ముర్మూజీ.. జోక్యం చేసుకోండి
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, తక్షణం కలగజేసుకుని ఆయనకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు
రాష్ట్రంలో దళితులు, ఓబీసీలు, మహిళలపై దమనకాండ
దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లోకేశ్, తెదేపా ఎంపీల వినతి
ఈనాడు - దిల్లీ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, తక్షణం కలగజేసుకుని ఆయనకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో దళితులు, ఓబీసీలపై ఇది వరకూ ఎన్నడూ లేనంత దమనకాండ జరుగుతోందని, ప్రభుత్వపరంగా జరుగుతున్న ఆ అరాచకాన్ని కూడా అడ్డుకోవాలని కోరారు. పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కె.రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్లతో కలిసి లోకేశ్ మంగళవారం ఇక్కడ రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘సెప్టెంబర్ 9 తెల్లవారుజామున చంద్రబాబునాయుడిని అన్యాయంగా అరెస్టు చేశారు. తర్వాత సీఐడీ కోర్టు ఆయన్ను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. చట్ట, న్యాయ నిబంధనలను నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తూ ఆయన్ను అరెస్టు చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో ఉన్న చంద్రబాబు పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీయడానికి రాజకీయ ప్రతీకారంతో ఆయనపై కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐడీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్రపతికి వివరణ ఇచ్చారు.
1. మనీ ట్రయల్ సాక్ష్యాధారాలు లేవు
రూ.371 కోట్ల అవినీతిలో డబ్బు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీలకు వెళ్లిందని సీఐడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, దాని తరఫున వాదిస్తున్న న్యాయవాదులు కానీ అందుకు ఆధారాలేవీ చూపలేదు. చంద్రబాబు రిమాండ్ నివేదికలో కూడా ఈ ఆర్థిక లావాదేవీల్లో ఆయనకు, కుటుంబానికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు.
2. చంద్రబాబును కేసులో చేర్చడంలో అక్రమాలు
ఈ కేసు ఎఫ్ఐఆర్లో తొలుత చంద్రబాబు పేరు చేర్చలేదు. ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత చేర్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం. పైగా చంద్రబాబు లాంటి ప్రజాప్రతినిధి అరెస్టుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ దర్యాప్తు అధికారి గవర్నర్ అనుమతి కోరలేదు. అందువల్ల ఆయన అరెస్టు చెల్లదు. పైగా, ప్రజాప్రతినిధి దర్యాప్తుకు సహకరించకపోతేనో, సాక్షులను బెదిరిస్తేనో, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తేనో మాత్రమే అరెస్టు చేయాలి. చంద్రబాబు వీటిలో వేటికీ పాల్పడలేదు కాబట్టి ఆయన అరెస్టు నిబంధనలకు పూర్తి విరుద్ధం.
3. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, టెండర్ నిబంధనలు
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రారంభానికి టెండర్లు పిలవలేదని ఆరోపిస్తున్నారు. సీమెన్స్ లాంటి సంస్థ 90% మొత్తాన్ని గ్రాంట్ రూపంలో పెట్టడానికి ముందుకొచ్చినప్పుడు సహజంగానే టెండర్ల అవసరం ఉండదు. ఎలాంటి టెండర్లు లేకుండానే నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి ఒప్పందాలే చేసుకున్నారు. అందువల్ల టెండర్లు లేకపోవడం వల్ల ఇక్కడేదో అన్యాయం, అవినీతి జరిగిందని చెప్పడానికి వీల్లేదు.
4. ఫోరెన్సిక్ ఆడిట్ ప్రశ్నార్థకం
ఈ పథకంలో ఆర్థిక అవకతవకలను కనిపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిటే ప్రశ్నార్థకం. ఆ ఆడిట్ నిర్వహించిన శరత్ అండ్ అసోసియేట్స్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంపెనీల ఆడిట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ మధ్య పంచుకున్న ఐపీ చిరునామాలు ఈ ఆడిట్, దాని స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఆడిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా తయారైనట్లు ఈ షేర్డ్ ఐపీ అడ్రస్ ద్వారా తెలుస్తోంది.
5. కంపెనీల పన్ను ఎగవేత
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలులో పాలుపంచుకున్న డిజైన్ టెక్ కంపెనీతో సంబంధం ఉన్న కంపెనీల పన్ను ఎగవేతను ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టకూడదు. పన్ను చెల్లింపు బాధ్యత సంబంధిత కంపెనీలదే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాత్ర జీఎస్టీ నిబంధనలకు కట్టుబడటం వరకే. అది ఆ పనిని సక్రమంగా నిర్వహించింది.
6. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం విజయవంతం
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో ఏమీ లేదని సీఐడీ ఆరోపిస్తున్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. అందులో ఎంతో పురోగతి జరిగింది. 6 ఎక్స్లెన్స్ సెంటర్లు, 34 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లు పనిచేస్తున్నాయి. వాటి పనితీరును అభినందిస్తూ ఏపీ ప్రభుత్వ అధికారులు డిజైన్టెక్ సంస్థకు ధ్రువపత్రాలు కూడా జారీ చేశారు. పైగా ఏపీ హైకోర్టు సీమెన్స్, డిజైన్టెక్ ప్రతినిధులకు బెయిల్ మంజూరు చేస్తూ ఆ ప్రాజెక్టులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని చెప్పింది. 2.13 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చినందుకు, 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేయూతనిచ్చినందుకు అభినందించింది.
7. నైపుణ్యాభివృద్ధికి చంద్రబాబు కృషి
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2018, 2019ల్లో ఆంధ్రప్రదేశ్.. దిల్లీ, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్లాంటి రాష్ట్రాలను వెనక్కు నెట్టి నైపుణ్యాభివృద్ధిలో టాప్ ర్యాంకులో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
వైకాపా తన ప్రచారానికి దేనిని వదలడం లేదు. చివరికి ప్రభుత్వ నిధులతో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలకు సంబంధించిన పరికరాలను సైతం పార్టీ ప్రచారానికి వాడుకుంటోంది. -
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్మెన్ సుజిత్ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్ప్రెస్కు సోమవారం పెను ప్రమాదం తప్పింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రామాణిక విద్యకు ఛార్జి మెమోలే పరిష్కారమా?
ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసి, ఛార్జిమెమో ఇవ్వడం ద్వారా విద్యారంగంలోని సమస్యలు పరిష్కారం అవుతాయా అని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
ఏపీలో ఎయిర్ఫైబర్ సేవలు విస్తరించిన జియో
రిలయన్స్ జియో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఎయిర్ఫైబర్ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
Ramana Deekshitulu: తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు
తితిదే అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్ (ట్విటర్)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. -
ఐఐటీఎఫ్లో ఏపీ పెవిలియన్కు మూడో బహుమతి
దేశ రాజధాని దిల్లీ ప్రగతిమైదాన్లో ఈనెల 14 నుంచి 27 వరకు నిర్వహించిన భారత అంతర్జాతీయ వ్యాపారమేళా (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ఫెయిర్- ఐఐటీఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసిన పెవిలియన్కు మూడో బహుమతి దక్కింది. -
కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప!
విద్యుత్ పంపిణీ సంస్థలకూ (డిస్కంలు) జగన్ ‘షాక్’ తప్పలేదు. ఈ ఏడాది జులై నాటికి వాటి నెత్తిన ప్రభుత్వం రూ.19 వేల కోట్ల కొత్త అప్పులు పెట్టింది. ఇప్పటికే డిస్కంలు నెలవారీ నిర్వహణ ఖర్చులకూ సతమతమవుతున్నాయి. -
అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో అంచనాలకు మించి తరలివచ్చారు. సుమారు రెండు లక్షలకు పైగా ప్రదక్షిణలో పాల్గొన్నారని అధికారుల అంచనా. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
స్మార్ట్మీటర్ల ఏర్పాటు.. మోదీ మెప్పుకోసమే
‘స్మార్ట్మీటర్ల ఏర్పాటును భాజపా పాలిత రాష్ట్రాలు సహా అందరూ వ్యతిరేకిస్తున్నారు. మోదీ మెప్పు కోసం ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల వ్యవసాయ పంపుసెట్లు సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్మార్ట్మీటర్లను బిగించడానికి సన్నాహాలు చేస్తోంది’ -
రాజధానిలో యథేచ్ఛగా రహదారుల విధ్వంసం
రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం బోరుపాలెం ఇసుక రీచ్ వద్ద రోడ్డు తవ్వుకుపోయిన దొంగలు.. -
పుడమితల్లికి సేవ.. లాభాల సాగుకు తోవ
ఏ పంటైనా సరే.. విత్తు దగ్గర నుంచి కోత వరకు కనీసం 60- 180 రోజుల సమయం పడుతుంది. అదే ప్రతివారం ఏదో ఒక పంట కోతకు వచ్చి ఆదాయం చేతికందితే ఎలా ఉంటుంది. అదే చేసి చూపించారు.. అనంతపురం జిల్లాకు చెందిన రైతు నారాయణప్ప. -
పశువులూ అల్లాడుతున్నాయ్!
నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి. -
వచ్చామా.. చూశామా.. వెళ్లామా..!
ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన హడావుడిగా సాగింది. కొన్ని చోట్ల ఆయన పదేసి నిమిషాలపాటు మాత్రమే పరిశీలించారు. -
Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
పెద్దిరెడ్డి ఇలాకాలో భూసేకరణపై రైతుల మండిపాటు
విద్యుత్తు బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్కు తమ భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. -
వెలిగొండ గుండె మండుతోంది!
వచ్చే ఏడాది సెప్టెంబరు, అక్టోబరుకల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, జలాశయంలో నీటిని నిలుపుతాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టు నిర్వాసితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ప్యాకేజీ అందిస్తాం. -
డి-ఫార్మసీ(పాలిటెక్నిక్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కళాశాలల్లో డి-ఫార్మసీ కోర్సు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. -
ఇటొస్తే.. ఇరుక్కున్నట్లే..!
గుంతల రహదారులు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. రాకపోకలు సాగించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రహదారుల దుస్థితికి ఈ చిత్రం నిదర్శనం.


తాజా వార్తలు (Latest News)
-
China: ప్రాణం తీసిన గేమింగ్.. ఐదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి
-
Rahul Gandhi: శీతాకాల సమావేశాల వేళ.. మళ్లీ విదేశాలకు రాహుల్..!
-
Uttarakhand Tunnel: మిగిలిన 2 మీటర్ల డిగ్గింగ్.. కూలీలను తీసుకొచ్చేందుకు మరికొన్ని గంటలు
-
Girl Kidnap: బాలిక కిడ్నాప్.. రూ.10 లక్షల డిమాండ్
-
Stock Market: ఆద్యంతం ఒడుదొడుకులు.. ఆఖర్లో లాభాలు.. 19,880 ఎగువన నిఫ్టీ
-
Rashmika: అవధులు లేని మీ అభిమానానికి కృతజ్ఞతలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక