ఇన్నర్ రింగ్రోడ్డులో భారీ అక్రమాలు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎసైన్డ్ భూముల స్వాధీనం, ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణ డిజైన్ల మార్పులకు అనుగుణంగా భూముల కొనుగోలులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ ఆరోపించారు.
నామినేషన్ పైనే డిజైన్ల బాధ్యతలు అప్పగించారు
శాసన సభలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపణ
ఈనాడు, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎసైన్డ్ భూముల స్వాధీనం, ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణ డిజైన్ల మార్పులకు అనుగుణంగా భూముల కొనుగోలులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. శాసనసభలో బుధవారం అమరావతి భూముల వ్యవహారంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు ఎలైన్మెంట్లో భారీఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘అమరావతిని గ్రాఫిక్స్తో గారడీ చేశారు. చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో అవినీతి అన్నది చాలా చిన్నపదం. ఐఆర్ఆర్ మలుపులు తిరిగి కొందరి భూముల వైపు వెళ్లింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తమ ఆప్తులు, సంస్థలకు అనుగుణంగా డిజైన్లలో మార్పుచేర్పులు చేసింది. డిజైన్ల తయారీ బాధ్యతలను నామినేషన్ విధానంలో మూడు సంస్థలకు అప్పగించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.28 కోట్ల ఆర్థికభారం పడింది. లింగమనేని ఎస్టేట్స్, హెరిటేజ్, ఇతర సంస్థలు పథకం ప్రకారం తక్కువ ధరకు భూములు కొన్నాయి. అప్పటి మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలు పెనమలూరు వైపు ఉన్నాయన్న ఉద్దేశంతోనూ ఇన్నర్ రింగ్రోడ్డు డిజైన్లో మార్పులు చేశారు. తక్కువ ధరలకు కొన్న భూములను ఎక్కువ ధరలకు విక్రయించారు. ఇదంతా ‘క్విడ్ ప్రో కో’ తరహాలో జరిగింది. ఇన్నర్ రింగ్రోడ్డు వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ‘కాగ్’ కూడా తేటతెల్లం చేసింది. ఈ కుంభకోణంలో సన్నకారు, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారు’’ అని ఆరోపించారు. ఇన్నర్రింగ్ రోడ్డులో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ఎలైన్మెంట్లో అనేక మార్పులు, చేర్పులు చేయడంతో కొందరికి ఆర్థికి ప్రయోజనం చేకూర్చడం ద్వారా చంద్రబాబు కుటుంబం లబ్ధి పొందిందని అన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఇదే అంశంపై మాట్లాడారు.
విచారణలో వెలుగులోకి రాకున్నా.. ఆత్మ పరిశీలన చేసుకోవాలి: ధర్మాన
రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ‘‘రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్లో పదేళ్ల వరకు ఉండొచ్చు. కానీ చంద్రబాబు తప్పులు చేసి, హడావుడిగా ఇక్కడికి వచ్చేశారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ధనంతో మౌలిక సదుపాయాలు కల్పించి, సంపన్నులకు ప్రయోజనం కల్పించారు. అదేవిధానాన్ని అమరావతిలోనూ అనుసరించారు. కోర్ కేపిటల్ ఎక్కడ వస్తుందన్నదానిపై రకరకాల ప్రచారాలు చేసి ప్రజలను అయోమయానికి గురిచేశారు. ప్రణాళిక ప్రకారం అమరావతిలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో చంద్రబాబు బృందం ఎసైన్డ్ భూములను చౌకధరలకు కొనేసింది. దూరప్రాంతాల వ్యక్తులు ఇక్కడకు వచ్చి.. వ్యవసాయ భూములు ఎలా కొన్నారు? శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను పక్కనబెట్టి.. నారాయణ నేతృత్వంలో కమిటీ వేసి, తమకు కావల్సిన ప్రతిపాదనలు చేయించుకున్నారు. అమరావతిలోని ఎసైన్డ్ భూముల రికార్డులను మాయంచేసి, పేదల భూములను లాక్కున్నారు. దర్యాప్తులో సాంకేతికపరమైన లోపాలు వెలుగులోకి రాకపోవచ్చు. కానీ ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’కు వాలంటీర్లే అంపైర్లు
ఎన్ని విమర్శలు ఎదురైనా.. లోటుపాట్లు కనిపిస్తున్నా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను మమ అనిపించడానికే ప్రభుత్వం, అధికారులు సిద్ధమయ్యారు. తగిన సాధన సంపత్తి లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి క్రీడల సందడి మొదలుకానుంది. -
Amaravati: ఏపీలో ప్లాట్ల కేటాయింపునకు ఈ-లాటరీ 15న
ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందినవారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు ఈ నెల 15న ఈ-లా టరీ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. -
అయిదు ఎకరాలు ఎందుకు? ఆరున్నరెకరాలు ఇస్తాం తీసుకో..!
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని అయిదు ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? కబ్జా నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలి. -
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు. -
సొంతిల్లు ఉన్నంత మాత్రాన నివాసితుడిగా పరిగణించొద్దు
‘ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు. -
Telangana: విద్యుత్ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు
రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..
ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు! -
Gundlakamma Reservoir: గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. -
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. -
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా..
సీఎం జగన్ తిరుపతి జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ.. ‘బాధితులకు రేషన్ బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ లీటరు, ఒక కిలో ఆనియన్, ఒక కేజీ ఉల్లిగడ్డ. -
వరద మింగిన రైతు కష్టం
మిగ్జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో పంట కోశారు. -
విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు జగన్ ప్రభుత్వం రాజకీయ చెద పట్టించింది. సరస్వతి నిలయాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చి భ్రష్ఠు పట్టించింది. అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉపకులపతు (వీసీ)లను నియమించడం.. అలా వచ్చిన వీసీలు విద్యను, విద్యార్థులను పట్టించుకోకుండా... -
తెల్లకాగితం మీద పేర్లు రాసిస్తే... ఓట్లు తొలగిస్తున్నారు
చాలా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు తెల్లకాగితాలపై పేర్లు రాసిస్తుంటే.. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
ప్రభుత్వ తీరుపై వ్యాజ్యం వేయడమే పాపమా?
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. -
కరవు కాటు.. తుపాను పోటు.. కనికరం చూపని సర్కారు
ఖరీఫ్లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్జాం తుపాను చిదిమేసింది. -
రోడ్డెక్కిన పాడి రైతులు
సీఎం జగన్ సొంత జిల్లాలోనే పాడిరైతులు గిట్టుబాటు ధర కోసం శుక్రవారం రోడ్డెక్కారు. పాలను నేలపై పారబోసి ఆగ్రహం ప్రదర్శించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమస్యపై వేడుకున్నారు. ఆపై ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయించారు. -
35 నిమిషాల్లోనే ముగించేశారు!
ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ప్రతిపక్షాలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు రెండు- మూడు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మమ అనిపిస్తున్నారు. -
తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ నారాయణ
మిగ్జాం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. -
నలుగురి ఉసురు తీసిన ముసురు
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో తట్టుకోలేక నలుగురు కౌలు రైతులు తనువు చాలించారు. కంటిపాపలా కాపాడుకున్న పంట పొలం కళ్లముందు కొట్టుకుపోవడం, వరి పనల నుంచి మొలకలు రావడం చూసి వారు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. -
ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు.. ఓట్లెలా అడుగుతాం!
కౌన్సిలర్లుగా అధికార పార్టీ నుంచి ఎన్నికైనా.. ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయామని, మరికొన్ని నెలల్లో ఎన్నికల కోడ్ వస్తుండటంతో ప్రజలను ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతామని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు తెదేపా రూ.60 లక్షల సాయం
విశాఖ చేపలరేవులో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు తెదేపా అధికారంలోకి రాగానే కొత్త బోట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్ను కట్ చేసిన సీఎం రేవంత్
-
KCR: భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
-
Bhagavanth Kesari: అలా చేసి ఉంటే.. ‘భగవంత్ కేసరి’ దెబ్బతినేది: పరుచూరి గోపాలకృష్ణ
-
TS News: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు
-
Kishan Reddy: భాజపా ఎమ్మెల్యేలతో కిషన్రెడ్డి భేటీ.. సభకు వెళ్తారా? లేదా?
-
World cup 2024: పొట్టి కప్పులో విరాట్ ఆడడా?