలిపోతాయి. అసెంబ్లీలో చంద్రబాబు సీటు ఎక్కి బాలకృష్ణ విజిల్ వేసి వెకిలి వేషాలు వేశారు.’
తెదేపా సభ్యుల తీరు గర్హనీయం: మంత్రి వేణుగోపాలకృష్ణ
‘అసెంబ్లీలో తెదేపా సభ్యుల తీరు అత్యంత గర్హనీయం. చంద్రబాబు సీటుపైకి ఎక్కి బాలకృష్ణ విజిల్ వేయడం సరికాదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందునే చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కుంభకోణాన్ని సీఐడీ చాలా కష్టపడి వెలికితీసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న లోకేశ్కు కూడా ఇదే పరిస్థితి వస్తుంది.’
ఆ ధైర్యం తెదేపా నేతలకు ఉందా?: వైకాపా ఎమ్మెల్సీలు
ఈనాడు, అమరావతి: ‘స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని చెప్పే ధైర్యం తెదేపా నేతలకు ఉందా? చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. అసెంబ్లీ, మండలిలో తెదేపా సభ్యులు సభాసమయాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా కొత్తగా వచ్చిన సభ్యులు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు’ అని వైకాపా ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, పీవీవీ సత్యనారాయణరాజు, బల్లి కల్యాణ్, పోతుల సునీత మీడియా పాయింట్లో మాట్లాడుతూ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. -
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
ఒకవైపు విశాఖలోని రిషికొండపై రూ.వందల కోట్లు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలోని ప్రస్తుత కార్యాలయాన్నీ సుందరీకరిస్తున్నారు. -
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి. -
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు. -
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. -
ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రోత్సాహకాల్ని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువును మార్చింది. -
ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించేలా సిడ్బీతో ఒప్పందం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు రుణ సహకారాన్ని అందించేలా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ), ఏపీఐఐసీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి: కేవీపీఎస్
రాజకీయ క్రీడల్లో దళితులను బలి చేయొద్దని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రిలు విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా డెల్టా కాలువలకు ఆగిన నీటి సరఫరా
కృష్ణా డెల్టా కాలువలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయకట్టులో కొన్నిచోట్ల ఇంకా వరి పంట చేతికి రాలేదు. ఈ పరిస్థితుల్లో తాము నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పూల వ్యర్థాలతో పరిమళాలు
విజయవాడ నగరంలో దేవాలయాలు, పూల మార్కెట్ల నుంచి నిత్యం టన్నుకు పైగా పూల వ్యర్థాలు పోగవుతున్నాయి. -
ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు స్టే
గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. -
‘గడప గడప’లో ప్రశ్నించారని పోలీసులకు ఫిర్యాదు
‘గడపగడపకు మన ప్రభుత్వం’లో గోడు వెల్లబోసుకోవడమే ఆ తల్లీకుమారుల తప్పైంది. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారంటూ బుధవారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి
కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్తంభించిన టెలి వైద్యం.. రోగులకు అవస్థలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ) ఆందోళనల వల్ల ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా రోగులకు అందాల్సిన టెలి వైద్యసేవలు స్తంభించాయి. -
రాష్ట్రంపై నాలుగు రోజులు తుపాను ప్రభావం
ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం తీవ్రంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
విద్యామృత్ మహోత్సవ్ ఫలితాల్లో రాష్ట్రానికి రెండు పతకాలు
‘విద్యామృత్ మహోత్సవ్ 2022-2023’లో భాగంగా ‘ఇన్నోవేటివ్ పెడగాజీ’ ప్రాజెక్టు పోటీల్లో రాష్ట్రానికి రెండు స్థానాలు దక్కాయని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: కాసేపట్లో రేవంత్రెడ్డి మీడియా సమావేశం
-
Henry Kissinger: మోదీ ప్రసంగం వినేందుకు వీల్ఛైర్లో కిసింజర్ వచ్చిన వేళ..!
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు