‘ఐప్యాక్’ రోడ్లా.. అయితే మాకేంటి!
అత్యంత ఘోరంగా ఉన్న రహదారులను వెంటనే బాగు చేయాలని ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ-ప్యాక్ బృందం సూచించగా.. వాటికి పరిపాలన అనుమతులిచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తిచేశాక గుత్తేదారులు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.
ప్రభుత్వానికి రహదారుల గుత్తేదారుల ఝలక్
టెండర్లు పూర్తయినా ఒప్పందాలకు ససేమిరా
ఈనాడు, అమరావతి: అత్యంత ఘోరంగా ఉన్న రహదారులను వెంటనే బాగు చేయాలని ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ-ప్యాక్ బృందం సూచించగా.. వాటికి పరిపాలన అనుమతులిచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తిచేశాక గుత్తేదారులు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. పనులకు నిధులు ఎక్కడినుంచి తెస్తారో స్పష్టతనివ్వాలని, పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారిని ఒప్పించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. రాష్ట్రంలో ఏయే రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు మొదలుకొని ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ఎవరిని అడిగినా రహదారుల జాబితా చెబుతారు.
పైగా వాలంటీర్లతోపాటు అత్యధిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి చెందినవారే ఉన్నారు. వీరెవరినీ కాదని ఐప్యాక్ బృందాన్ని ప్రభుత్వం నమ్ముకుంది. వచ్చే ఎన్నికలనాటికి ఓటర్లపై ప్రభావం చూపే రహదారులంటూ ఐ-ప్యాక్ బృందం రాష్ట్రవ్యాప్తంగా 437 రోడ్లలో 3,432 కి.మీ.లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని సూచించింది. వీటికి ప్రభుత్వం హైఇంపాక్ట్ రోడ్లుగా పేరుపెట్టి రూ.1,122 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది. 2023-24 బడ్జెట్లోనూ వీటికి రూ.900 కోట్లు చూపారు. జిల్లాలవారీగా వీటికి ఆర్అండ్బీ ఇంజినీర్లు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాక ఇప్పుడు ఒప్పందం చేసుకోవడానికి గుత్తేదారులు ససేమిరా అంటున్నారు.
గత అనుభవాలతో మేలుకొని..
జగన్ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రహదారుల మరమ్మతు చేసిన గుత్తేదారులకు కనీస చెల్లింపుల విషయంలోనూ చుక్కలు చూపిస్తోంది. ఒక్క ఏడాది మాత్రమే రహదారుల రెన్యువల్ పనులు చేశారు. అది కూడా బ్యాంకు నుంచి రూ.2 వేల కోట్ల రుణం తీసుకొని నేరుగా ఆ బ్యాంకు నుంచే చెల్లింపులు చేసేలా ఏర్పాటుచేస్తేనే గుత్తేదారులు ముందుకొచ్చారు. కేంద్ర రహదారి నిధి, న్యూడెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) ప్రాజెక్టుల్లో రహదారుల పనులు చేస్తున్న గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు లేవు. తాజాగా ఐప్యాక్ సూచించిన పనులు చేస్తే చెల్లింపులు ఎలా చేస్తారని గుత్తేదారులు సందేహిస్తున్నారు.
అవిగో నిధులు అని చూపేలా..
నాబార్డు రుణం కింద కొంత మొత్తం, కేంద్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కొంత మొత్తం ఈ పనులకు కేటాయించనున్నట్లు చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ.400 కోట్ల మేర నాబార్డు రుణం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే నాబార్డు కొత్త రహదారుల నిర్మాణం, పటిష్ఠపరచడం (స్ట్రెంగ్తనింగ్)కే నిధులిస్తుంది. ఆర్అండ్బీ మాత్రం రోడ్ల రెన్యువల్కు నిధులు వినియోగించాలని భావిస్తోంది. దీనికి నాబార్డు సమ్మతిస్తుందా? అనేది సందేహమే. కేంద్ర విపత్తు నిర్వహణ నిధి కింద దాదాపు రూ.350 కోట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. గతేడాది ఇవే నిధులను ఎలా ఖర్చు చేశారనే పత్రాలు చూపాల్సి ఉంటుంది. ఆ యుటిలైజేషన్ సర్టిఫికేట్లను ఎలా చూపాలనేదీ అధికారులకు అంతుచిక్కడం లేదు.
బకాయిలు ఇవ్వాల్సిందే..
ఇదే అదనుగా బకాయిలు చెల్లించి తీరాల్సిందేనని గుత్తేదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో బకాయిలు రాబట్టుకోవాలని చూస్తున్నారు. గతేడాది గుంతలు పూడ్చిన పనులకు, ఎన్డీబీ, కేంద్ర రహదారి నిధి.. తదితర పనుల బకాయిలు చెల్లిస్తే ఒప్పందాలు చేసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాజెక్టుల కింద రహదారుల పనులు చేసిన గుత్తేదారులకు దాదాపు రూ.500-600 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. -
ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రోత్సాహకాల్ని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువును మార్చింది. -
ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించేలా సిడ్బీతో ఒప్పందం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు రుణ సహకారాన్ని అందించేలా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ), ఏపీఐఐసీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి: కేవీపీఎస్
రాజకీయ క్రీడల్లో దళితులను బలి చేయొద్దని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రిలు విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా డెల్టా కాలువలకు ఆగిన నీటి సరఫరా
కృష్ణా డెల్టా కాలువలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయకట్టులో కొన్నిచోట్ల ఇంకా వరి పంట చేతికి రాలేదు. ఈ పరిస్థితుల్లో తాము నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పూల వ్యర్థాలతో పరిమళాలు
విజయవాడ నగరంలో దేవాలయాలు, పూల మార్కెట్ల నుంచి నిత్యం టన్నుకు పైగా పూల వ్యర్థాలు పోగవుతున్నాయి. -
ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు స్టే
గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. -
క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
ఒకవైపు విశాఖలోని రిషికొండపై రూ.వందల కోట్లు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలోని ప్రస్తుత కార్యాలయాన్నీ సుందరీకరిస్తున్నారు. -
‘గడప గడప’లో ప్రశ్నించారని పోలీసులకు ఫిర్యాదు
‘గడపగడపకు మన ప్రభుత్వం’లో గోడు వెల్లబోసుకోవడమే ఆ తల్లీకుమారుల తప్పైంది. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారంటూ బుధవారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి
కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్తంభించిన టెలి వైద్యం.. రోగులకు అవస్థలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ) ఆందోళనల వల్ల ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా రోగులకు అందాల్సిన టెలి వైద్యసేవలు స్తంభించాయి. -
రాష్ట్రంపై నాలుగు రోజులు తుపాను ప్రభావం
ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం తీవ్రంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
విద్యామృత్ మహోత్సవ్ ఫలితాల్లో రాష్ట్రానికి రెండు పతకాలు
‘విద్యామృత్ మహోత్సవ్ 2022-2023’లో భాగంగా ‘ఇన్నోవేటివ్ పెడగాజీ’ ప్రాజెక్టు పోటీల్లో రాష్ట్రానికి రెండు స్థానాలు దక్కాయని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఏ దారి చూసినా.. ఏమున్నది గర్వకారణం!
చిత్తూరు జిల్లా యాదమరి మండల సరిహద్దుల్లోని చిత్తూరు-గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారి పరిస్థితి ఇదీ.. మంగళవారం అర్ధరాత్రి దాటాక సరకుతో వెళ్తున్న ఓ లారీ జోడిచింతల పోలీస్స్టేషన్ సమీపంలో రోడ్డుపైనున్న భారీ గుంతలో ఇరుక్కుపోయింది. -
నేడు తిరుమలకు చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.