దసపల్లా భూములపై వైవీ X విజయసాయి పోరు
నిషేధిత జాబితా(22ఏ) నుంచి బయటపడిన దసపల్లా భూములపై వైకాపాలో ఆధిపత్య పోరు మొదలైంది. విశాఖ నగరం మధ్యనున్న విలువైన ఈ భూముల వ్యవహారంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది.
తాడేపల్లి ప్యాలెస్కు చేరిన అంతర్యుద్ధం?
ఈనాడు, విశాఖపట్నం: నిషేధిత జాబితా(22ఏ) నుంచి బయటపడిన దసపల్లా భూములపై వైకాపాలో ఆధిపత్య పోరు మొదలైంది. విశాఖ నగరం మధ్యనున్న విలువైన ఈ భూముల వ్యవహారంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఆ భూములు రాణి కమలాదేవికి చెందినవని, ఆమె వారసుల నుంచి కొనుగోలు చేశామంటూ ఇప్పటికే దక్కించుకున్న ఓ వర్గానికి విజయసాయి సహకరిస్తుంటే... తాజాగా ఆ భూముల్లో రాణి సాహిబా ఆఫ్ వాద్వాన్ వారసుల పేరుతో బోర్డులు వెలిశాయి. వీరికి వైవీ మద్దతుగా నిలిచారు. దీంతో ఈ పంచాయితీ కాస్త ఇటీవల తాడేపల్లి ప్యాలెస్కు చేరింది. ఎన్నో వివాదాల మధ్య దసపల్లా భూముల్లో 15 ఎకరాలను ఇటీవల ఓ వర్గం దక్కించుకుంది. వాటి విలువ దాదాపు రూ.2వేల కోట్లుంటుంది. ఇందులో కొంత భూమిపై రాణి కమలాదేవి వారసుల తరఫు నుంచి తనకూ హక్కు ఉందంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. ఈ వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో భూమి కోసం యత్నిస్తున్నారంటూ రాణి కమలాదేవి పేరుతో ఈ ఏడాది కలెక్టర్కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు రాణి కమలాదేవి చేయలేదని, ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతిస్తున్న వర్గంలోని కీలక వ్యక్తే సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఫోర్జరీ సంతకం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని, దసపల్లా భూముల్లోని తన స్థలాన్ని అప్పగించాలని వైవీ వర్గానికి చెందిన వ్యక్తి ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అయితే.. ఇన్ఛార్జి గిరి నాకొద్దు..!
ఫోర్జరీ విషయంలో విజయసాయిరెడ్డి అనుచరుడిని అరెస్టు చేయాలని వైవీ అప్పటి సీపీ త్రివిక్రమవర్మపై ఒత్తిడి తెచ్చారు. అరెస్టు చేయకుండా ఎంపీ చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే వ్యవహారమంతా తాడేపల్లి ప్యాలెస్కు చేరింది. ఈ పంచాయతీకి ముందే పెదజాలారిపేట భూముల టీడీఆర్ విషయంలో వైవీ కలుగజేసుకోగా.. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన్ను తాడేపల్లి ప్యాలెస్ హెచ్చరించింది. ఈ సమయంలోనే దసపల్లా గొడవ అక్కడికి చేరడంతో.. ఈ సారి వైవీ ఘాటుగానే సమాధానం చెప్పారని సమాచారం. ‘ఫోర్జరీ సంతకం అని అధికారులు తేల్చారు కాబట్టే అరెస్టుకు ఆదేశించా. ఇందులోనూ తగ్గి ఉండాలంటే ఇన్ఛార్జి పదవే నాకు అవసరం లేదు’ అని చెప్పి పంచాయితీ నుంచి వైవీ లేచి వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంతోనే సీపీపై బదిలీ వేటు పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అధికారుల అత్యుత్సాహం
దసపల్లా భూములను 22(ఏ) జాబితా నుంచి తొలగించి సబ్ డివిజన్ చేసిన అధికారులు... రాణి సాహిబా వాద్వాన్ వారసులు ఎవరు అనేది ఆ సమయంలో డిక్లేర్ చేయలేదు. సర్వే పూర్తి చేశాక బతికి ఉన్న వారసుల పేర్లు రికార్డుల్లో ఎక్కించాల్సి ఉండగా, అలా చేయకుండానే క్లియరెన్స్ ఇచ్చేశారు. దీంతో 1921 నుంచి తాజాగా అప్డేట్ చేసిన రెవెన్యూ రికార్డుల్లో దసపల్లా హిల్ సర్వే నంబరు 1197, 1196, 1028లలో భూములు రాణి సాహిబా వాద్వాన్ పేరుతో కనిపిస్తున్నాయి. ఇటీవల పెదజాలారిపేట భూముల్లో సైతం రాణి సాహిబా వాద్వాన్ వారసుల పేరుతో అర్జీ పెట్టారన్న కారణంగా అధికారులు ఆగమేఘాలపై సర్వే చేశారు. అసలు రాణి వారసులెవరనేది తేలకుండా టీడీఆర్లు ఇచ్చేందుకు పావులు కదిలాయి. పెదజాలారిపేట భూములకు టీడీఆర్లు దక్కించుకుంటే, ఆ తర్వాత అదే రాణి పేరుతో ఉన్న దసపల్లా భూములకు సైతం టీడీఆర్లు దక్కించుకునే ఎత్తుగడలు సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’కు వాలంటీర్లే అంపైర్లు
ఎన్ని విమర్శలు ఎదురైనా.. లోటుపాట్లు కనిపిస్తున్నా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను మమ అనిపించడానికే ప్రభుత్వం, అధికారులు సిద్ధమయ్యారు. తగిన సాధన సంపత్తి లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి క్రీడల సందడి మొదలుకానుంది. -
Amaravati: ఏపీలో ప్లాట్ల కేటాయింపునకు ఈ-లాటరీ 15న
ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందినవారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు ఈ నెల 15న ఈ-లా టరీ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. -
అయిదు ఎకరాలు ఎందుకు? ఆరున్నరెకరాలు ఇస్తాం తీసుకో..!
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని అయిదు ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? కబ్జా నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలి. -
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు. -
సొంతిల్లు ఉన్నంత మాత్రాన నివాసితుడిగా పరిగణించొద్దు
‘ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు. -
Telangana: విద్యుత్ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు
రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..
ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు! -
Gundlakamma Reservoir: గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. -
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. -
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా..
సీఎం జగన్ తిరుపతి జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ.. ‘బాధితులకు రేషన్ బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ లీటరు, ఒక కిలో ఆనియన్, ఒక కేజీ ఉల్లిగడ్డ. -
వరద మింగిన రైతు కష్టం
మిగ్జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో పంట కోశారు. -
విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు జగన్ ప్రభుత్వం రాజకీయ చెద పట్టించింది. సరస్వతి నిలయాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చి భ్రష్ఠు పట్టించింది. అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉపకులపతు (వీసీ)లను నియమించడం.. అలా వచ్చిన వీసీలు విద్యను, విద్యార్థులను పట్టించుకోకుండా... -
తెల్లకాగితం మీద పేర్లు రాసిస్తే... ఓట్లు తొలగిస్తున్నారు
చాలా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు తెల్లకాగితాలపై పేర్లు రాసిస్తుంటే.. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
ప్రభుత్వ తీరుపై వ్యాజ్యం వేయడమే పాపమా?
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. -
కరవు కాటు.. తుపాను పోటు.. కనికరం చూపని సర్కారు
ఖరీఫ్లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్జాం తుపాను చిదిమేసింది. -
రోడ్డెక్కిన పాడి రైతులు
సీఎం జగన్ సొంత జిల్లాలోనే పాడిరైతులు గిట్టుబాటు ధర కోసం శుక్రవారం రోడ్డెక్కారు. పాలను నేలపై పారబోసి ఆగ్రహం ప్రదర్శించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమస్యపై వేడుకున్నారు. ఆపై ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయించారు. -
35 నిమిషాల్లోనే ముగించేశారు!
ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ప్రతిపక్షాలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు రెండు- మూడు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మమ అనిపిస్తున్నారు. -
తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ నారాయణ
మిగ్జాం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. -
నలుగురి ఉసురు తీసిన ముసురు
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో తట్టుకోలేక నలుగురు కౌలు రైతులు తనువు చాలించారు. కంటిపాపలా కాపాడుకున్న పంట పొలం కళ్లముందు కొట్టుకుపోవడం, వరి పనల నుంచి మొలకలు రావడం చూసి వారు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. -
ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు.. ఓట్లెలా అడుగుతాం!
కౌన్సిలర్లుగా అధికార పార్టీ నుంచి ఎన్నికైనా.. ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయామని, మరికొన్ని నెలల్లో ఎన్నికల కోడ్ వస్తుండటంతో ప్రజలను ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతామని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు తెదేపా రూ.60 లక్షల సాయం
విశాఖ చేపలరేవులో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు తెదేపా అధికారంలోకి రాగానే కొత్త బోట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు
-
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..