చంద్రబాబు తప్పు చేయరని విచారణ అధికారులకూ తెలుసు
45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏ తప్పూ చేయలేదనే నమ్మకం నాకుంది. ప్రభుత్వాలు మారాయి. ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. దేన్నీ నిరూపించలేక పోయాయి.
ప్రజల కోసం ఆలోచించే నేతను అక్రమంగా జైలులో పెట్టారు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం సాగుతుంది: చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏ తప్పూ చేయలేదనే నమ్మకం నాకుంది. ప్రభుత్వాలు మారాయి. ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. దేన్నీ నిరూపించలేక పోయాయి. రాష్ట్ర ప్రజల కోసమే చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తారు. ప్రజలకు ఏం చేయాలి? ఏం చేస్తే వారి కాళ్ల మీద వారు నిలబడతారు? ఏ పరిశ్రమ వస్తే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే ధ్యాసతోనే ఉంటారు. ఇంట్లో అందరం కలసి భోజనం చేసేటప్పుడూ అదే ఆలోచన. మీ కోసమే ఆలోచించే వ్యక్తిని ఏ తప్పూ చేయకపోయినా, జైల్లో నిర్బంధించారు. ఇప్పటికీ చిన్న ఆధారాన్నీ చూపించలేదు.
భువనేశ్వరి
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, సీతానగరం, నగరపాలక సంస్థ, టి.నగర్: ఏ తప్పూ చేయకపోయినా అక్రమంగా కేసు నమోదు చేసి.. చంద్రబాబును 19 రోజులుగా జైల్లో నిర్బంధించారని ఆయన సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని బుధవారం ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రూ.371 కోట్ల అక్రమం జరిగిందని అంటున్నారు.. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? ఏ ఖాతాలో వేశారు? నిజానిజాలు తెలుసుకున్నాకే ఎవరినైనా నిర్బంధించాలి. ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని నేనెప్పుడూ చూడలేదు. చంద్రబాబును జైలులో పెట్టాక సీఐడీ అధికారులు రెండురోజులు ప్రశ్నించారు. సీఐడీ వారినే చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తారని నేను ముందే ఊహించా. ఆయనపై నాకు ఉన్న నమ్మకం అలాంటింది. చంద్రబాబు తప్పు చేయరని విచారణకు వచ్చిన అధికారులకూ తెలుసు’ అని భువనేశ్వరి చెప్పారు.
మహిళలంటే గౌరవం
‘చంద్రబాబుకు మహిళలంటే నమ్మకం, గౌరవం. ఆయన అరెస్టు తెలియగానే ఎంతోమంది మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. చంద్రబాబు పాలనంటే అందరికీ అంత నమ్మకం. ఆయన సీఎంగా కారులో వెళ్తుంటే రోడ్డుపై గుంత కనిపించినా, కాలువ సరిగా లేకపోయినా, లీకేజీ ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేసేవారు. అమరావతి నిర్మాణ సమయంలో వీధి దీపాల నిర్వహణను యాప్లో చూసి అధికారులకు సూచనలు చేసేవారు’ అని భువనేశ్వరి వివరించారు. ‘స్కిల్ కేంద్రాలతో లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఇప్పుడు అనేక మంది రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. కొందరు కంపెనీలు పెట్టి సీఈవోలు అయ్యారు’ అని భువనేశ్వరి వివరించారు.
వృద్ధురాలిపై హత్యాయత్నం కేసు
70 ఏళ్ల మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆసుపత్రిలో ఉంటే ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో అర్థం ఉందా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. కుప్పంలో నిరసన తెలిపిన మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టారని, కొవ్వొత్తుల ర్యాలీలు చేసిన వారిని తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, ప్రభుత్వం ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారని విమర్శించారు.
నాకు జరిగిన అవమానాన్ని మరచిపోను
‘నేనూ మహిళనే. నాకు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మరచిపోను. నాపై అనేక విమర్శలు చేశారు. ఎవరి కోసమో నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా మనస్సాక్షి, మావారు నమ్మితే చాలు. పనిలేని మగవాళ్లు అలాగే మాట్లాడతారు. మహిళలు పట్టించుకోవద్దు. ఈ సృష్టికి మూలం మహిళ అనే సంగతిని వాళ్లు వాళ్లు మరచిపోయారు’ అని భువనేశ్వరి అన్నారు.
ఎవరూ ఏమీ చేయలేరు
‘కుటుంబమనే ఆలోచనే లేకుండా.. మీ అందరి కోసం చంద్రబాబు రేయింబవళ్లూ కష్టపడేవారన్నారు. ఇప్పుడు మీరంతా రేపటి గురించి ఆలోచించాలి. ఉపాధి, రేపటి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలి. ప్రజలంతా చేతులు కలిపితే ఎవరూ ఏమీ చేయలేరు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా.. అందరం కలసి శాంతియుతంగా పోరాడదాం’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. సేవ్ డెమోక్రసీ.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. సత్యమేవ జయతే... అంటూ మహిళలతో నినాదాలు చేయించారు. కార్యక్రమంలో తెదేపా నేతలు నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్ జవహర్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అమరావతి దళిత జేఏసీ ప్రతినిధి కొలికపూడి శ్రీనివాసరావు, రాజానగరం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఓపిక చేసుకుని తిరుగుతా..
- కొండేటి అనంతలక్ష్మి
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు పంపడాన్ని టీవీల్లో చూసి 82 ఏళ్ల వయసులో నా గుండె తరుక్కుపోతోంది. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే దాకా ఓపిక చేసుకుని తిరుగుతూనే ఉంటా.
శిబిరం వద్ద హైడ్రామా
రాజమహేంద్రవరంలో చంద్రబాబు కుటుంబసభ్యులు ఉంటున్న శిబిరం దగ్గర బుధవారం కొంత హైడ్రామా చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పీఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ శిబిరానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వారి కళ్లుగప్పి శిబిరానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పసుపులేటి అభిమానులు శిబిరానికి వస్తుండగా 500 మీటర్ల దూరంలో పోలీసులు వారిని ఆపేశారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
‘యువతకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో లోకేశ్ యువగళం ప్రారంభించారు. తొలుత లోకేశ్ మాట్లాడే సౌండ్ సిస్టం వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఒక మైక్, స్టూల్ ఏర్పాటు చేసుకుంటే పనిలేని పోలీసులు వాటినీ తీసుకెళ్లిపోయారు. మైక్ తీసేస్తే యువగళం ఆగుతుందా? ఎన్ని అడ్డంకులు సృష్టించినా సాగుతుంది. మనమంతా చేయిచేయి కలిపి ముందుకెళ్దాం. చంద్రబాబుకు మద్దతుగా సాగుదాం’
నారా భువనేశ్వరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన వియ్యంకుడి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి నెలకొంది. -
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!
ప్రసవవేదన పడుతున్న నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించే దారి సక్రమంగా లేక... సకాలంలో వైద్యం అందక ఓ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. -
ఉచిత బీమాపై జగన్నాటకం!
కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పోర్టల్లో ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నమోదైన ఈ వివరాలు నివ్వెర పరుస్తున్నాయి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో ఈ సీజన్ మొత్తంలో సాగైన పంటల విస్తీర్ణం 0.04 హెక్టార్లేనా? పంట పండిస్తున్న రైతులు 16 మందేనా.. అని ఆశ్చర్యం కలుగుతోందా...? -
అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలొద్దు
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు, ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందకుండా రాష్ట్రంలో ఇసుక రీచ్లలో తవ్వకాలు చేపట్టడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. -
బలహీనపడిన తుపాను
మిగ్జాం తీవ్ర తుపాను తీరం దాటాక.. కోస్తాను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో ముంచెత్తింది. -
ఓటర్ల మెడపై నోటీసుల కత్తి
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల మెడపై కత్తి పెడుతోంది. ‘‘మీ ఫొటోతో పలానా పలానా చోట్ల ఓట్లున్నాయి. వాటిల్లో దేన్ని తొలగించాలి? దేన్ని కొనసాగించాలి? నిర్దేశిత తేదీలోగా తెలపండి’’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి నోటీసులిస్తోంది. -
నాడు ఆదర్శం... నేడు నిర్వీర్యం
రాళ్లూరప్పలూ.. కొండలూగుట్టలూ.. నడిచేందుకూ వీలులేని దారుల్లో... డోలీ మోతల్లో గిరిశిఖర గ్రామాల మహిళలు పడే ప్రసవ వేదన మాటల్లో చెప్పలేనిది. చిమ్మచీకటి, జోరు వర్షం నడుమ సకాలంలో వైద్యం అందక, పురిటినొప్పులు భరించలేక ఊపిరి వదిలిన తల్లులెందరో. అమ్మఒడిని చేరకుండానే రాలిపోయిన పసిబిడ్డలు ఇంకెందరో. -
Revanth Reddy: ఆరు గ్యారంటీలతో ఆరంభం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
వాన ముంచింది.. అన్నదాత గుండె ఆగింది
భారీ వర్షానికి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలోనే రైతు కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన బుధవారం పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకుంది. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
జగనన్న కాలనీలా.. చెరువులా?
‘ఇళ్లు కాదు...అవి ఊళ్లు’...జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన అనుచరగణమంతా చెప్పే మాటే ఇది. ఆ ఊళ్లను ఎంత సురక్షితంగా కడుతున్నారో....ఒక్క వర్షం వస్తే ఇట్టే తెలిసిపోతోంది. -
ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి ఎట్టకేలకు విడుదల చేసింది. -
జగన్ ప్రభుత్వమా.. మజాకా
వాహనాల రద్దీ పెరిగే కొద్దీ గ్రామీణ రహదారులను జిల్లా రహదారులుగా, రాష్ట్ర రహదారులుగా, జాతీయ రహదారులుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. -
సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై దృష్టి పెట్టండి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. -
వివేకా హత్య కేసులో అభియోగాల నమోదుపై 20న విచారణ
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై అభియోగాల నమోదు నిమిత్తం సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త సాఫ్ట్వేర్, మొబైల్ యాప్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త సాఫ్ట్వేర్, మొబైల్ అప్లికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందిస్తోంది. -
మునిగేది రైతన్న.. ముంచేది ఎవరన్న?
మొన్న ఏం జరిగింది? నిన్న దాని ప్రభావం ఏమిటి? నేడు ఎలా ముందుకెళ్లాలి... అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. -
నిర్మాణాలపై మూడో పక్షానికి హక్కులు కల్పించొద్దు
భూ కేటాయింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్కు కేటాయించిన 12.51 ఎకరాలను రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
విశాఖకు కార్యాలయాల తరలింపు వ్యాజ్యంపై ఏజీ అభ్యంతరం
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం.. హైకోర్టు సింగిల్ జడ్జి వద్దకు విచారణకు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. -
క్రమబద్ధీకరణ హామీకి నాలుగేళ్లు
‘మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా. నిశ్చింతగా ఉండండి’ అని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటినా ఇంత వరకు ప్రభుత్వాసుపత్రుల్లోని ట్రామాకేర్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ కార్యరూపం దాల్చలేదు.


తాజా వార్తలు (Latest News)
-
భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం
-
Hyderabad: రేవంత్ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్