అవయవదానంతో అమరుడయ్యాడు
పుట్టిన రోజు వేడుకలు జరిగిన నాలుగు రోజులకే కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి బ్రెయిన్ డెడ్
గంటల వ్యవధిలోనే మరొకరికి గుండెమార్పిడి
వివిధ ఆసుపత్రులకు అవయవాలు
తిరుపతి (విద్య), గుంటూరు (నగరంపాలెం, నెహ్రూనగర్) - న్యూస్టుడే: పుట్టిన రోజు వేడుకలు జరిగిన నాలుగు రోజులకే కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అతను ఇక బతకడని.. బ్రెయిన్డెడ్ అయ్యాడని డాక్టర్లు చెప్పడంతో గుండెలు పగిలి శోకంలో మునిగిపోయారు. ఆ తర్వాత తేరుకుని తమ బిడ్డ అవయాలను దానం చేయడానికి ఒప్పుకొన్నారు. హృదయాలను పిండేయటంతో పాటు స్ఫూర్తి నింపే ఈ ఘటన గుంటూరులో జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కట్టా కృష్ణ (19) ఈ నెల 23న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రగాయాలపాలైన అతడిని గుంటూరు రమేష్ ఆసుపత్రికి తీసుకురాగా.. అక్కడి వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. దీంతో అతడి గుండె, లివర్, రెండు కిడ్నీలు, నేత్రాలను దానం చేయడానికి తల్లిదండ్రులు మల్లేశ్వరి, రాజు ముందుకొచ్చారు. దీంతో గుంటూరు నుంచి మంగళవారం గ్రీన్ఛానల్ ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాలకు అవయవాలను తరలించారు.
హెలికాప్టర్ ద్వారా తిరుపతికి గుండె..
రమేష్ ఆసుపత్రిలో కృష్ణ అవయవాలను వేరు చేసి గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. మధ్యాహం 3:30 గంటలకు అంబులెన్స్లో గుంటూరు పోలీసు కవాతు మైదానానికి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తిరుపతికి తరలించారు. లివర్ను విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రికి, కిడ్నీలను గుంటూరు రమేష్ ఆసుపత్రి, విజయవాడ ఆయుష్ ఆసుపత్రులకు, కళ్లను గుంటూరులోని సుదర్శన్ కంటి ఆసుపత్రికి తరలించారు. ‘చదువుకొని తల్లిదండ్రులతో పాటు పదిమందికి సాయపడాలన్నది వాడి కల. ఇలాగైనా వాడి కల నెరవేరినట్లు అనుకుంటాం’ అని కృష్ణ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వీరికి కృష్ణతో పాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటోలో ఉల్లిపాయలు అమ్ముకొని జీవిస్తుండగా కుమారుడి చికిత్స కోసం ఆ వాహనాన్ని అమ్మేశారు.
సీఎం జగన్ ప్రత్యేక చొరవ..
హెలికాప్టర్ ద్వారా గుండెను తిరుపతి తరలించడానికి సీఎం జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. విలువైన సమయం వృథా కాకూడదని జగన్ ఈ ఏర్పాటు చేశారని పేర్కొంది. మరోవైపు హెలికాప్టర్లో కృష్ణ గుండె వస్తుందని తెలిసి, తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ శ్రీనాథ్రెడ్డి పర్యవేక్షణలో కర్నూలు జిల్లాకు చెందిన 33 ఏళ్ల యువకుడికి ఆ గుండెను అమర్చి ప్రాణదానం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. -
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
ఒకవైపు విశాఖలోని రిషికొండపై రూ.వందల కోట్లు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలోని ప్రస్తుత కార్యాలయాన్నీ సుందరీకరిస్తున్నారు. -
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి. -
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు. -
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. -
ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రోత్సాహకాల్ని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువును మార్చింది. -
ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించేలా సిడ్బీతో ఒప్పందం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు రుణ సహకారాన్ని అందించేలా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ), ఏపీఐఐసీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి: కేవీపీఎస్
రాజకీయ క్రీడల్లో దళితులను బలి చేయొద్దని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రిలు విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా డెల్టా కాలువలకు ఆగిన నీటి సరఫరా
కృష్ణా డెల్టా కాలువలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయకట్టులో కొన్నిచోట్ల ఇంకా వరి పంట చేతికి రాలేదు. ఈ పరిస్థితుల్లో తాము నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పూల వ్యర్థాలతో పరిమళాలు
విజయవాడ నగరంలో దేవాలయాలు, పూల మార్కెట్ల నుంచి నిత్యం టన్నుకు పైగా పూల వ్యర్థాలు పోగవుతున్నాయి. -
ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు స్టే
గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. -
‘గడప గడప’లో ప్రశ్నించారని పోలీసులకు ఫిర్యాదు
‘గడపగడపకు మన ప్రభుత్వం’లో గోడు వెల్లబోసుకోవడమే ఆ తల్లీకుమారుల తప్పైంది. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారంటూ బుధవారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి
కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్తంభించిన టెలి వైద్యం.. రోగులకు అవస్థలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ) ఆందోళనల వల్ల ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా రోగులకు అందాల్సిన టెలి వైద్యసేవలు స్తంభించాయి. -
రాష్ట్రంపై నాలుగు రోజులు తుపాను ప్రభావం
ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం తీవ్రంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
విద్యామృత్ మహోత్సవ్ ఫలితాల్లో రాష్ట్రానికి రెండు పతకాలు
‘విద్యామృత్ మహోత్సవ్ 2022-2023’లో భాగంగా ‘ఇన్నోవేటివ్ పెడగాజీ’ ప్రాజెక్టు పోటీల్లో రాష్ట్రానికి రెండు స్థానాలు దక్కాయని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు