శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి సేవలందించాలి
వినూత్న ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక విద్యలో నైపుణ్యాలను పెంపొందించుకొని ప్రపంచ మానవాళికి సేవలందించాలని రిటైర్డ్ జడ్జి, రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఛైర్మన్ జస్టిస్ బి.శివశంకరరావు విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులతో జస్టిస్ బి.శివశంకరరావు
వేడుకగా విట్-ఏపీ యూనివర్సిటీ స్నాతకోత్సవం
తుళ్లూరు, న్యూస్టుడే: వినూత్న ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక విద్యలో నైపుణ్యాలను పెంపొందించుకొని ప్రపంచ మానవాళికి సేవలందించాలని రిటైర్డ్ జడ్జి, రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఛైర్మన్ జస్టిస్ బి.శివశంకరరావు విద్యార్థులకు సూచించారు. అమరావతిలోని విట్-ఏపీ విశ్వవిద్యాలయంలో శనివారం మూడో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ శివశంకరరావు పాల్గొన్నారు. గౌరవ అతిథిగా మైక్రోసాఫ్ట్ బెంగళూరు శాఖ డైరెక్టర్ ఆశిష్శర్మ విచ్చేశారు. విట్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్, వ్యవస్థాపకుడు జి.విశ్వనాథన్ ఆధ్వర్యంలో స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ శివశంకరరావు మాట్లాడుతూ... నిరంతర శ్రమ, అంకితభావంతో పనిచేసే విద్యార్థులు.. సవాళ్లు, సమస్యలను పరిష్కరించుకొంటూ విజయాలకు బాటలు వేసుకొని అభివృద్ధి చెందుతారన్నారు. స్నాతకోత్సవం ముగింపు కాదని, నిరంతర అభ్యాసానికి నాంది అన్నారు. విశ్వనాథన్ మాట్లాడుతూ... అకడమిక్ ఎక్సలెన్స్ను పెంపొందించటం, భవిష్యత్తు నాయకులుగా విద్యార్థులను తీర్చిదిద్దటంలో విట్ అంకితభావంతో పని చేస్తోందన్నారు. 2023 బ్యాచ్ విద్యార్థులు ప్రదర్శించిన కృషి, సంకల్పం, స్థితిస్థాపకతకు స్నాతకోత్సవం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అనంతరం 1,611 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు, 16 మందికి బంగారు పతకాలు, ఉన్నత ర్యాంకులు సాధించిన 70 మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలను ముఖ్యఅతిథులతో కలిసి అందించారు. 34 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. విట్ వైస్ప్రెసిడెంట్ శంకర్విశ్వనాథన్, వైస్ ఛాన్సలర్ ఎస్.వి.కోటారెడ్డి, రిజిస్ట్రార్ జగదీష్చంద్ర ముదిగంటి, అకడమిక్ డీన్లు మధుసూదనరావు, డిప్యూటీ డైరెక్టర్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఖాదిర్ బాషా, విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాప్తానిపాలేనికి చెందిన కౌలు రైతు యార్లగడ్డ వీరప్రసాద్.. రూ.1.35 లక్షల పెట్టుబడితో ఆరెకరాల్లో వరి నాట్లు వేశారు. -
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
కృష్ణా నదిలో ఇసుక లోడింగ్ చేస్తుండగా హఠాత్తుగా వరద రావడంతో ఎడ్ల బండి, యజమాని కొట్టుకుపోయారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
Anantapuram: మహిళాశక్తి.. బైబిల్ భక్తి!
కలెక్టరేట్లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వాడుకోవడం వివాదాస్పదమైంది. -
‘ఇవి నగరాలు కావు..’ ప్రత్యక్ష నరకాలు
నగరాలు... మానవ ప్రగతికి చిహ్నాలు. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువత ఉపాధికి ఊతమిస్తాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తాయి. -
బాబోయ్ ‘ఖర్సయిపోతాం’!
అధికార వైకాపాలో కొన్ని లోక్సభ స్థానాల టికెట్లకు పెద్దలు అడుగుతున్న ‘పార్టీ ఫండ్’ అంకె విని అభ్యర్థులు గుడ్లు తేలేస్తున్నారు. -
తుపాను ఊడ్చేసింది
మిగ్జాం అపారమైన పంటనష్టాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. -
‘ఎన్నికల ముంగిట్లో..’ గ్రూపు-2 ముచ్చట!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన నేడు
మిగ్జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. -
రాజ్భవన్లో సాయుధ దళాల జెండా దినోత్సవం
-
‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకావిష్కరణ
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువారి ప్రస్థానానికి ప్రతిబింబమే ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకమని రచయిత మల్లికేశ్వరరావు కొంచాడ తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్లతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. -
గుంతల దారుల్లో కూరుకుపోతున్నా పట్టించుకోరేం?
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. -
అవే పనులు.. 2 సార్లు శంకుస్థాపనలు
దుర్గగుడిలో అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదం పోటు, కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద రాజద్వారంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. -
హైకోర్టు ముందు జగన్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు
‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు. -
Polavaram: ‘పదండి దూసుకు..’ పదండి వెనక్కి!
పోలవరం... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. -
మీ ఓటు నమోదు చేసుకోండిలా..
ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తారుమారు కావచ్చు. అందునా రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ కీలకమే. -
రూ.5 కోట్లతో కడితే.. మరుగుదొడ్ల పక్కన పడేశారు!
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి కనకదుర్గానగర్ మీదుగా వెళ్లే మార్గంలో భక్తుల రాకపోకలకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లతో రాతి మండప దారిని నిర్మించారు. -
‘పెట్టింది తినాలి..’ పెట్టకపోతే పస్తులుండాలి!
టోఫెల్ శిక్షణ, ట్యాబ్లూ, స్మార్ట్టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు... ట్రిపుల్ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. -
ప్రకాశం బ్యారేజీ 30 గేట్ల ఎత్తివేత
భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి గురువారం ఉదయం సుమారు 30,000 క్యూసెక్కుల మేర వరద వచ్చింది. -
భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం
బాపట్ల జిల్లా భర్తిపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా సానుభూతిపరులు ధ్వంసం చేశారు. -
కేజీబీవీ కార్యదర్శికి జాతీయ అవార్డు
విద్యారంగంలో ఉత్తమ ఆవిష్కరణలు, అభ్యసన విధానం అమలుకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కార్యదర్శి మధుసూదనరావుకు జాతీయ అవార్డు లభించింది.


తాజా వార్తలు (Latest News)
-
Women Education: మహిళల విద్యపై అఫ్గాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై ఆరోపణలు.. లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక
-
Chandrababu: నేను వెళ్తున్నానని.. ఇప్పుడు జగన్ హడావుడిగా బయల్దేరారు: చంద్రబాబు
-
మోదీజీతో మా నాన్న.. కంగారేస్తోంది: స్మృతి ఇరానీ పోస్టు వైరల్
-
Daggubati Purandeswari: ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవు: పురందేశ్వరి
-
Gaza: కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్ తీరు..