ఓపీఎస్ ముగిసిన అధ్యాయం
‘సీమెన్స్ శిక్షణ కేంద్రాలు లేవు.. ఎక్కడున్నాయో చూద్దాం పదండి.. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్(సీఐటీడీ) ఇంత మంది అభ్యర్థులకు ఇంత ఖర్చు అవుతుందనే నివేదికలు ఇచ్చారే తప్ప.. ఇంత సాఫ్ట్వేర్ ఇచ్చారు, ఇంత పరికరాలు ఇచ్చారు అని నివేదిక ఇవ్వలేదు’’ అంటూ సీమెన్స్ ప్రాజెక్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు.
సీమెన్స్ కేంద్రాలు లేవు.. ఉంటే చూద్దాం పదండి
చంద్రబాబు అరెస్టు తీరు బాగోలేదంటే.. ఆయన్ని కొట్టారా? తిట్టారా?
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు
ఈనాడు, అమరావతి: ‘‘సీమెన్స్ శిక్షణ కేంద్రాలు లేవు.. ఎక్కడున్నాయో చూద్దాం పదండి.. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్(సీఐటీడీ) ఇంత మంది అభ్యర్థులకు ఇంత ఖర్చు అవుతుందనే నివేదికలు ఇచ్చారే తప్ప.. ఇంత సాఫ్ట్వేర్ ఇచ్చారు, ఇంత పరికరాలు ఇచ్చారు అని నివేదిక ఇవ్వలేదు’’ అంటూ సీమెన్స్ ప్రాజెక్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒక్కో సీమెన్స్ క్లస్టర్లో సాఫ్ట్వేర్ రూ.247 కోట్లు, హార్డ్వేర్ రూ.48 కోట్లు, డిజిటల్ కోర్సులు రూ.249 కోట్లు, సేవలు రూ.13 కోట్లుగా సీఐటీడీ మదింపు చేసి, నివేదిక ఇచ్చినా.. శిక్షణకు పిల్లలు వస్తే అంత ఖర్చవుతుందని మాత్రమే ఆ సంస్థ మదింపు చేసిందంటూ తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇలాంటి అంచనాలు వేసి, నివేదికలు ఇస్తాయా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.58 కోట్లకే సీమెన్స్ సాఫ్ట్వేర్ ఇచ్చిందని, తాను అధికారికంగా చెబుతున్నానంటూ ఎంతో ఖరీదైన సీమెన్స్ సాఫ్ట్వేర్కు ఆయనే విలువ నిర్ణయించేశారు. నాలుగేళ్లలో 2లక్షల మంది అభ్యర్థులకు హోటల్లో పని చేసుకోవడానికి, సప్లయర్గా చేయడానికి శిక్షణ ఇచ్చారంటూ హేళన చేశారు. రంపం పెట్టి కోయించి, కార్పెంటర్లను ఎంతమందిని తయారు చేశారో వివరాలు ఇస్తానంటూ సీమెన్స్ యంత్రాల ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారు. 73 ఏళ్ల చంద్రబాబు ఈ రోజు జైల్లో ఉండడం ఏంటి? ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు చేయి పట్టుకొని లాక్కెళ్లారా?
చంద్రబాబు అరెస్టు తీరు బాగోలేదంటే ఆయన్ని కొట్టారా? తిట్టారా? లేక చేయి పట్టుకుని లాక్కెళ్లారా? అంటూ మంత్రి బొత్స ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పగలైతే శాంతిభద్రతల సమస్య వస్తుందని రాత్రి అరెస్టు చేస్తామని పోలీసులు అంటే ఆయనే తెల్లారే వరకు సాగదీశారంటూ విమర్శించారు. సీమెన్స్ ప్రాజెక్టు అవకతవకల్లో భాగస్వాములైన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీవీ రమేష్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారని, అందులోని పేరాలను చదివి ఆయన్నే చెప్పమనండి? అని ప్రశ్నించారు.
పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నా..
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, తప్పు చేసినా చూసీ చూడనట్లు వదిలేయాలనడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇలాంటి తప్పులు చేస్తే వదిలేయొచ్చో లేదో వాళ్ల సీఎం కేసీఆర్ను పోచారం అడగాలని, 10వేల ఓట్ల రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థను తాకట్టు పెట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు.
ఓపీఎస్ ముగిసిన అధ్యాయం
ఈనాడు, అమరావతి: ఓపీఎస్ విధానం ముగిసిన అధ్యాయం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘జీపీఎస్పై ఉద్యోగులు ఆందోళనలు చేయరని మేము చెప్పామా? అందరికీ ఆమోద యోగ్యమని చెప్పామా? ఓపీఎస్ను తీసుకొచ్చేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. అందుకే జీపీఎస్ తెచ్చాం. పింఛన్కు గ్యారెంటీ, కుటుంబ పింఛన్కు గ్యారెంటీ అడిగారు ఇచ్చాం. మా ప్రభుత్వ విధానం జీపీఎస్. ఓపీఎస్ అమలుకు ఎందుకు అంగీకరించడం లేదో భాజపా వాళ్లను అడగాలి. ప్రభుత్వం ఇంతకు మించి ఏమీ చేయలేదు. దీనిపై చర్చ వద్దు. మార్పులు, చేర్పులు అడిగితే పరిశీలిస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు.
ట్రాఫిక్ కొత్త ఎస్సైలా పురందేశ్వరి: విజయనగరంలో 1975 ప్రాంతంలో కొత్తగా వచ్చిన ట్రాఫిక్ ఎస్సైలా భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. తన ఉనికిని కాపాడుకోవడానికి మద్యం అమ్మకాలపై విమర్శలు చేస్తున్నారని, ఆమె సీబీఐ విచారణ కోరితే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. -
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
ఒకవైపు విశాఖలోని రిషికొండపై రూ.వందల కోట్లు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలోని ప్రస్తుత కార్యాలయాన్నీ సుందరీకరిస్తున్నారు. -
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి. -
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు. -
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. -
ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రోత్సాహకాల్ని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువును మార్చింది. -
ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించేలా సిడ్బీతో ఒప్పందం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు రుణ సహకారాన్ని అందించేలా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ), ఏపీఐఐసీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి: కేవీపీఎస్
రాజకీయ క్రీడల్లో దళితులను బలి చేయొద్దని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రిలు విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా డెల్టా కాలువలకు ఆగిన నీటి సరఫరా
కృష్ణా డెల్టా కాలువలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయకట్టులో కొన్నిచోట్ల ఇంకా వరి పంట చేతికి రాలేదు. ఈ పరిస్థితుల్లో తాము నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పూల వ్యర్థాలతో పరిమళాలు
విజయవాడ నగరంలో దేవాలయాలు, పూల మార్కెట్ల నుంచి నిత్యం టన్నుకు పైగా పూల వ్యర్థాలు పోగవుతున్నాయి. -
ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు స్టే
గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. -
‘గడప గడప’లో ప్రశ్నించారని పోలీసులకు ఫిర్యాదు
‘గడపగడపకు మన ప్రభుత్వం’లో గోడు వెల్లబోసుకోవడమే ఆ తల్లీకుమారుల తప్పైంది. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారంటూ బుధవారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి
కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్తంభించిన టెలి వైద్యం.. రోగులకు అవస్థలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ) ఆందోళనల వల్ల ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా రోగులకు అందాల్సిన టెలి వైద్యసేవలు స్తంభించాయి. -
రాష్ట్రంపై నాలుగు రోజులు తుపాను ప్రభావం
ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం తీవ్రంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
విద్యామృత్ మహోత్సవ్ ఫలితాల్లో రాష్ట్రానికి రెండు పతకాలు
‘విద్యామృత్ మహోత్సవ్ 2022-2023’లో భాగంగా ‘ఇన్నోవేటివ్ పెడగాజీ’ ప్రాజెక్టు పోటీల్లో రాష్ట్రానికి రెండు స్థానాలు దక్కాయని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
-
Nimmagdda Ramesh: ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు.. ఏపీ ప్రజలకు నిమ్మగడ్డ కీలక సూచన