Chandrababu: ఇప్పుడు ప్రశ్నలు వెతుక్కుంటున్నారు
‘‘నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో రెండేళ్ల కిందటే కేసు నమోదుచేశారు. నేను తప్పుచేసినట్టు ఇప్పటికీ మీ దగ్గర ఆధారాలు లేవు. అయినా నన్ను అరెస్టు చేశారు.
ఫైళ్లు చూసుకుంటున్నారు
నన్ను తప్పుపట్టడానికి మీ వద్ద ఏ ఆధారమూ లేదు
నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారు
విచారణలో సీఐడీ అధికారులతో చంద్రబాబు
ప్రశ్నలన్నింటికీ సూటిగా సమాధానాలు
ముగిసిన రెండు రోజుల సీఐడీ కస్టడీ
ఈనాడు - అమరావతి
రాజమహేంద్రవరం
‘‘నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో రెండేళ్ల కిందటే కేసు నమోదుచేశారు. నేను తప్పుచేసినట్టు ఇప్పటికీ మీ దగ్గర ఆధారాలు లేవు. అయినా నన్ను అరెస్టు చేశారు. 15 రోజులవుతున్నా నన్ను తప్పు పట్టడానికి మీకు చిన్న ఆస్కారం కూడా లేకుండా పోయింది. నేను ఎలాంటి తప్పూ చేయలేదనడానికి ఇదే తిరుగులేని రుజువు. 45 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నన్ను నిరాధార కేసులో అరెస్టు చేసి బాధపెట్టారు. ఇది నాకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది’’ అని తెదేపా అధినేత చంద్రబాబు సీఐడీ అధికారులతో అన్నారు. ఆయనను కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు రెండో రోజైన ఆదివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని కాన్ఫరెన్స్ హాలులో విచారించారు. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారుల ప్రతి ప్రశ్నకూ చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పడంతో... ఇంకా ఏ ప్రశ్నలు అడగాలనేదానిపై వారు మళ్లీ ఫైళ్లు చూసుకున్నారు. సీఐడీ అధికారుల తీరుపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘నన్ను ఎక్కడ తప్పుపట్టాలో మీకు తెలియని పరిస్థితి ఉందనేందుకు ఇదే నిదర్శనం’ అని వారితో అన్నారు. అనంతరం వారడిగిన ప్రశ్నలకు ధీమాగా సమాధానమిచ్చారు. మొత్తంగా చంద్రబాబు రెండురోజుల సీఐడీ కస్టడీ ఆదివారంతో ముగిసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండోరోజు విచారణలో భాగంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అడిగినవాటిలో కొన్ని ప్రశ్నలు, వాటికి ఆయన చెప్పిన సమాధానాల వివరాలిలా ఉన్నాయి.
సీఐడీ: నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్ సంస్థల మధ్య ఒప్పందం చేసుకునే క్రమంలో ప్రొసీజర్ తప్పులు గురించి అధికారులు మీకు చెప్పలేదా?
చంద్రబాబు: అధికారుల సమగ్ర పరిశీలన, ఆమోదం తర్వాతే ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం సీమెన్స్తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయంలో పూర్తిగా నిబంధనల ప్రకారమే వ్యవహరించాం. ఎక్కడా వాటి అతిక్రమణకు తావే లేదు.
నైపుణ్యాభివృద్ధి శిక్షణ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన గురించి మీకు అధికారులు చెప్పారా?
నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగలేదు. అంతా సక్రమంగా జరిగింది. అధికారులు కూడా అదే విషయాన్ని నిర్ధారించారు. సీమెన్స్ సంస్థ ఏపీలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఇదే తరహా ఒప్పందాలు చేసుకుంది. కేంద్రప్రభుత్వం కూడా సీమెన్స్తో కలిసి పనిచేసింది. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశాం.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన కమిటీ అన్నీ సరిగ్గా చూసిందా.. లేదా అనేది మీరు పరిశీలించలేదా?
కిందిస్థాయిలో కమిటీల పనితీరు, విధి నిర్వహణల విషయాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చూడరు. ఆ శాఖలోని ఉన్నతాధికారులు, కార్యదర్శులు, కార్పొరేషన్ అధికారులు ఆ బాధ్యతలు చూస్తారు.
ఉత్తర్ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి అపర్ణను మీరు తీసుకొచ్చారట కదా?
మీ వాదన సరికాదు. ఆమె సీఎస్కు డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. నిబంధనల ప్రకారం సీఎస్ ఆమోదించారు. కేంద్రం కూడా ఆమోదించింది.
ఫైళ్లు చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి.
అపర్ణ భర్త డిజైన్టెక్లో ఉద్యోగిగా ఉన్న విషయం మీకు తెలుసా?
ఆ విషయం నాకు తెలీదు. ఒకవేళ ఆమె భర్త డిజైన్టెక్లో పనిచేస్తుంటే ఆ విషయాన్ని అపర్ణే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
తెదేపాకు విరాళాలు ఎలా వస్తాయి?
అక్రమ సొమ్మును తెదేపా ఎప్పుడూ విరాళంగా స్వీకరించదు. మాకు వచ్చే పార్టీఫండ్ అంతా అత్యంత పారదర్శకంగా ఉంటుంది.
ఉదయం 8.39కే జైలు వద్దకు సీఐడీ బృందం
చంద్రబాబును విచారించేందుకు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఆదివారం ఉదయం 8.39 గంటలకే జైలు ప్రాంగణానికి చేరుకుంది. తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాది లోపలికి వెళ్లారు. సాయంత్రం 5.47 సమయంలో సీఐడీ అధికారులు విచారణను ముగించుకుని బయటకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. -
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
ఒకవైపు విశాఖలోని రిషికొండపై రూ.వందల కోట్లు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలోని ప్రస్తుత కార్యాలయాన్నీ సుందరీకరిస్తున్నారు. -
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి. -
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు. -
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. -
ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రోత్సాహకాల్ని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువును మార్చింది. -
ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించేలా సిడ్బీతో ఒప్పందం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు రుణ సహకారాన్ని అందించేలా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ), ఏపీఐఐసీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి: కేవీపీఎస్
రాజకీయ క్రీడల్లో దళితులను బలి చేయొద్దని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రిలు విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా డెల్టా కాలువలకు ఆగిన నీటి సరఫరా
కృష్ణా డెల్టా కాలువలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయకట్టులో కొన్నిచోట్ల ఇంకా వరి పంట చేతికి రాలేదు. ఈ పరిస్థితుల్లో తాము నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పూల వ్యర్థాలతో పరిమళాలు
విజయవాడ నగరంలో దేవాలయాలు, పూల మార్కెట్ల నుంచి నిత్యం టన్నుకు పైగా పూల వ్యర్థాలు పోగవుతున్నాయి. -
ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు స్టే
గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. -
‘గడప గడప’లో ప్రశ్నించారని పోలీసులకు ఫిర్యాదు
‘గడపగడపకు మన ప్రభుత్వం’లో గోడు వెల్లబోసుకోవడమే ఆ తల్లీకుమారుల తప్పైంది. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారంటూ బుధవారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి
కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్తంభించిన టెలి వైద్యం.. రోగులకు అవస్థలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ) ఆందోళనల వల్ల ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా రోగులకు అందాల్సిన టెలి వైద్యసేవలు స్తంభించాయి. -
రాష్ట్రంపై నాలుగు రోజులు తుపాను ప్రభావం
ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం తీవ్రంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
విద్యామృత్ మహోత్సవ్ ఫలితాల్లో రాష్ట్రానికి రెండు పతకాలు
‘విద్యామృత్ మహోత్సవ్ 2022-2023’లో భాగంగా ‘ఇన్నోవేటివ్ పెడగాజీ’ ప్రాజెక్టు పోటీల్లో రాష్ట్రానికి రెండు స్థానాలు దక్కాయని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?