AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
శాసనసభలో సోమవారం పది బిల్లులు ఆమోదం పొందాయి. వీటిపై ఎటువంటి చర్చ లేకుండానే, సవరణలు ఎందుకు చేస్తున్నారనే వివరాలను మంత్రులు తెలియజేసిన వెంటనే అన్ని బిల్లులకు ఆమోదం లభించింది.
ఆర్టీసీ నియమావళి ప్రకారం పీటీడీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు
మొత్తం పది బిల్లులకు శాసనసభ ఆమోదం
ఈనాడు, అమరావతి: శాసనసభలో సోమవారం పది బిల్లులు ఆమోదం పొందాయి. వీటిపై ఎటువంటి చర్చ లేకుండానే, సవరణలు ఎందుకు చేస్తున్నారనే వివరాలను మంత్రులు తెలియజేసిన వెంటనే అన్ని బిల్లులకు ఆమోదం లభించింది.
- ఎసైన్డ్ భూములను పొందిన నాటి నుంచి 20 ఏళ్ల తర్వాత, ఇంటి స్థలాలను పదేళ్ల తర్వాత బదలాయించే హక్కు కల్పిస్తూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టిన ఏపీ ఎసైన్డ్ భూముల సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.
- ఉమ్మడి రాష్ట్రంలో భూదాన్, గ్రామ్దాన్ చట్టం అమల్లో ఉండేది. ప్రస్తుతం తెలంగాణ విడిపోయినందున దానికి అనుగుణంగా కొన్ని మార్పులతోపాటు, భూదాన్ ద్వారా వచ్చిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, భూదాన్ బోర్డును ప్రభుత్వం నియమించేలా సవరణలతో మంత్రి ధర్మాన ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది.
- ప్రజా రవాణాశాఖలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంకా సీసీఏ నియమావళి రూపొందించలేదు. దీంతో ఆర్టీసీ పాత నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తమపై ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఎలా చర్యలు తీసుకుంటారని కొందరు ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఏ నియమాలు రూపొందించే వరకు, ఆర్టీసీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రవేశపెట్టగా, దీనికి ఆమోదం లభించింది.
- నాలుగు చక్రాల సరకు రవాణా ఆటోలకు జీవిత పన్ను బదులు త్రైమాసిక పన్ను వసూళ్లకు వీలు కల్పించడం, మోటారు వాహన చట్టంలో వాహన ధర అంటే ఇన్వాయిస్ ప్రకారం అని పరిగణనలోకి తీసుకునేలా రెండు వేర్వేరు సవరణ బిల్లులను మంత్రి విశ్వరూప్ ప్రవేశపెట్టగా సభ ఆమోదం పొందాయి.
- కళాశాలలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మారాలన్నా, కొత్తగా ఏర్పాటు చేయాలన్నా.. వాటికి టైమ్స్, క్యూఎస్ ఇచ్చే తొలి 100 ర్యాంకుల్లో ఉన్న వర్సిటీల్లో ఏదైనా ఒకదానితో ఒప్పందం చేసుకొని, జాయింట్ సర్టిఫికేషన్ ఇచ్చేలా ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.
- విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలకు ఏపీపీఎస్సీ ప్రాథమిక పరీక్ష నిర్వహించేలా గతంలో 13 వర్సిటీలకు మాత్రమే అవకాశం ఉండగా, రాష్ట్రంలో మిగిలిన వాటికి కూడా ఇదే విధానం వర్తించేలా సవరణ బిల్లును సీఎం జగన్ తరఫున వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రవేశపెట్టగా సభలో ఆమోదం లభించింది.
- దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలు, సంస్థల ఆదాయ పరిమితులు మార్చడం, కౌలు, లైసెన్సు గడువు ముగిసినా ఖాళీచేయకుండా ఆక్రమణలో ఉన్నవారిపై బెయిల్ లభించని కేసులు పెట్టడం, వీటిపై సంబంధిత ఈవోలు, ఆపై అధికారులు చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించే సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
- బధిరుల టెన్నిస్ జట్టు భారత కెప్టెన్ షేక్ జఫ్రీన్కు క్రీడల కేటగిరీలో సహకారశాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్గా గ్రూప్-1 సర్వీసులో నియమించేలా.. ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించే బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.
- జీఎస్టీ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలను ఆయా రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుందని, ఇటువంటి పలు సవరణలకు చెందిన బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇవి నగరాలు కావు..’ ప్రత్యక్ష నరకాలు
నగరాలు... మానవ ప్రగతికి చిహ్నాలు. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువత ఉపాధికి ఊతమిస్తాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తాయి. -
బాబోయ్ ‘ఖర్సయిపోతాం’!
అధికార వైకాపాలో కొన్ని లోక్సభ స్థానాల టికెట్లకు పెద్దలు అడుగుతున్న ‘పార్టీ ఫండ్’ అంకె విని అభ్యర్థులు గుడ్లు తేలేస్తున్నారు. -
తుపాను ఊడ్చేసింది
మిగ్జాం అపారమైన పంటనష్టాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. -
‘ఎన్నికల ముంగిట్లో..’ గ్రూపు-2 ముచ్చట!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన నేడు
మిగ్జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. -
రాజ్భవన్లో సాయుధ దళాల జెండా దినోత్సవం
-
‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకావిష్కరణ
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువారి ప్రస్థానానికి ప్రతిబింబమే ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకమని రచయిత మల్లికేశ్వరరావు కొంచాడ తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్లతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. -
గుంతల దారుల్లో కూరుకుపోతున్నా పట్టించుకోరేం?
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. -
అవే పనులు.. 2 సార్లు శంకుస్థాపనలు
దుర్గగుడిలో అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదం పోటు, కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద రాజద్వారంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. -
హైకోర్టు ముందు జగన్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు
‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు. -
‘పదండి దూసుకు..’ పదండి వెనక్కి!
పోలవరం... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. -
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాప్తానిపాలేనికి చెందిన కౌలు రైతు యార్లగడ్డ వీరప్రసాద్.. రూ.1.35 లక్షల పెట్టుబడితో ఆరెకరాల్లో వరి నాట్లు వేశారు. -
మీ ఓటు నమోదు చేసుకోండిలా..
ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తారుమారు కావచ్చు. అందునా రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ కీలకమే. -
రూ.5 కోట్లతో కడితే.. మరుగుదొడ్ల పక్కన పడేశారు!
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి కనకదుర్గానగర్ మీదుగా వెళ్లే మార్గంలో భక్తుల రాకపోకలకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లతో రాతి మండప దారిని నిర్మించారు. -
‘పెట్టింది తినాలి..’ పెట్టకపోతే పస్తులుండాలి!
టోఫెల్ శిక్షణ, ట్యాబ్లూ, స్మార్ట్టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు... ట్రిపుల్ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. -
ప్రకాశం బ్యారేజీ 30 గేట్ల ఎత్తివేత
భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి గురువారం ఉదయం సుమారు 30,000 క్యూసెక్కుల మేర వరద వచ్చింది. -
భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం
బాపట్ల జిల్లా భర్తిపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా సానుభూతిపరులు ధ్వంసం చేశారు. -
మహిళాశక్తి.. బైబిల్ భక్తి!
కలెక్టరేట్లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వాడుకోవడం వివాదాస్పదమైంది. -
కేజీబీవీ కార్యదర్శికి జాతీయ అవార్డు
విద్యారంగంలో ఉత్తమ ఆవిష్కరణలు, అభ్యసన విధానం అమలుకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కార్యదర్శి మధుసూదనరావుకు జాతీయ అవార్డు లభించింది. -
‘కూర్చుంటే ఒకటి.. నడిస్తే ఒకటి..’
ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నాయని చినజీయర్ స్వామి విమర్శించారు.