మధ్య తరగతికి సొంతిల్లంటూ సీఎం బురిడీ!
మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీలు గుప్పించిన సీఎం జగన్ చివరకు చేతులెత్తేశారు.
జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతో ప్రజలను వంచించిన జగన్
అనేక ప్రాంతాల్లో పూర్తికాని భూసేకరణ
లేఅవుట్లు ప్రారంభించిన చోట పనులు నత్తనడక
మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేయబోతోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక లేఅవుట్ను అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరల్లో ప్లాట్లు కేటాయిస్తాం. లేఅవుట్లలో 50% స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వినియోగిస్తాం. విశాలమైన రహదారులు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థ ..ఇలా అనేక సదుపాయాలు కల్పించబోతున్నాం
జగనన్న స్మార్ట్ టౌన్షిప్ వెబ్సైట్ ప్రారంభించిన సందర్భంగా 2022 జనవరి 11న సీఎం జగన్ ప్రకటన ఇది..
మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీలు గుప్పించిన సీఎం జగన్ చివరకు చేతులెత్తేశారు. మాట తప్పను..మడమ తిప్పను అంటూ నమ్మబలికి మధ్య తరగతి ప్రజల ఆశలను ఆవిరి చేశారు. ఎంఐజీ లేఅవుట్లపై ముఖ్యమంత్రే స్వయంగా ప్రచారం చేయడంతో ప్రజలు నమ్మి పెద్దఎత్తున దరఖాస్తులు చేశారు. అరకొరగా ప్రారంభించిన లేఅవుట్లలోనూ రెండేళ్లయినా పనులు పూర్తి కాలేదు. అత్యధిక చోట్ల అసలు పనులే మొదలు కాలేదు. ఇంటి స్థలం విలువలో 10% నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రజలకు ప్లాట్లు ఇవిగో, అవిగో అంటూ చుక్కలు చూపిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మొదట ప్రకటించిన ముఖ్యమంత్రి. ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా జగన్..?వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో స్వగృహ ప్రాజెక్టు పేరుతో మధ్య తరగతి కుటుంబాలకు అరచేతిలో స్వర్గం చూపించినట్లు...ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ హయాంలోనూ తిప్పలు తప్పవా..? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాట్లు లేవు.. మిగిలినవి పాట్లే
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇళ్ల స్థలాల కోసం దాదాపు 2,600 మంది ముందుకొచ్చారు. నగరానికి సమీపంలో ప్రైవేట్ భూముల ధరలు భారీగా ఉండటంతో లేఅవుట్ వేసేందుకు అధికారులు ముందడుగు వేయడం లేదు. గుడివాడలో ఇళ్ల స్థలాల కోసం 3,800 మంది దరఖాస్తులు అందించారు. దొండపాడు-వలివర్తిపాడు మధ్య భూములను అధికారులు పరిశీలించారు. ధర విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.
- కర్నూలు జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం15,600 దరఖాస్తులొచ్చాయి. 500 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. ఏడాదైనా భూసేకరణ ప్రారంభం కాలేదు.
- ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజల నుంచి స్పందనే లేదు. కందుకూరులో దరఖాస్తు చేసుకున్న 292 మందిలోనూ 59 మంది మాత్రమే ప్లాట్ విలువలో 10 శాతం మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
- ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం, బొబ్బిలిలో స్థలాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులొచ్చినా...లేఅవుట్ల ఏర్పాటుకు ముందడుగు పడలేదు.
- నెల్లూరు జిల్లా కావలిలో 1,112 ఇళ్ల స్థలాలకు వీలుగా లేఅవుట్ అభివృద్ధి పనులు చేపడుతున్నా వీటిలో నాణ్యత లోపిస్తోందన్న ఫిర్యాదులొస్తున్నాయి.
రాజధాని ప్రాంతంలో నిలిచిన పనులు
రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోని మంగళగిరి సమీపంలో ఉన్న నవులూరులో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దాదాపు 81 ఎకరాల్లో 528 ప్లాట్లు మధ్య తరగతి ప్రజలకు కేటాయించాలన్నది ప్రతిపాదన. అధికారులు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు రాలేదు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రతిపాదిత భూముల్లో ఎప్పటికప్పుడు లేఅవుట్ పనులు చేయడం, మళ్లీ నిలిపివేయడం సర్వసాధారణమవుతోంది.
విశాఖలో విచిత్రమైన పరిస్థితి
విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పరిధిలో ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులపై ఆరు చోట్ల లేఅవుట్ల పనులు ప్రారంభించారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వీటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. 1,505 ప్లాట్లు వీటిలో సిద్ధం చేయాలన్నది ప్రణాళిక. మొదట ఎంతో ఆసక్తి చూపిన ప్రజలు తరువాత ప్లాట్ విలువలో 10% నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మొత్తం 1,008 దరఖాస్తుదారుల్లో 367 మంది మాత్రమే ఇప్పటి వరకు నగదు చెల్లించారు.
అంతా గోప్యమే..
మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ (ఎంఐజీ లేఅవుట్లు)కి సంబంధించిన వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. 150, 200, 240 చదరపు అడుగుల్లో ప్లాట్లు అందుబాటు ధరల్లో ఇస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని? ప్లాట్ విలువలో 10% మొత్తం చెల్లించిన వారెందరు? ఇలా వచ్చిన మొత్తం ఎంత? లేఅవుట్ల ఏర్పాటుకు ఎన్ని చోట్ల భూ సేకరణ పూర్తయింది? ప్రారంభించిన లేఅవుట్ల వివరాలను అధికారులు బయటపెట్టడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్లతో వైకాపా ముందస్తు సర్వే
‘ఏపీకి జగన్ ఎందుకు కావాలి’ కార్యక్రమం ముసుగులో ఓటర్లు ఏ పార్టీ వైపు ఉన్నారో తెలుసుకునేందుకు వైకాపా యత్నిస్తోంది. -
కదిరి నియోజకవర్గంలో.. ప్రతిపక్షం ఓట్ల తొలగింపునకు పన్నాగం
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి కార్యాలయం ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులకు సంబంధించి తప్పుడు దరఖాస్తుల నమోదుకు అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రికి అంగన్వాడీల సమ్మె నోటీసు
రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 8 నుంచి సమ్మె చేపడుతున్నట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషా శ్రీచరణ్కు శుక్రవారం సీఐటీయూ నాయకులు ఓబులు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి నోటీసులు అందజేశారు. -
తితిదేకు రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం
ముంబయికి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తితిదేకు రూ.5 కోట్ల విలువైన గాలిమరను విరాళంగా అందించింది. తిరుమల జీఎన్సీ ప్రాంతంలో ఈ గాలిమర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. -
సార్ వస్తున్నారు.. ఎక్కడి చేపలు అక్కడే గప్చుప్!
ముఖ్యమంత్రి జగన్ గాలిలో వెళ్తుంటేనే నేల మీద ఆంక్షలు విధించే అధికారులు ఇప్పుడు ఆయనే వస్తున్నాంటే ఊరుకుంటారా! విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని దాదాపుగా ఖాళీ చేయిస్తున్నారు. -
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి మండవ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. -
జీఎస్టీ వసూళ్లలో ఏపీలో 31% వృద్ధి
నవంబరు నెలలో జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో 31%, తెలంగాణలో 18% వృద్ధిని నమోదు చేశాయి. -
ముందుచూపు లేక ముంచేశారు!
పాలనంటే... రోజూ మూడు సమావేశాలు అధికారులతో ఆరు సమీక్షలే కాదు... ముందు చూపుతో ఆలోచించటం రాబోయే విపత్తులు, అవకాశాలకు సన్నద్ధమవటం కూడా! అదిలోపిస్తే ఏమౌతుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరవు పరిస్థితులు! -
ఎవడ్రా నువ్వు.. తమాషాలు చేస్తున్నావా
గెజిటెడ్ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు బహిరంగ వేదికపై దుర్భాషలాడారు. -
నడి సముద్రంలో బోటు దగ్ధం
కాకినాడ తీరానికి 130 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రం మధ్యలో ఓ బోటు అగ్నికి ఆహుతైంది. ఓడలరేవు మెరైన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఐ.పోలవరం మండలం భైరవపాలెం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. -
సుబ్రహ్మణ్యం హత్య కేసు సీబీఐకి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. -
సాంఘిక సంక్షేమశాఖలో చిరుద్యోగుల ఉపాధికి జగన్ ఎసరు
నాలుగున్నరేళ్ల పాలనలో వరుసపెట్టి వివిధ శాఖల్లో వేల మంది చిరుద్యోగుల్ని తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు సాంఘిక సంక్షేమశాఖ పై పడింది. -
అక్కచెల్లెమ్మలంటూ వచ్చారు.. ఆసరా కేంద్రాన్ని అటకెక్కించారు!
‘నా అక్క చెల్లెమ్మలు’ అంటూ ప్రతి సభలో ఆప్యాయత ఒలకబోసే సీఎం జగన్ ఆచరణలోకి వచ్చేసరికి వారికి ఆర్థిక చేయూత ఇచ్చే కేంద్రాలను అటకెక్కించారు. -
అమరావతి బాండ్కు అథోగతి
వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల రాష్ట్రం పరువు మరోసారి గంగలో కలిసింది. అమరావతి బాండ్ల రేటింగ్ను ఇటీవల క్రిసిల్, తాజాగా అక్యూట్ సంస్థలు తగ్గించడాన్నిబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ ప్రభుత్వం ఎంత అధ్వానస్థితిలోకి నెట్టేసిందో అర్థమవుతోంది. -
మీ భాష, ఆలోచన అసహ్యంగా ఉన్నాయి
‘మీ భాష, ఆలోచన విధానం చాలా అసహ్యంగా ఉన్నాయి. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ వినడానికి ఎవరూ లేరు. నేను చెప్పేదే వినండి’ అంటూ క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి రోజా మీడియాపై విరుచుకుపడ్డారు. -
నడిరోడ్డుపై నగుబాటు పనులు!
రహదారి విస్తరణ చేపడితే ఆ మార్గంలో మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్తు లైన్లు ముందుగానే పక్కకు తరలించాలి. -
పోలింగ్ కేంద్రాల్లో నేడూ, రేపూ ప్రత్యేక శిబిరాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శని, ఆదివారాల్లో (డిసెంబర్ 2, 3 తేదీలు) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. -
రెవెన్యూ డివిజన్కో డిప్యూటీ విద్యాధికారి
ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక డిప్యూటీ విద్యాధికారి పోస్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అన్యాక్రాంతం చేసిన వారికే హక్కు కల్పిస్తే ఎలా?
ఎసైన్డ్ భూములు అనుభవిస్తున్న వారు మార్కెట్ ధరకు రెండున్నర రెట్లు ప్రభుత్వానికి చెల్లిస్తే వారికే హక్కులు కల్పించడమేంటి? అని ఏపీ వ్యవసాయ, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. -
సాంకేతిక సమస్యలతో నిలిచిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు
ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైమ్ 2.0 (ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇంటిగ్రేషన్ మ్యుటేషన్ మేడ్ ఈజీ) క్రయ, విక్రయదారులకు ఇంకా చుక్కలు చూపిస్తూనే ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!